‘చెత్త’ రుసుం పక్కదారి!
నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్త కోసం వసూలు చేస్తున్న రుసుములు పక్కదారి పడుతున్నాయి. వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందిలో కొందరు వీటిని సొంతానికి
రసీదులివ్వకుండా వాలంటీర్ల వసూళ్లు
ఈనాడు-అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్త కోసం వసూలు చేస్తున్న రుసుములు పక్కదారి పడుతున్నాయి. వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందిలో కొందరు వీటిని సొంతానికి వాడుకుంటున్నారు. వసూలు చేసిన మొత్తాలకు రసీదులనూ ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) డివైజ్లు ఇచ్చినా సరిగా ఉపయోగించడం లేదు. బకాయిలపై కమిషనర్లు సిబ్బందిని ప్రశ్నించిన చోట ప్రజలు చెల్లించడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని 42 పుర, నగరపాలక సంస్థల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి ప్రతి నెలా వినియోగ రుసుములు వసూలు చేస్తున్నారు. కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.120 చొప్పున వాలంటీర్ల సమక్షంలో వార్డు సచివాలయాల సిబ్బంది 2021 నవంబరు నుంచి వసూలు చేస్తున్నారు. ఇందుకోసం పలు పుర, నగరపాలక సంస్థలు రసీదు పుస్తకాలు ముద్రించి సచివాలయాలకు అందజేశాయి. 694 పీఓఎస్ డివైజ్లను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమకూర్చింది. వసూలైన మొత్తాలు అదే రోజు సంబంధిత పుర, నగరపాలక సంస్థల బ్యాంకు ఖాతాలో జమయ్యేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాలతో పాటు కొన్ని పట్టణాల్లో వసూలు చేస్తున్న వినియోగ రుసుములపై సిబ్బంది రసీదులివ్వడం లేదు. చాలాచోట్ల వాలంటీర్లే ఈ మొత్తాలు వసూలు చేస్తున్నారు. రసీదు ఇవ్వాలని గట్టిగా నిలదీస్తే అలాంటి ఇళ్లకు రెండోసారి మళ్లీ వెళ్లడం లేదు. విజయవాడలో ఇటీవల విశ్రాంత ఉద్యోగి ఒకరి ఇంటికి వెళ్లిన వాలంటీరు వినియోగ రుసుములు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. రసీదు ఇస్తే చెల్లిస్తానంటే వాలంటీరు మళ్లీ కనిపించలేదని ఆయన తెలిపారు. విశాఖలో కొందరి మొబైళ్లకే రుసుములు చెల్లించినట్లు సమాచారం వస్తోంది. గుంటూరులో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న కొన్ని ప్రాంతాల్లో కొందరికే రసీదులిస్తున్నారు. అత్యధిక నగరాలు, పట్టణాల్లో సాంకేతిక సమస్యలంటూ పీఓఎస్ డివైజ్లను వాడడం లేదు.
వసూళ్లపై అధికారుల ఆరా
వినియోగ రుసుములను వాలంటీర్లు, సచివాలయాల బాధ్యులు సొంతానికి వాడుకుంటున్నారా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఉన్నతాధికారులు రుసుముల అంశాన్ని ప్రస్తావించారు. వసూలు చేస్తున్న మొత్తాలు సరిగా జమవుతున్నాయో, లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలని కమిషనర్లను ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నంలోని కొన్ని డివిజన్లలో నిధులు దుర్వినియోగమవుతున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
వాహనానికో పీవోస్ డివైజ్
ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రస్తుతానికి ఉపయోగిస్తున్న 2,500 వాహనాలకో డివైజ్ చొప్పున సరఫరా చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే సమకూర్చిన 694 డివైజ్లు పూర్తిగా వాడకంలోకి తెచ్చి మరో 1,806 సరఫరా చేయనున్నారు. వినియోగ రుసుముల వసూళ్లకు విధిగా డివైజ్ ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రతి పైసా పక్కాగా పుర, నగరపాలక సంస్థల బ్యాంకు ఖాతాలకు జమవుతుందని అంటున్నారు.
* ఇళ్ల నుంచి చెత్త సేకరణకు రుసుములు వసూలు చేస్తున్న పట్టణ స్థానిక సంస్థలు: 42
* నెలకు వసూళ్ల లక్ష్యం: రూ.15 కోట్లు
* వసూలవుతుంది: 7.50 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?