రంగు కోసం ఎదురుచూస్తున్న విద్యుత్తు బస్సు

ఏపీఎస్‌ఆర్టీసీలో తొలి విద్యుత్తు బస్సుకు వేయాల్సిన రంగు ఖరారు కాకపోవడంతో అది రోడ్డెక్కడంలో జాప్యం అవుతోంది. రంగును సీఎం ఖరారు చేయాల్సి ఉంది. ఆయన నిర్ణయం

Published : 03 Jul 2022 05:16 IST

ఈనాడు, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలో తొలి విద్యుత్తు బస్సుకు వేయాల్సిన రంగు ఖరారు కాకపోవడంతో అది రోడ్డెక్కడంలో జాప్యం అవుతోంది. రంగును సీఎం ఖరారు చేయాల్సి ఉంది. ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. అద్దె ప్రాతిపదికన 100 విద్యుత్తు బస్సులు తీసుకోనుండగా.. టెండరు దక్కించుకున్న సంస్థ తొలి బస్సును సిద్ధం చేసింది. ఆర్టీసీ అధికారులు దానిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రంగు ఖరారు కాకపోవడంతో ఇంకా అప్పగించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని