Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?
ఎసైన్డ్ వ్యవసాయ భూములపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చే ప్రయత్నాల్లో
లబ్ధిదారులకు కల్పించే యోచన
ఆదాయ మార్గాల్లో భాగంగా ప్రభుత్వ పరిశీలన
ఈనాడు, అమరావతి: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చే ప్రయత్నాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిలో కొందరికి రెండున్నర ఎకరాల మాగాణి, మరికొందరికి అయిదెకరాల మెట్ట భూమిని ప్రభుత్వం వివిధ సందర్భాల్లో కేటాయిస్తూ వస్తోంది. సొంతంగా భూములను సాగు చేయడం, కౌలుకు ఇవ్వడం ద్వారా లబ్ధిదారు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ భూములను వారసత్వంగా అనుభవించాల్సిందే. క్రయవిక్రయాలకు ఎలాంటి అనుమతి లేదు. ఇదే విషయాన్ని భూ బదలాయింపు నిషేధ చట్టం స్పష్టం చేస్తోంది. అయితే... ఇంటి స్థలాలను ఎసైన్ చేశాక, వాటిలో 12 నెలల్లో ఇళ్లను నిర్మించుకుని పదేళ్ల తర్వాత విక్రయించుకునేలా 2021లో నిబంధనలను సవరించారు. ఇలాంటి చట్ట సవరణ ద్వారానే వ్యవసాయ భూములపై ఎసైన్డ్దారులకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు.
పరిశీలించాలని రెండు శాఖలకు ఆదేశాలు
రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ఇప్పటివరకు సుమారు 35 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను ఎసైన్ చేసినట్లు అంచనా. వీటికి డి.పట్టా పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలనూ ఇచ్చారు. ఈ భూములు చాలావరకు ఒకప్పుడు పట్టణాలు, నగరాలు, మేజర్ గ్రామ పంచాయతీకు దూరంగా ఉండేవి. పట్టణీకరణ కారణంగా చాలావరకు నగరాలు, పట్టణాల్లో భాగమయ్యాయి. దాంతో వాటికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా కొత్త జిల్లా కేంద్రాలకు సమీపంలోని భూములకు మరింత గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎసైన్డ్ భూములపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులను కల్పిస్తే... రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. తలెత్తే సమస్యలు, వాటికి పరిష్కారాలు ఎలా చూపొచ్పు? అనే వాటిని పరిశీలించాలని రెవెన్యూ, స్టాంపులు/రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. వాస్తవానికి... లబ్ధిదారులకు కేటాయించిన భూముల్లో చాలావరకు చేతులు మారుతున్నాయి. కొన్నిచోట్ల ఆన్లైన్లోనూ పేర్లను అక్రమంగా మార్చారు. ఎసైన్డ్ భూములను విక్రయించినట్లు తెలిస్తే వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు. ఇలా కొన్నిసార్లు చేస్తున్నారు. ఒకవేళ పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తే..ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఉండదు. మరోవైపు చాలాచోట్ల ఈ భూములపై అసలు లబ్ధిదారులు, వారసులు లేరు. ఈ పరిస్థితుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా ప్రయోజనం పొందే నిజమైన లబ్ధిదారులు తక్కువగానే ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్ల జారీ!
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే. -
జగన్ సర్కారును పెకలించేేద్దాం
రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కారును పెకలించి వేసేందుకు, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే సర్కారును తెచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. -
ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు!
అవినీతి అక్రమాలపై చెడుగుడు ఆడే పాశుపతాస్త్రం.. ఓటు. పరమ పవిత్రమైన ఓట్లు జగనన్న పాలనలో పప్పుబెల్లాలు అయ్యాయి. వక్రబుద్ధి మరవని జగన్.. తన పాలనకు మడుగులొత్తే అధికారుల అండతో లెక్కకు మిక్కిలి దొంగ ఓట్లను నమోదు చేయించి.. ఓటు విలువను అభాసుపాలు చేశారు. -
ప్రశ్నలను తెలుగులో అను‘వధించారు’
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేెలెత్తించాయి. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించడంలోనూ తప్పులు దొర్లాయి. -
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
టెట్ ఫలితాల విడుదల ఎప్పుడో?
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ‘కీ’లను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించినందున టెట్ మార్కులు కీలకం కానున్నాయి. -
ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. మైకుల మొరాయింపు
బొప్పూడి ‘ప్రజాగళం’ సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనే నాలుగుసార్లు మైకులు మొరాయించాయి. సౌండ్ సిస్టం ఉన్న ప్రాంతంలో జనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. -
విశాఖలో ‘భారత్ నివేష్ రన్’
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో ‘భారత్ నివేష్ రన్’ పేరిట 5కే రన్ నిర్వహించారు. -
మోదీజీ.. అమరావతిని కాపాడండి
అయిదు సంవత్సరాల నుంచి చస్తూ బతుకుతున్న అమరావతి... మోదీజీ రాజధానికి రండి.. ఆంధ్రాను రక్షించండి.. అమరావతి రైతుల జీవితాలను కాపాడండి.. మా బాబు, మన మోదీ, మా పవన్... ఇకపై ఆంధ్రాకు, అమరావతికి అమృతమే.. -
జజ్జనకరి జనారే.. సభంతా హుషారే
‘ప్రజాగళం’ సభ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘పసుపు దళపతి.. చీకటిని పారదోలే అధిపతి’ అంటూ సాగే పాటకు జనం ‘జై బాబు.. జైజై బాబు’ అంటూ నినాదాలు చేశారు. -
ఉప్పొంగిన జన సంద్రం
ఎటు చూసినా జనం.. కోటప్పకొండ జాతరను మించిన జన జాతర.. సభా ప్రాంగణంలోని గ్యాలరీల్లో జనం.. రోడ్లపైనా వెల్లువలా ప్రజలు.. తెదేపా, జనసేన, భాజపాల మధ్య పొత్తు కుదిరాక మూడు పార్టీలూ సంయుక్తంగా బొప్పూడి వద్ద నిర్వహించిన తొలి సభ దిగ్విజయమైంది.. -
ప్రధాని సభలో భద్రతా వైఫల్యం
ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించటంలో విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
ప్రేక్షకపాత్రకే పరిమితమైన పోలీసులు
ప్రధాని రాకకు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎన్ఎస్జీ, ఎస్పీజీ బృందాలు సైతం సభ నిర్వహణలో బందోబస్తుపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేశాయి. అప్పుడూ పోలీసులు స్పందించలేదు. -
మీ ప్రాణాలు మాకెంతో విలువైనవి.. టవర్లు దిగిరండి
‘ప్రజాగళం’ బహిరంగ సభలో సౌండ్ సెట్టింగ్కు ఏర్పాటుచేసిన టవర్లను ఎక్కిన యువకులంతా వాటిని దిగి కిందికి రావాలని ప్రధాని మోదీ పదేపదే విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగించే సమయంలో టవర్లపై కొందరు యువకులున్న విషయాన్ని గమనించిన మోదీ.. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చీరల పంపిణీ
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ వైకాపా నాయకులు ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆదివారం అమరావతిలో ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
రాఘవాచారి సంపాదకీయాలు సమకాలీన పరిస్థితులకు దర్పణం
సమకాలీన రాజకీయాలు, పరిస్థితులకు చక్రవర్తుల రాఘవాచారి సంపాదకీయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.గిరిజాశంకర్ అన్నారు. -
నామిని రచనల్లో సామాన్యుల జీవితాలు
‘‘నామిని రచనల్లో ‘మిట్టూరోడి కథలు’ సామాన్యుల జీవనాన్ని ప్రతిబింబించాయి. నేటి రచయితలు అనేకమంది నాన్న ప్రేమను, ఆయన శ్రమను కథలుగా రాస్తే, నామిని మాత్రం తన రచనల్లో అమ్మ శ్రమను ఆవిష్కరించారు’’ అని మాజీ మంత్రి, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ గల్లా అరుణకుమారి అన్నారు. -
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజీనామా
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాసేపల్లిపాడుకు చెందిన లింగంగుంట రవిబాబు తన పదవికి, వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఏపీ ఫైబర్నెట్లో సీఎం జగన్ ప్రత్యక్షం.. ఎన్నికల కోడ్ వర్తించదా?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేస్తున్నారు. ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సీఎం జగన్ చిత్రపటాలను తీసేస్తున్నారు. -
రాజకీయ పార్టీల హోర్డింగ్లు వెంటనే తొలగించండి
ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ పార్టీల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. -
ఒకసారే మూల్యాంకనం చేశాం
గ్రూపు-1 (2018) ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. గ్రూపు-1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Appsc: గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీల్
-
Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్ మజుందార్ షా
-
Tharun Bhascker: ఎస్పీ చరణ్తో వివాదం.. తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే
-
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
-
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
-
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా