‘మూడేళ్లలో’ మూడోసారి బాదుడు
సర్వీసులో గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుడు 2019 నవంబరు వరకు టికెట్ ఛార్జీగా రూ.30 చెల్లించేవాడు. ఇప్పుడది ఏకంగా రూ.55కి చేరింది.
ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల భారం రూ.2,000 కోట్లు
తాజాగా పల్లెవెలుగులో అత్యధికంగా 61.90% పెంపు
ఎక్స్ప్రెస్ల్లో 56.94% వడ్డింపు
దూరప్రాంతాలకు వెళ్లే సూపర్లగ్జరీల్లో 39.65, ఏసీ ఇంద్రలో 34.24% పెరుగుదల
గతంలో ఎన్నడూ లేనట్లుగా నెలల వ్యవధిలోనే పెంపు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
ఈనాడు - అమరావతి
* సర్వీసులో గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుడు 2019 నవంబరు వరకు టికెట్ ఛార్జీగా రూ.30 చెల్లించేవాడు. ఇప్పుడది ఏకంగా రూ.55కి చేరింది.
* విజయవాడలో ఉద్యోగం చేస్తూ, వారాంతంలో విశాఖకు వెళ్లి వచ్చే ఓ ఉద్యోగికి సూపర్ లగ్జరీ బస్సులో 2019 నవంబరులో టికెట్ ధర రూ.475. ఇప్పుడది రూ.670కి పెరిగింది.
* ఓ జంట, తమ ఇద్దరు పిల్లలతో 2019లో తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు ఘాట్ సర్వీసులో ఛార్జీల కింద రూ.180 (పెద్దలు ఇద్దరికి రూ.110, పిల్లలకు రూ.70) ఖర్చు చేశారు. ఇప్పడు వారు రూ.280 (పెద్దలు ఇద్దరికి రూ.180, పిల్లలకు రూ.100) వెచ్చించాల్సి వచ్చింది.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపు అడ్డూ అదుపూ లేకుండా సాగిస్తూ ప్రయాణికుల నడ్డివిరుస్తోంది. జగన్ సర్కారు అధికారం చేపట్టిన అయిదు నెలలకే ఛార్జీల మోత మోగించగా.. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ 14న డీజిల్ సెస్ పేరిట ఓసారి పెంచింది. తాజాగా శుక్రవారం నుంచి మరోసారి డీజిల్ సెస్ పేరిట బాదేసింది. మొత్తంగా మూడు దఫాలుగా ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై ఇక నుంచి ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల మేర భారం పడుతుంది. తాజాగా పల్లెవెలుగు సర్వీసుల్లో అత్యధికంగా 61.90 శాతం మేర ఛార్జీలు పెంచి, గ్రామీణ ప్రజలపై పెనుభారం వేశారు. ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 43.67, దూరప్రాంతాలకు వెళ్లే సూపర్లగ్జరీల్లో 39.65 శాతం, ఇంద్ర ఏసీ బస్సుల్లో 34.24 శాతం.. ఇలా ఏ సర్వీసునూ వదలకుండా అందరినీ బాదేశారు. ప్రజలకు సహేతుక ధరలతో రవాణా సదుపాయం కల్పించాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ.. ఇలా పదేపదే ఛార్జీలు పెంచి, ప్రైవేటు సంస్థలా వ్యవహరించడమేంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన డొక్కు బస్సులను నడుపుతూ, వాటిలో కూడా ఛార్జీలు పదే పదే పెంచడమేంటని దుమ్మెత్తిపోస్తున్నారు.
పల్లెవాసిపై పిడుగు
ఆర్టీసీ నడిపే బస్సుల్లో 49 శాతం పల్లెవెలుగు సర్వీసులే. ఇందులో ఎక్కువ మంది ప్రయాణికులు రూపాయి రూపాయి లెక్క చూసుకునే పేదలే.
మూడుసార్లు ఛార్జీల పెంపుతో వీరిపైనే అత్యధికంగా భారం వేశారు. పల్లెవెలుగుల్లో 2019 నవంబరులో కి.మీ.కు 63 పైసల చొప్పున ఉన్న ఛార్జి ఇప్పుడు రూ.1.02కి చేరింది. అంటే 61.90% పెరిగింది.
* పల్లెవెలుగు తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా ఎక్స్ప్రెస్ సర్వీసులు 16.39 శాతం ఉన్నాయి. వీటిలోనూ మూడేళ్లలో పెంపు 43.67 శాతానికి చేరింది.
* దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే సూపర్ లగ్జరీ సర్వీసులు 12 శాతం ఉంటే.. ఇందులో 39.65 శాతం ఛార్జీలు పెరిగాయి.
ప్రతి దఫా భారీగా వడ్డన
ఈ ప్రభుత్వం వచ్చాక 2019 డిసెంబరులో ఛార్జీలు పెంచింది. డీజిల్, విడిభాగాలు, టైర్ల ధరల పెరుగుదల, ఉద్యోగుల జీతాల భారంతో ఛార్జీలు పెంచుతున్నామంటూ ఏటా ప్రయాణికులపై ఏటా రూ.700 కోట్లకు పైగా భారం వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి డీజిల్ సెస్ పేరిట ఛార్జీలు పెంచి ఏటా మరో రూ.720 కోట్ల మేర ప్రయాణికులపై వడ్డించారు. తాజాగా శుక్రవారం నుంచి పెరిగిన టికెట్ ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా రూ.500 కోట్లకు పైగా భారం పడుతోంది. మూడు దఫాలుగా పెంచిన ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల వరకు భారం పడినట్లయింది.
నెలల వ్యవధిలో పెంపు తొలిసారి
గతంలో ఆర్టీసీ ఛార్జీలు ఒకసారి పెంచాక కొన్నేళ్లపాటు అవే కొనసాగేవి.ఇప్పుడు ఏప్రిల్లో ఛార్జీలు పెంచి మూడు నెలలు తిరక్కుండానే మళ్లీ పెంచేయడంపై ఆర్టీసీ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా నెలల వ్యవధిలో పెంచడం సంస్థ చరిత్రలోనే తొలిసారి అని చెబుతున్నారు.
దూరమయ్యేకొద్దీ భారమే
ఏప్రిల్ 14న పెంచిన ఛార్జీల్లో పల్లెవెలుగు ప్రయాణికులపై ఎక్కువ భారం పడింది. వీటిలో స్టేజి స్టేజికీ ఛార్జీలు పెంచారు. తక్కువ దూరాలకు సైతం రూ.15-20 వరకు ఛార్జీలు పెరిగాయి. అప్పట్లో సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ఎంత దూరం వెళ్లినా సగటున రూ.10-20 చొప్పున మాత్రమే అదనంగా వసూలు చేశారు. తాజా పెంపులో దూర ప్రాంత ప్రయాణికులనూ వదల్లేదు. దూరం పెరుగుతున్నకొద్దీ ఛార్జీ పెరుగుతూ పోయింది. గరిష్ఠంగా రూ.120 నుంచి రూ.140 వరకు బాదేశారు.
వేంకన్న భక్తులపైనా భారం
తిరుపతి తిరుమల ఘాట్లో తిరిగే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 2019 నవంబరుతో పోలిస్తే.. ఇప్పుడు ఒక్కో టికెట్పై రూ.35 చొప్పున పెరిగిపోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో వెళ్లే ప్రయాణికులకు ఇది అదనపు భారమే.
నిత్యవసరాల మాదిరిగా పెంచేస్తున్నారు
- బాబాజీ, అమలాపురం
ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వాళ్లు తిరిగే పల్లె వెలుగు సర్వీసులను కూడా వదల్లేదు. ఇప్పటికే నిత్యావసరాలు సహా అన్నింటి ధరలూ పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నాం. దీనికి ఆర్టీసీ ఛార్జీలు కూడా తోడయ్యాయి.
ఇక ప్రైవేటుకు, ఆర్టీసీకి తేడా ఏంటి?
- జిలానీ, ప్రయాణికుడు
పనిమీద హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చాను. ముందు రోజు సూపర్లగ్జరీలో ఛార్జీ రూ.670 ఉంది. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ.820 చెప్పారు. ఇంత భారం మోపడం సరికాదు. ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ లాభనష్టాలు చూసుకోకూడదు. ఇలా అయితే ప్రైవేటు ట్రావెల్స్కు, ఆర్టీసీకి తేడా ఏంటి?
తెల్లారేసరికి పెరిగిపోయింది
- పాలకొండయ్య, ప్రయాణికుడు
ప్రొద్దుటూరు నుంచి సూపర్లగ్జరీ బస్సులో గురువారం రాత్రి బయలుదేరి శుక్రవారం విజయవాడ వచ్చాను. అప్పుడు టికెట్ ధర రూ.580. విజయవాడ నుంచి ప్రొద్దుటూరుకు శుక్రవారం రాత్రి టికెట్ బుక్ చేసుకుంటే రూ.670 తీసుకున్నారు. ఒక్క రోజులో రూ.90 ఛార్జీ పెరిగిపోయింది. ఇంతంత పెంచేస్తే ఎలా?
ఏసీ బస్ ఛార్జీ చూస్తే ఆశ్చర్యమేస్తోంది
- కె.రఘుపతి, విజయవాడ
ఏసీ బస్సు ఛార్జీలు చూస్తే ఆశ్చర్యమేస్తోంది. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఇంద్ర సర్వీసు ఛార్జీ రూ.110 పెంచేశారు. ఇప్పుడు ఏకంగా రూ.850 అయింది. రైల్లో అయితే రూ.600కే వెళ్లొచ్చు. ఇటీవలే ఛార్జీలు పెంచారు. మూడు నెలలు కూడా దాటకుండానే మళ్లీ పెంచడం సరికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.