దోపిడీదారులను దించేయగలం
‘అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను చూసి భయపడక్కర్లేదు. జ్ఞానం, ధైర్యం పెంచుకుంటే... దోపిడీ చేసేవాళ్లే మనల్ని చూసి భయపడతారు. బలమైన ఆలోచనతో ఒక్కటై నిలిస్తే
ఆమ్ ఆద్మీతో కేజ్రీవాల్ తెచ్చిన మార్పు చూడండి
జనసేన వీర మహిళల శిక్షణ కార్యక్రమంలో పవన్ కల్యాణ్
ఈనాడు, అమరావతి: ‘అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను చూసి భయపడక్కర్లేదు. జ్ఞానం, ధైర్యం పెంచుకుంటే... దోపిడీ చేసేవాళ్లే మనల్ని చూసి భయపడతారు. బలమైన ఆలోచనతో ఒక్కటై నిలిస్తే ఎంతటి వారినైనా ఎదుర్కోగలం. వారికి 151 లేదా 175 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. సరిగ్గా పోరాడితే వాళ్లను దించేయగలం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శనివారం వీర మహిళలకు శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూ.7 లక్షలు ఇస్తామని చెప్పిన వైకాపా నాయకులు మాట తప్పారు. 3 వేల మంది చనిపోతే మూణ్నాలుగు వందల మందికే కొద్దిగా సాయం చేసి వదిలేస్తున్నారు. ఆడపడుచులను గౌరవించి మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని ఎలా అమ్ముతారు? మద్యం విక్రయాలతో వైకాపా నాయకులు... వ్యక్తితంగా నెలకు రూ.250 కోట్లు సంపాదిస్తున్నారని చెబుతున్నారు. సారాపైనే రోజుకు రూ.3 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్న వీరికి ఏసీబీతో చిన్నచిన్న ఉద్యోగులను నియంత్రించే హక్కు ఎక్కడ ఉంది’ అని నిలదీశారు.
ఓటమిలోనూ నిల్చునే ధైర్యముంది
జనసేనకు ఓటమిలోనూ నిల్చునే ధైర్యముంది. సినిమాల్లో 10 డైలాగులు చెప్పి మీతో చప్పట్లు కొట్టించుకుంటే ఆనందం రాదు. సినిమాల్లో చేయగలిగేది నిజ జీవితంలో ఎంతో కొంత చేయగలిగితేనే బలం. ఈ రోజు ఆ బలాన్ని సంపాదించుకున్నా. మార్పు ఒక్కరోజులో రాదు. రూ.వందల కోట్ల ఆస్తులున్న బలమైన కాంగ్రెస్, భాజపాలను కేజ్రీవాల్ ఓడించారు. ఆ మార్పు చూడండి’ అని శ్రేణులకు ఉద్బోధించారు.
‘ఒక యువతి మర్యాదకు భంగం వాటిల్లితే సాక్షాత్తూ మహిళా హోం మంత్రి ఆమె పెంపకాన్నే తప్పుబట్టారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే క్రిమినల్స్ను వెనకేసుకు రావడమేంటి? వకీల్సాబ్ సినిమాలో ఒక మహిళను నువ్వు కన్యవా? అని అడగాలనే డైలాగ్ను రాసిచ్చారు. నేనా డైలాగ్ను చెప్పబోనన్నాను. ఏం కన్యత్వం పురుషుడికి వర్తించదా?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అంతకుముందు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘జగన్రెడ్డిని ఓడించాలి... జనసేనను గెలిపించాలి’ అనే నినాదంతో వీర మహిళలు పని చేయాలని పిలుపునిచ్చారు.
ఆడవాళ్లను నఖశిఖ పర్యంతం చూడాల్సిన అవసరం ఏమిటి?
ఆడవాళ్లను నఖశిఖ పర్యంతం చూడాల్సిన అవసరం ఏమిటని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ప్రశ్నించారు. ఆడవారి వేషధారణపై గతంలో కొందరు ప్రవచనకారులు వ్యాఖ్యలు చేయగా తాను వీడియోలోనే ఈ ప్రశ్నను సంధించానన్నారు.
* జనసేన కార్యాలయంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన యలవర్తి నాగరాజు దంపతులు ‘కౌలు భరోసా యాత్ర’కు విరాళంగా రూ.10 లక్షలను పవన్కల్యాణ్కు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్