రుణ‘పాశం’
ఆన్లైన్ యాప్ల్లో రుణం తీసుకున్న వ్యక్తి దాన్ని సకాలంలో చెల్లించనందుకు ఆయా యాప్ల నిర్వాహకులు ఎంత బరితెగించి వేధిస్తున్నారో చెప్పడానికి ...
ప్రాణాలు తీస్తున్న మనీ లెండింగ్ యాప్లు
పూచీకత్తు లేకుండానే అప్పులిస్తామని వల
తీర్చకపోతే క్రూరంగా, హేయంగా వేధింపులు
బలవన్మరణాలకు పాల్పడుతున్న బాధితులు
ఈనాడు - అమరావతి
‘ఈయన పేరు --------. ఫోన్ నంబర్ -----. పెద్ద మోసగాడు. చిన్నారుల హంతకుడు. మీ చుట్టూనే తిరుగుతున్నాడు. మీ కుటుంబసభ్యుల్ని ఈ వ్యక్తి బారి నుంచి రక్షించుకోండి. ఎక్కడైనా కనిపిస్తే ఈ కింది నంబర్కు కాల్ చేయండి. ఇంటి యజమానిని కూడా చంపేసిన ఇతణ్ని నేరుగా పట్టిస్తే నగదు బహుమతి కూడా ఇస్తాం.’
- ఇది ఎవరో పెద్ద నేరగాణ్ని పట్టుకునేందుకు పోలీసులు విడుదల చేసిన ప్రకటనలా అనిపిస్తోంది కదా! కానే కాదు. ఆన్లైన్ యాప్ల్లో రుణం తీసుకున్న వ్యక్తి దాన్ని సకాలంలో చెల్లించనందుకు ఆయా యాప్ల నిర్వాహకులు ఎంత బరితెగించి వేధిస్తున్నారో చెప్పడానికి పరాకాష్ఠ. రుణగ్రహీత ఫొటోను మార్ఫింగ్ ద్వారా నగ్నంగా మార్చి దాన్ని అతని కాంటాక్ట్ నంబర్లు అన్నింటికీ వాట్సప్లో పంపించటం, బతికుండగానే అతని ఫొటోకు దండేసి చనిపోయినట్లు ప్రచారం చేయటం.. ఇలా ఒకటేమిటి రుణయాప్ల నిర్వాహకుల ఆగడాలు అన్నీఇన్నీ కావు. అత్యంత హేయంగా, క్రూరంగా వారు వేధిస్తుంటే అప్పులు తీసుకున్న వేలాది మంది తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. కొందరు తమలో తామే కుమిలిపోతూ బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు ఆ అప్పులు తీర్చేందుకు మరికొన్ని యాప్ల్లో రుణాలు తీసుకుంటూ మరింతగా ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం పట్టణానికి చెందిన కోనా సతీష్ తాజాగా ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో రుణయాప్ల దందా మరోమారు చర్చనీయాంశమైంది.
‘మీ మొబైల్ ఫోన్లో ఒకే క్లిక్తో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలాంటి హామీ లేకుండానే రుణం పొందండి’ అంటూ రుణ యాప్ల నిర్వాహకుల ప్రకటనలతో మిమ్మల్ని ఊదరగొట్టేస్తారు. అత్యవసరమై వాటిలో అప్పు తీసుకుంటే చాలు ఊబిలోకి దిగినట్లే. అప్పు తీసుకున్న వారిని నిర్వాహకులు జలగల్లా పట్టిపీడిస్తున్నారు. చెల్లింపు ఒక్క గంట ఆలస్యమైనా రుణగ్రహీతల్ని, వారి కుటుంబసభ్యుల్ని, బంధుమిత్రుల్ని రకరకాలుగా బెదిరిస్తూ తీవ్ర క్షోభకు గురిచేస్తున్నారు. అయినా సరే అత్యవసర పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవించేవారు వీటిని ఆశ్రయిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
పాతవే.. కొత్త పేర్లతో
ఏడాదిన్నర కిందట కూడా ఈ రుణయాప్ల మోసాలకు, వేధింపులకు వేల మంది అవస్థలు పడ్డారు. అప్పట్లో కొన్ని యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగించటంతో వాటి నిర్వాహకులే ఇప్పుడు కొత్త కొత్త పేర్లతో తెరపైకి వచ్చి దందా చేస్తున్నారు. క్యాష్ బస్, లెండ్ మాల్, క్యాష్ అడ్వాన్స్, రుపీ కింగ్, రుపీ బాక్స్, ఓకే, సన్షైన్ లోన్, మనీ గ్రాంట్, భారత్ లోన్, మనీ గ్రాంట్, గోల్డ్ సీ లెండ్ మాల్, భారత్ క్యాష్, క్యాష్ చెర్రీ లెండ్, రోజ్ లెండ్, స్మాల్ క్యాష్, ఎక్స్పీ క్యాష్, మనలీ మాస్టర్, లెండ్ కింగ్, లెండ్ ఫాస్ట్, కోకో ఫాస్ట్, కోకో లెండ్ వంటి పేర్లతో ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు.
అన్నింటికీ యాక్సెస్ ఇస్తేనే..
ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడే మీ ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు సహా అన్నింటి యాక్సెస్ యాప్ నిర్వాహకులకు ఇవ్వాలి. లేదంటే రుణం పొందలేరని షరతు పెడతారు. యాక్సెస్ ఇవ్వగానే మీ ఫోన్ రుణ యాప్ సర్వర్కు అనుసంధానమవుతుంది. దీంతోపాటు అప్పు తీసుకునేటప్పుడు షరతులు, నిబంధనలను చదవకుండానే చాలామంది అంగీకరిస్తున్నారు. ఇవన్నీ వారిని సమస్యల సుడిలోకి నెట్టేస్తున్నాయి. రుణం తీసుకున్న ఆరో రోజు నుంచే చెల్లింపుల కోసం యాప్ నిర్వాహకులు ఒత్తిడి తెస్తారు. గంటగంటకూ ఫోన్లు చేస్తుంటారు. చెల్లింపు ఆలస్యమవుతున్న కొద్దీ వారి వికృతరూపాన్ని బయటపెడతారు. రుణగ్రహీత ఫోన్లోని నంబర్లన్నింటికీ వారి ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులు, దుష్ప్రచారాలతో కూడిన సందేశాలు, చిత్రాలు పంపిస్తారు.
వడ్డీ కాదది ఉరితాడు
ఆన్లైన్ రుణ యాప్ల్లో వడ్డీ మన ఊహకు అందనంత భారీగా ఉంటుంది. దాదాపు అన్ని యాప్లు 32 నుంచి 42 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. కొన్ని యాప్లైతే 50 శాతం వరకూ వడ్డీ లాగుతున్నాయి. చెల్లించాల్సిన వడ్డీ సొమ్ము ముందే మినహాయించుకుని మిగతా మొత్తాన్నే రుణగ్రహీత ఖాతాలో వేస్తారు. ఉదాహరణకు రూ.7 వేలు రుణం తీసుకుంటే రూ.5,800 ఇస్తారు. వారం రోజుల్లో రూ.8,100 కట్టాలి.
* కొన్ని సందర్భాల్లో ఒక యాప్లో చేసిన అప్పు తీర్చటానికి మరో యాప్ నుంచి అప్పు ఇప్పిస్తారు. ఇలా ఆ చక్రబంధంలో బాధితులు కూరుకుపోతున్నారు. బాధితుల్లో మహిళలే అధికం.
చట్టమే కొండంత అండ
రుణయాప్ల ప్రతినిధులు అప్పు తీసుకున్న వారిని బెదిరించడం, వేధించడం అన్నీ నేరాలే. అలాంటివి మీకు ఎదురైతే భయపడొద్దు. చట్టపరంగా చర్యలు తీసుకోమని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఈ కింద పేర్కొన్న సెక్షన్ల ప్రకారం వారిపై కేసులు పెట్టమని అడగాలి.
వేధింపుల్లో అత్యంత క్రూరత్వం
అప్పు తీసుకున్న వారిని రుణయాప్ల నిర్వాహకులు అత్యంత క్రూరంగా వేధిస్తున్నారు.
* ‘నా ఆర్థికపరిస్థితి సరిగా లేక తీసుకున్న రుణం చెల్లించలేకపోయా. నా కుటుంబంలోని మహిళల్ని మీ వద్దకు పంపిస్తా. మీరు వారితో గడిపి నా అప్పు తీర్చండి’ అంటూ రుణం తీసుకున్న వ్యక్తి పంపించినట్లుగా నకిలీ మెసేజ్లు రూపొందిస్తారు. వాటిని అతని కాంటాక్ట్ లిస్ట్లోని నంబర్లన్నింటికీ పంపిస్తున్నారు.
* తనకు కుటుంబసభ్యులతోనే అనైతిక లైంగిక సంబంధాలున్నట్లు అప్పు తీసుకున్న వ్యక్తి పేరుతోనే అతనిపై తప్పుడు ప్రచారం చేస్తారు.
* మహిళలైతే.. వారి చిత్రాల్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్సైట్లలో పెడతామని బెదిరిస్తున్నారు. ఓ మహిళ రుణం చెల్లించనందుకు ఆమె ఫోన్ నంబర్ను యాప్ నిర్వాహకులు కొందరు యువకులకు ఇచ్చారు. వారు ఆమెకు ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా దూషించారు.
* అప్పు తీసుకుని చెల్లించని పురుషుల ఫొటోల్లో తలల్ని నగ్న చిత్రాలకు అతికించి, ఆ చిత్రాల్ని అతని ఫోన్లో ఉన్న నంబర్లన్నింటికీ పంపిస్తున్నారు.
* బాధితులు ఆత్మహత్యకు పాల్పడినా వేధింపులు ఆగవు. తాజాగా ఆత్మహత్య చేసుకున్న కోనా సతీష్ కుటుంబసభ్యులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు