విద్యుత్తు తీగలు తెగిపడితే.. ఈ జాగ్రత్తలు పాటించాలి
ఏదైనా వాహనంపై విద్యుత్తు తీగలు తెగిపడినప్పుడు భయాందోళనకు గురికాకుండా వాహనంలోనే ఉండిపోవాలని కేంద్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) సీఎండీ పద్మాజనార్దన్రెడ్డి
ఈనాడు- అమరావతి: ఏదైనా వాహనంపై విద్యుత్తు తీగలు తెగిపడినప్పుడు భయాందోళనకు గురికాకుండా వాహనంలోనే ఉండిపోవాలని కేంద్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) సీఎండీ పద్మాజనార్దన్రెడ్డి సూచించారు. వాహనం తలుపులు తెరచుకుని కిందికి దిగితే విద్యుత్తు షాక్కు గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఈ దృష్ట్యా వాహనంలోనే ఉండి 24 గంటలూ పనిచేసే 1912 కాల్సెంటర్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే విద్యుత్ సిబ్బంది సాయమందిస్తారని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో విద్యుత్ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో పలు జాగ్రత్తలను సూచించారు.
* వర్షాకాలంలో జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో తీవ్ర విద్యుత్తు ప్రమాదాలు జరగడానికి అవకాశముంది. వర్షాల కారణంగా విద్యుత్తు స్తంభాలు, భూమి తేమగా ఉంటాయి. విద్యుత్తు ఎర్తింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. తేమగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తాకకూడదు.
* వర్షం జల్లు ఇన్సులేటర్పై పడి నీరు నిలిచిపోతుంది. ఈ కారణంగా కండక్టర్ షార్ట్సర్క్యూట్ కావడానికి అవకాశముంది. అప్పుడు తీగలు తెగిపడే ప్రమాదముంది.
* ఏదైనా వాహనంపై విద్యుత్తు తీగలు తెగిపడినప్పుడు వాహనం తలుపు తెరచుకుని బయటకు దిగితే అందులో ఉన్నవారంతా కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యుత్తు సిబ్బంది సాయమందే వరకు వాహనం నుంచి కిందికి దిగకూడదు. ఒకవేళ వాహనంలో ఉండటం ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం వాహనం తలుపు కూడా అంటుకోకుండా రెండు కాళ్లతో గెంతుతూ వెళ్లాలి. ఇలా వాహనమున్న ప్రదేశంనుంచి సుమారు 30 అడుగుల దూరం వరకు గెంతాలి.
* గెంతుతూ వెళ్లడం ఇబ్బందిగా అనిపిస్తే కాళ్లను పైకి లేపకుండా భూమిపైనే ఉంచుతూ, మెల్లగా ముందుకు కదుపుతూ 30 అడుగుల దూరం వరకు నడవాలి.
* గాలుల కారణంగా స్తంభాలు దెబ్బతిని తీగలు వేలాడుతుంటే అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. తీగలకు దగ్గరకు వెళ్లినా విద్యుత్తుషాక్కు గురయ్యే ప్రమాదముంది. షార్ట్సర్క్యూట్ అయినప్పుడు విద్యుత్తు సామర్థ్యం అనుమతించిన లోడ్కంటే సుమారు 20 రెట్లు పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?