Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు జమ చేసిన రూ.వందల కోట్లు మాయమైన విషయం ఇంకా రగులుతూనే ఉంది. దీన్ని సాంకేతిక తప్పిదంగా రాష్ట్ర ప్రభుత్వం చూపే
జీపీఎఫ్ సొమ్ముల మాయం వెనుక కథ అదే.. ఇప్పటికే కాగ్ దృష్టి
ప్రభుత్వ వివరణపై ఎన్నో సందేహాలు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు జమ చేసిన రూ.వందల కోట్లు మాయమైన విషయం ఇంకా రగులుతూనే ఉంది. దీన్ని సాంకేతిక తప్పిదంగా రాష్ట్ర ప్రభుత్వం చూపే ప్రయత్నం చేసినా.. ఇందులో అనేక సందేహాలకు సమాధానం లభించడం లేదు. ఆర్థిక మాయకు ‘సాంకేతిక తప్పిదం’ అనే ముసుగు వేసి ప్రస్తుతానికి మమ అనిపించే ప్రయత్నాలు సాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కిందటి ఏడాది నవంబరులో కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఈ అంశంపై దృష్టి సారించారని, దీనిపై రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగుతున్నాయని తెలిసింది. ఇది సాంకేతిక తప్పిదమే అయితే ఇంత సుదీర్ఘంగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాల్సినంత అవసరం ఏముంటుందనేది చర్చనీయాంశమవుతోంది.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
* వేలమంది రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలకు జమ చేసిన జీపీఎఫ్ సొమ్ములు మాయమయ్యాయి. అసలు ఎంత మొత్తం? ఎందరి ఖాతాలకు ఇలా జరిగిందనే ప్రశ్నకు అధికారులు నోరు మెదపడం లేదు. ఇంకా పరిశీలిస్తున్నామనే ఖజానా, ఆర్థిక శాఖల అధికారులు చెబుతున్నారు.
* ఇది జరిగింది ఎప్పుడో మార్చి నెలలో... వెలుగులోకి వచ్చింది రెండ్రోజుల కిందట. ఇన్నాళ్లూ పరిశీలించలేదని చెప్పడంలో అంతరార్థం ఏమిటన్న ప్రశ్నకూ సమాధానం లేదు.
ఈ వివరణ సందేహాల మయం...
‘ఉద్యోగుల డీఏ బకాయిల బిల్లులు జీపీఎఫ్కు జమచేసేవి, నగదు రూపంలో చెల్లించేవి పేమెంట్ అప్లికేషన్కు పంపించాం. ఖజానా శాఖ డైరెక్టర్ మార్గదర్శకాల ప్రకారం ఆమోదించిన తర్వాతే పేమెంట్ అప్లికేషన్కు పంపాము. అందులో మేము చెల్లింపులు చేయకపోయినా పొరపాటున ఆ మొత్తాలు జీపీఎఫ్ ఖాతాలకు జమయ్యాయి. ఇది సాంకేతిక తప్పిదమే. ట్రెజరీ నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి జమకాని ఏ బిల్లు పెండింగులో ఉన్నా అది రద్దయిపోతుంది. అందుకే పొరపాటున జీపీఎఫ్ ఖాతాలకు జమ అయిన మొత్తాలు మళ్లీ డెబిట్ అయ్యాయి’ అని ఆర్థికశాఖ అధికారులు వివరణ ఇచ్చారు.
* ఉద్యోగుల్లో సీపీఎస్ ఉద్యోగులు, పాత పెన్షన్ విధానం ఉద్యోగులు ఉన్నారు. కరవు భత్యం బకాయిలు పాత పెన్షన్ విధానం ఉద్యోగులకు వారి ఖాతాలకు జమచేసి పదవీవిరమణ తర్వాత చెల్లిస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లిస్తారు. సాంకేతిక తప్పిదం అయితే సీపీఎస్ ఉద్యోగులకు నగదు ఎందుకు జమ కాలేదు? పుస్తకాల్లో సర్దుబాటు చేసే చోట మాత్రమే సాంకేతిక తప్పిదం ఎలా జరిగిందన్న ప్రశ్నకు సమాధానం లేదు.
ఇది పూర్తిగా ఒక ఆర్థిక మాయ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చాలా రోజులుగా ఖాతాలకు జమ చేసినట్లు చూపించిన మొత్తాలకు.. అసలు తాము ఆ బిల్లులు పాస్ చేయలేదని చెప్పడం విశేషం. అనేక రోజుల పాటు సాగిన వ్యవహారాన్ని ఎలా సాంకేతిక తప్పిదంగా పేర్కొంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు మళ్లీ ఎప్పుడు ఉద్యోగుల ఖాతాలకు జమ చేస్తారని ప్రశ్నిస్తే ఉద్యోగులంతా మళ్లీ డీఏ ఎరియర్స్ బిల్లులు పెట్టుకుని పంపిస్తే వాటిని ఆమోదించాక వారి ఖాతాలకు జమ చేస్తామని చెబుతున్నారు. ప్రజాపద్దు (పబ్లిక్ అకౌంట్)లో ఎక్కువ మొత్తాలు ఉంటే దాన్ని ప్రభుత్వ రుణంగా చూపించాల్సి వస్తుందన్న కారణంతోనే తరచూ ఈ వ్యవహారాలు సాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మొత్తం మీద ప్రభుత్వ రుణమూ, ఖర్చు కూడా తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఒక ఆర్థిక మాయకు సాంకేతిక తప్పిదం అనే ముసుగు తగిలిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం