నేతల ఆశీస్సులు.. నచ్చిన చోటుకు బదిలీలు
రాష్ట్రంలో పురపాలక కమిషనర్లు, మున్సిపాలిటీల్లోని కీలక అధికారుల బదిలీల్లో నేతల మాటే చెల్లుబాటయింది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకున్నవారు నచ్చిన చోటుకు
మున్సిపల్ కమిషనర్లు, అధికారుల బదిలీల్లో సిఫార్సులకే పెద్దపీట
మంత్రులు, ఎమ్మెల్యేల మాటకే ప్రాధాన్యం
కొన్నిచోట్ల లక్షల్లో చేతులు మారిన వైనం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పురపాలక కమిషనర్లు, మున్సిపాలిటీల్లోని కీలక అధికారుల బదిలీల్లో నేతల మాటే చెల్లుబాటయింది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకున్నవారు నచ్చిన చోటుకు బదిలీ అయ్యారు. కొన్నిచోట్ల లేఖలిచ్చిన నేతలకు ‘ఎంతో కొంత’ సమర్పించుకుని మరీ అధికారులు కావాల్సిన చోటుకు వెళ్లారని సమాచారం. ఈ వ్యవహారంలో లక్షల్లో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేల మాట వినని పలువురు కమిషనర్లను బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా గాలిలో పెట్టడం బదిలీలపై నేతలకున్న పట్టును స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 47 మంది పురపాలక కమిషనర్లను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. మున్సిపల్ కమిషనర్లుగా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను డిప్యుటేషన్పై నియమించొద్దని కమిషనర్ల సంఘ ప్రతినిధులు పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్కు గత నెలలో వినతిపత్రం ఇచ్చారు. కానీ కో-ఆపరేటివ్ సంస్థలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఒకర్ని తిరుపతి జిల్లాలో ఓ పురపాలక సంఘానికి కమిషనర్గా నియమించారు. రాష్ట్ర సచివాలయంలో వేరొక శాఖలో కార్యదర్శిని రాయలసీమలోని ఓ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్గా పంపారు. రాయలసీమకే చెందిన ఒక కమిషనర్పై అక్కడి ఎమ్మెల్యే ఆగ్రహించడంతో ఆరు నెలల్లోనే ఆయనపై బదిలీ వేటు పడింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.
* ఉత్తరాంధ్రలో ఒక కమిషనర్ విజయనగరం జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆశీస్సులతో మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో కీలక స్థానానికి బదిలీ చేయించుకున్నారు.
* మరో అధికారి ఓ అమాత్యుడి సిఫార్సుతో ప్రకాశం జిల్లాలో కీలక పురపాలక సంఘానికి కమిషనర్గా వెళ్లారు.
* విజయవాడ నగరపాలక సంస్థలో వివిధ హోదాల్లో పని చేసి రెండేళ్ల కిందట వేరొక ప్రాంతానికి బదిలీపై వెళ్లిన అధికారిని.. ఓ నేత మళ్లీ బెజవాడలో కీలక స్థానానికి రప్పించుకున్నారు.
* ప్రకాశం జిల్లాలోని ఒక నగర పంచాయతీ కమిషనర్గా సస్పెండయిన అధికారి ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఆశీస్సులు పొందారు. దీంతో మళ్లీ అదే నగర పంచాయతీ కమిషనర్గా నియమితులయ్యారు.
ఇంజినీర్ల బదిలీల్లోనూ అదే తీరు
పురపాలకశాఖలోని ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 37 మంది ఇంజినీర్లను బదిలీ చేశారు. వీటిలోనూ పైరవీలదే పైచేయి. అయిదేళ్లు ఒకే ప్రాంతంలో పని చేసిన పలువురు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇందుకోసం అక్కడి ఎమ్మెల్యేలతోపాటు నగరపాలక సంస్థల మేయర్ల నుంచి కూడా సిఫార్సు లేఖలు తెచ్చుకున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థలో ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగంలో అనేక ఏళ్లపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పని చేసిన ఒకర్ని మళ్లీ అదే సంస్థలో సూపరింటెండింగ్ ఇంజినీర్గా నియమించారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి ఆయన పేరు సిఫార్సు చేశారని తెలుస్తోంది. కొద్ది నెలల క్రితమే పదోన్నతిపై నెల్లూరు జిల్లాకు వచ్చిన ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను.. ఒక మంత్రి మాట వినలేదన్న కారణంతో రాయలసీమ జిల్లాకు బదిలీపై పంపారు.
పట్టణ ప్రణాళికలో అక్కడికక్కడే..
పురపాలక పట్టణ ప్రణాళిక విభాగం బదిలీల్లో ఉన్నత స్థాయిలో చక్రం తిప్పిన కొందరు అధికారులు ప్రస్తుతం పని చేస్తున్న పట్టణాల్లోనే కొనసాగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావును విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చీఫ్ అర్బన్ ప్లానర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. అక్కడ పని చేస్తున్న బి.సురేశ్కుమార్ను జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్గా నియమించారు. వీరిద్దరూ నగరం కదలకుండా అక్కడే మరి కొన్నాళ్లు కొనసాగనున్నారు. విజయవాడ కార్పొరేషన్లోని ఇద్దరు పట్టణ ప్రణాళిక అధికారులు నగరానికి కూతవేటు దూరంలోని కీలక పురపాలక సంఘానికి బదిలీ చేయించుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులు వీరికి అక్కరకొచ్చాయి.
ఎమ్మెల్యేల మాట వినకపోతే స్థానచలనమే
కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి కర్నూలు, జిల్లాల్లోని కొన్ని పురపాలక సంఘాల్లో ఇప్పటికే పని చేస్తున్న కమిషనర్లలో కొందరిని అయిదేళ్ల పదవీకాలం పూర్తికాకపోయినా బదిలీ చేశారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లు వినకపోవడమే ఇందుకు కారణం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే కమిషనర్ల బదిలీ కోసం పురపాలకశాఖ అధికారులపై గట్టిగా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లూ చెప్పినట్లు వినే కమిషనర్లను తమ నియోజకవర్గ పరిధిలోని పురపాలక సంఘాలకు బదిలీపై రప్పించుకున్నారు.
ఇంజినీర్ల బదిలీల్లోనూ అదే తీరు
పురపాలకశాఖలోని ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 37 మంది ఇంజినీర్లను బదిలీ చేశారు. వీటిలోనూ పైరవీలదే పైచేయి. అయిదేళ్లు ఒకే ప్రాంతంలో పని చేసిన పలువురు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇందుకోసం అక్కడి ఎమ్మెల్యేలతోపాటు నగరపాలక సంస్థల మేయర్ల నుంచి కూడా సిఫార్సు లేఖలు తెచ్చుకున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థలో ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగంలో అనేక ఏళ్లపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పని చేసిన ఒకర్ని మళ్లీ అదే సంస్థలో సూపరింటెండింగ్ ఇంజినీర్గా నియమించారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి ఆయన పేరు సిఫార్సు చేశారని తెలుస్తోంది. కొద్ది నెలల క్రితమే పదోన్నతిపై నెల్లూరు జిల్లాకు వచ్చిన ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను.. ఒక మంత్రి మాట వినలేదన్న కారణంతో రాయలసీమ జిల్లాకు బదిలీపై పంపారు.
* తిరుపతి నగరపాలక సంస్థలో ఏడేళ్లకు పైగా పని చేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను ఈసారీ కదపలేదు. కానీ సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ) మోహన్ను రెండేళ్లకే బదిలీ చేశారు. పురపాలకశాఖలోని ఒక ఉన్నతాధికారి ఆగ్రహానికి గురవడం వల్లే ఆయనపై బదిలీ వేటు పడిందని తెలుస్తోంది.
* రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శేషగిరి మూడేళ్లలోపే తాను కోరుకున్న కాకినాడ నగరపాలక సంస్థకు బదిలీ చేయించుకున్నారు.
* విజయవాడ నగరపాలక సంస్థలో గతంలో ఈఈగా పని చేసిన కొద్దికాలం క్రితం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీపై వెళ్లిన శ్రీనివాస్ తిరిగి నగరపాలక సంస్థకు వస్తున్నారు.
* ఏడాదిన్నర క్రితం విశాఖ నుంచి బదిలీపై ఏలూరు కార్పొరేషన్ ఎస్ఈగా వచ్చిన కె.రామ్మోహనరావు మళ్లీ విశాఖకే బదిలీ చేయించుకున్నారు.
* తిరుపతిలోని ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం డివిజన్ ఈఈ పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా ఈసారీ దానికి ఎవర్నీ కేటాయించలేదు.
* కర్నూలు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి ఎస్ఈ సురేంద్రబాబు గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ జూన్ 30న అనిశాకు పట్టుబడ్డారు. బదిలీల్లో ఆయన్ను హిందూపురం మున్సిపాలిటీకి బదిలీ చేశారు.
* ప్రజారోగ్య విభాగంలో డీఈఈ, ఏఈ బదిలీల జీవో ఇంకా విడుదల కాలేదు. ఇందుకు వడపోత పూర్తి కాలేదని, అది జరిగాక పాత తేదీతోనే జీవో విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.
పట్టణ ప్రణాళికలో అక్కడికక్కడే..
పురపాలక పట్టణ ప్రణాళిక విభాగం బదిలీల్లో ఉన్నత స్థాయిలో చక్రం తిప్పిన కొందరు అధికారులు ప్రస్తుతం పని చేస్తున్న పట్టణాల్లోనే కొనసాగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావును విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చీఫ్ అర్బన్ ప్లానర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. అక్కడ పని చేస్తున్న బి.సురేశ్కుమార్ను జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్గా నియమించారు. వీరిద్దరూ నగరం కదలకుండా అక్కడే మరి కొన్నాళ్లు కొనసాగనున్నారు. విజయవాడ కార్పొరేషన్లోని ఇద్దరు పట్టణ ప్రణాళిక అధికారులు నగరానికి కూతవేటు దూరంలోని కీలక పురపాలక సంఘానికి బదిలీ చేయించుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులు వీరికి అక్కరకొచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.