‘ఆన్లైన్ టికెట్ల’కు హైకోర్టు బ్రేక్
సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నానికి హైకోర్టు బ్రేక్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్ (సవరణ) చట్టం, దాని
ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్ముకోడానికి అడ్డుకట్ట
చట్టసవరణ, తదనంతర జీవోల అమలు నిలిపివేత
ఈనాడు, అమరావతి: సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నానికి హైకోర్టు బ్రేక్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్ (సవరణ) చట్టం, దాని ఆధారంగా జారీచేసిన జీవోల అమలును నిలిపివేసింది. ఈ నెల 2 నుంచి ప్రవేశపెట్టనున్న ఆన్లైన్ టికెట్ విక్రయ ప్రక్రియలో ముందుకెళ్లకుండా ప్రభుత్వాన్ని నిలువరించింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వకపోతే పిటిషనర్లకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని పేర్కొంది. అంతేకాక ఈ నెల 2లోగా ప్రభుత్వం తీసురాబోతున్న కొత్త విధానంలోకి మారకపోతే థియేటర్ల లైసెన్సులు రద్దయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ వ్యాజ్యాల్లో తుది విచారణ జరిగే వరకు ఆన్లైన్ విధానాన్ని వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి కానీ, ప్రేక్షకులకు కానీ ఎలాంటి నష్టం జరగదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగించడమే మంచిదని అభిప్రాయపడింది. వ్యాజ్యాలపై తుది విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్లైన్లో విక్రయించేందుకు వీలుగా 2021 డిసెంబరు 15న తీసుకొచ్చిన సవరణ చట్టం, సంబంధిత నిబంధనలు, టికెట్ల విక్రయ ప్లాట్ఫామ్ నిర్వహణను ఏపీ స్టేట్, ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి అప్పగిస్తూ డిసెంబరు 17న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దాన్ని సవాలు చేస్తూ బుక్ మై షో సంస్థ, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, సీవీ మోహన్రెడ్డి, న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ వేదిక ద్వారా మాత్రమే టికెట్లు విక్రయించాలని ఒత్తిడి చేయడంపై అభ్యంతరం తెలిపారు. తమతో పోటీకి దిగుతూ తాము విక్రయించిన టికెట్కు రూ.2 చొప్పున సర్వీసు ఛార్జి చెల్లించాలని ప్రభుత్వం కోరడం సరికాదన్నారు. తమ వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరారు. తాము పన్ను ఎగవేస్తున్నామన్న ప్రభుత్వ వాదనల్లో వాస్తవం లేదని తెలిపారు. థియేటర్ల మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం చూసుకుంటూ, యాజమాన్యాలను క్యాంటిన్, పార్కింగ్ నిర్వహణకు మాత్రం పరిమితం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నేరుగా వచ్చి తమ బాక్సాఫీసులో కూర్చుంటోందని వివరించారు. ఇది యాజమాన్యాల మనుగడనే దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రభుత్వ చర్య గుత్తాధిపత్యానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఈనెల 2లోగా తమతో ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే లైసెన్సులను రద్దు చేస్తామని బెదిరిస్తోందని వివరించారు. ప్రభుత్వమే వ్యక్తిగతంగా టికెట్ విక్రయ వ్యాపారం చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ.. పైసా పెట్టుబడి పెట్టకుండా తమతో కలిసి వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
అధిక ధరలను అడ్డుకోవాలనే..
ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. భాగస్వాములందరితో చర్చించి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అధిక ధరలకు టికెట్ల విక్రయాన్ని నిలువరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అధ్యయనం అనంతరం నూతన విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరారు. ఇటీవల జరిగిన విచారణలో ఇరువైపులా వాదనలు ముగిశాయి. చివరకు ఆన్లైన్ ప్రక్రియను నిలిపిస్తూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM