అమరావతి భూసమీకరణ ప్రపంచానికే రోల్‌మోడల్‌

రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణ విధానం ప్రపంచానికి ఓ విజయవంతమైన రోల్‌మోడల్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి కోసం

Published : 01 Jul 2022 05:01 IST

ల్యాండ్‌ పూలింగ్‌పై పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణ విధానం ప్రపంచానికి ఓ విజయవంతమైన రోల్‌మోడల్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి కోసం జరిగిన ల్యాండ్‌ పూలింగ్‌పై ప్రొ.పొదిలి వెంకటేశ్వరరావు రాసిన ‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం ఆన్‌ ఇండస్ట్రియల్‌, సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’ అనే పుస్తకాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. సమగ్ర పరిశోధనతో పుస్తకం రాసిన పొదిలి వెంకటేశ్వరరావును చంద్రబాబు అభినందించారు. అనుకున్న విధంగా అమరావతి పూర్తయి ఉంటే, ఆ ఫలాలు రాష్ట్రానికి ఇప్పటికే దక్కేవని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని