నుపుర్ శర్మ దేశాన్ని రెచ్చగొట్టారు
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు
నోటిదురుసుతో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు
బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఆమె కారణంగానే దేశంలో మంటలు
సస్పెండైన భాజపా నేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
దిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని పేర్కొంది. తనపై వివిధ రాష్ట్రాల్లో దాఖలైన ఎఫ్ఐఆర్లను దిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్శర్మ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా భాజపా అధికార ప్రతినిధిగా ఆమె ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలాల ధర్మాసనం తీవ్రంగా గర్హించింది. ‘‘ఆమె నోటిదురుసుతో టీవీలో అన్నిరకాలైన బాధ్యతారాహిత్య ప్రకటనలు చేసి దేశంలో మంటలు సృష్టించారు. తాను చేసిన వ్యాఖ్యలకు దేశం మొత్తానికి ఆమె క్షమాపణ చెప్పి ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. అయినా అలాంటి మాటలు అనాల్సిన అవసరం ఏముంది..? ఈ వ్యాఖ్యలు దేశంలో దురదృష్టకర సంఘటనలు జరగడానికి కారణమయ్యాయి. ఇలాంటి వ్యక్తులకు మతాలపై గౌరవం ఉండదు. చౌకబారు ప్రచారం కోసం లేదా రాజకీయ ఎజెండా కోసం లేదా నీచ కార్యకలాపాల కోసం ఏమైనా చేస్తారు’’ అని తీవ్రంగా ఆక్షేపించింది. ఇస్లాంను అవమానపరిచారని ఉదయ్పుర్లో ఓ దర్జీని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన నేపథ్యంలో న్యాయస్థానం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. నుపుర్శర్మ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమె తరఫు న్యాయవాది మణిందర్సింగ్ చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఆమెకు ముప్పు ఉందా.. ఆమెతో దేశ భద్రతకు ముప్పు ఉందా’’ అని ప్రశ్నించింది. ‘‘మేం కూడా టీవీలో చర్చను చూశాం. ఆమె భావోద్వేగాలు తీవ్రంగా రెచ్చగొట్టారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమెదే ఏకైక బాధ్యత’’ అని పేర్కొంది. జరిగిన సంఘటనకు నుపుర్ లిఖితపూర్వక క్షమాపణ చెప్పారని మణిందర్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని న్యాయమూర్తులు అంగీకరించలేదు. ‘‘షరతులతో ఆమె చేసిన దాన్ని క్షమాపణ అంటారా.. ఆమె టీవీలో దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి’’ అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్లను ఒకటిగా చేయాలంటూ నుపుర్ వేసిన పిటిషన్పైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఆమె అహంకారాన్ని ప్రతిఫలిస్తోందని, దేశంలో మేజిస్ట్రేట్ తన ముందు చాలా చిన్నవాడని ఆమె భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా అరెస్టు కాలేదు. దీన్ని బట్టి అధికారం తన వెనుక ఉందన్న అహంకారం ఆమెకు ఉందని అర్థమవుతోంది’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
అధికార ప్రతినిధి అయితే ఏమైనా అనొచ్చా..!
నుపుర్.. భాజపా అధికార ప్రతినిధిగా చర్చలో స్పందించారని, ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదంటూ మణిందర్సింగ్ చేసిన వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది.‘‘ పార్టీ అధికార ప్రతినిధి అయితే ఏమైనా మాట్లాడటానికి లైసెన్సు ఇచ్చినట్లా. ఒక వేళ చర్చ పక్కతోవ పట్టి ఉంటే అందుకు కారణమైన యాంకర్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. గతంలో పాత్రికేయుడు అర్ణబ్గోస్వామి కేసులో ఎఫ్ఐఆర్లను కలిపే అవకాశం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిందని, ఒకే చర్యకు రెండో ఎఫ్ఐఆర్ ఉండకూడదని పేర్కొందని మణిందర్ సింగ్ చేసిన వాదనలపై జస్టిస్ సూర్యకాంత్ ఏకీభవించలేదు. ‘‘అది ఒక నిర్దిష్ట సమస్యపై ఒక పాత్రికేయుడి హక్కులకు సంబంధించిన అంశం. దానికీ ఓ పార్టీ అధికార ప్రతినిధి చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకూ సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. నుపుర్శర్మ పిటిషన్ను విచారించలేమని, హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం తెలిపింది. ‘‘ఈ న్యాయస్థానం అంతరాత్మ సంతృప్తిపడలేదు. మీకు ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నుపుర్శర్మపై దిల్లీలో దాఖలైన ఎఫ్ఐఆర్పైనా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ‘‘ఇప్పటివరకు ఆమెపై విచారణ ఎంతవరకు వచ్చింది. దిల్లీ పోలీసులేం చేశారు. ఆ విషయాలు మాతో చెప్పించకండి. వారు మీకు ఎర్రతివాచీ పరిచి ఉంటారు’’ అని ధర్మాసనం తెలిపింది. మరోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దిల్లీ పోలీసులు శుక్రవారం నుపుర్శర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
భాజపా సిగ్గుతో తలదించుకోవాలి: కాంగ్రెస్
నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలను విపక్షాలు స్వాగతించాయి. ఈ వ్యాఖ్యలు చూసైనా అధికార పార్టీ సిగ్గుతో తలదించుకోవాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్డీయే ప్రభుత్వం దేశంలో విద్వేష వాతావరణం సృష్టిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మోదీ, అమిత్షా, భాజపా, ఆరెస్సెస్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. శుక్రవారం రాహుల్.. కేరళలోని తన సొంత నియోజకవర్గమైన వయనాడ్లో కొన్ని రోజుల క్రితం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు ధ్వంసం చేసిన తన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. నుపుర్శర్మను తక్షణమే అరెస్టు చేయాలని ఏఐఎంఐఎం అధిపతి అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ప్రకారం.. ఈ విద్వేష వాతావరణానికి కారణం నుపుర్శర్మ అని ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మరోవైపు నుపుర్శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు దిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త అజయ్ గౌతమ్ లేఖ రాశారు. ఈ లేఖనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు.
దేశ పరిస్థితి చూసి భయపడుతున్నా: అమర్త్యసేన్
కోల్కతా: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన సాల్ట్లేక్ ప్రాంతంలో అమర్త్య పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఏ విషయం గురించి అయినా భయపడుతున్నారా అని నన్ను అడిగితే.. అవును అంటాను. ఇప్పుడు భయపడటానికి కారణం ఉంది. దేశంలో ప్రస్తుత పరిస్థితే ఈ భయానికి కారణం. దేశం సమైక్యంగా ఉండాలని కోరుకుంటాను. చరిత్రపరంగా ఉదారవాద దేశమైన భారత్లో విభజనలు రావాలని కోరుకోవడం లేదు. భారత్ కేవలం హిందువుల దేశం కాదు. అలాగని ముస్లింలదీ కాదు. అందరూ కలిసి సమైక్యంగా పని చేయాలి’’ అని సేన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్