AP News: పశ్చిమ గుండెల్లో అల్లూరి
మన్యం వీరుడు, విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజుకు జాతీయస్థాయి గుర్తింపు వస్తుండటంతో ఆయన చిన్నతనంలో నడయాడిన పశ్చిమగోదావరి
భీమవరం పరిసరాల్లో నడయాడిన సీతారామరాజు
లూథరన్ పాఠశాలలో ఏడాదిపాటు విద్యాభ్యాసం
నరసాపురం టేలర్ హైస్కూల్లో థర్డ్ఫాం
రేపు ప్రధానిచే 30 అడుగుల విగ్రహావిష్కరణ
భీమవరం పట్టణం, పాలకోడేరు, న్యూస్టుడే: మన్యం వీరుడు, విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజుకు జాతీయస్థాయి గుర్తింపు వస్తుండటంతో ఆయన చిన్నతనంలో నడయాడిన పశ్చిమగోదావరి మురిసిపోతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ జులై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా భీమవరం సమీపంలోని పెదఅమిరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా పాండ్రంగిలో 1897 జులై 4న సీతారామరాజు జన్మించారు. చిన్నతనంలో ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. భీమవరం సమీపాన కొవ్వాడ, వెంప గ్రామాలతో పాటు పాలకోడేరు మండలం మోగల్లు, నరసాపురాల్లో కొంతకాలం ఉన్నారు. భీమవరం మండలం కొవ్వాడలో పినతల్లి అప్పల వెంకటనరసమ్మ వద్ద ఉండి ఏడాదిపాటు పట్టణంలోని లూథరన్ పాఠశాలలో చదివారని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు. ఈ గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న లక్ష్మీనారాయణస్వామి ఆలయం
సమీపాన వాళ్ల ఇల్లు ఉండేది. అప్పట్లో చాలా దూరం అయినా, కాలి నడకనే పాఠశాలకు వెళ్లేవారని, తర్వాత రాజమహేంద్రవరంలో విద్యను కొనసాగించారని.. ఆంగ్ల విద్య అంటే బానిస విద్యగా రామరాజు భావించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. మోగల్లులో ఉండగా సూరి సుబ్బయ్యశాస్త్రి దగ్గర రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశం కావ్యాలను అభ్యసించారు. సీతారామరాజు చిన్నాన్న సూర్యనారాయణరాజు నరసాపురంలో రెవెన్యూ శాఖలో పనిచేసేవారు. రామరాజు ఆయన వద్ద ఉంటూ నరసాపురం టేలర్ ఉన్నత పాఠశాలలో థర్డ్ఫాం (ఎనిమిదో తరగతి) చదివారు. అనంతరం చిన్నాన్నకు రంపచోడవరం బదిలీ కావడంతో ఆయనతోపాటు అక్కడికి వెళ్లిపోయారు. తర్వాతి నుంచి ఆ ప్రాంతంలోనే సీతారామరాజు కార్యకలాపాలు కొనసాగాయి.
మోగల్లు వాసుల సంబరాలు
అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని జులై 4న ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆయన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భీమవరం సమీపంలో అల్లూరి కుటుంబ సభ్యులు నివసించిన మోగల్లు వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు ఆయన జీవిత విశేషాలను తెలియజెప్పే స్మారక నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.
స్వగ్రామంలో జ్ఞానమందిరం
మోగల్లులో సీతారామరాజు కుటుంబం నివసించిన ప్రాంతంలో అల్లూరి పేరిట జ్ఞాన మందిరం నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. దీన్ని 100 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ అధ్యక్షుడు దండు శ్రీనివాసరాజు తెలిపారు. పార్టీలకు అతీతంగా అల్లూరి స్మారక నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
మ్యూజియం ఏర్పాటు చేయాలి
అల్లూరి సీతారామరాజు కుటుంబం నివసించిన ప్రాంతంలో నేను 8 ఏళ్లుగా సేవ చేస్తున్నా. ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతా. ఈ స్థలం చుట్టూ కంచె ఏర్పాటుచేసి మొక్కలు పెంపకం చేపట్టా. ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా.
- కొత్తపల్లి సీతారామరాజు, మోగల్లు
అదే ప్రజల ఆకాంక్ష
మోగల్లులో అల్లూరి పేరిట నిర్మాణాలు చేపడతామని నాయకులు చెప్పడమే తప్ప ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు అల్లూరి ఘనతను చాటే నిర్మాణాలు చేపట్టాలన్నదే మోగల్లు ప్రజల ఆకాంక్ష.
- కె.భీమరాజు, మోగల్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ