వాడిన నూనే ఇం‘ధనమ’వునులే!
వాడిన వంటనూనెతో జీవ ఇంధన (బయో డీజిల్) ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వాడిన వంటనూనెలను కొనుగోలు చేసి, వాటినుంచి బయోడీజిల్ తయారుచేసే
ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్న కేంద్రం
పెట్రోలుతో కలిపితే కాలుష్యం పరిమితం
సేకరణకు పలు సంస్థల ఆసక్తి
రాష్ట్రంలో ప్రాథమిక దశలో ఈ విధానం
ఈనాడు, అమరావతి, విశాఖపట్నం
వాడిన వంటనూనెతో జీవ ఇంధన (బయో డీజిల్) ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వాడిన వంటనూనెలను కొనుగోలు చేసి, వాటినుంచి బయోడీజిల్ తయారుచేసే సంస్థలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ సంస్థలు నూనెను జీవ ఇంధనంగా మార్చి, కేంద్రప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం తదితర సంస్థలకు విక్రయిస్తున్నాయి.
జాతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వద్ద ‘రుకో’ (రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్) కేటగిరీలో దేశవ్యాప్తంగా వంటనూనెల నుంచి జీవ ఇంధనం తయారుచేసే 43 పరిశ్రమలు పేర్లు నమోదు చేసుకున్నాయి. రాష్ట్రంలో విశాఖ, కాకినాడల్లో మూడు సంస్థలు అనుమతులు పొందాయి. గుంటూరు జిల్లాలో మరో సంస్థ ఇందుకు దరఖాస్తు చేసింది.
రోజుకు 50 లీటర్ల మించి వాడితే...
సాధారణంగా 100 లీటర్ల నూనెతో వంట చేస్తే సుమారు 25 లీటర్ల నూనె మిగులుతుంది. దీన్ని మళ్లీ వాడటం అనారోగ్యకరం. ఈ ముప్పును గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ... వాడిన నూనెను జీవ ఇంధన తయారీ సంస్థలకు విక్రయించాలని ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. రోజుకు 50 లీటర్లకు మించి నూనెను వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి, చిప్స్ దుకాణాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. వారంతా రోజుకు ఎంత నూనె కొన్నారో, ఎంత వినియోగించారో రికార్డులు నిర్వహించాలని మార్గదర్శకాల్లో ఉంది.
సేకరణ ఇలా...
జీవ ఇంధన తయారీ సంస్థలు నగరాల్లో ఇప్పటికే వాడిన వంట నూనెల సేకరణకు కొన్ని స్టాకు పాయింట్లు పెట్టుకున్నాయి. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, ఓ మాదిరి హోటళ్లు, మిఠాయి దుకాణాలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి సేకరిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర డబ్బాలు ఏర్పాటు చేసి, అవి నిండాక సమాచారమిస్తే వచ్చి తీసుకెళ్తున్నారు. ఇలా లీటరు రూ.30కి కొని, కేంద్ర ఇంధన సంస్థలకు టెండర్ల ద్వారా లీటరు సుమారు రూ.90కి విక్రయిస్తున్నాయి. పలు ప్రధాన నగరాల్లో ఇలా వాడిన నూనె సేకరిస్తున్నారు. ఈ నూనె డబ్బాలను జీవ ఇంధన పరిశ్రమలకు తరలించి ముందుగా ప్రాసెసింగ్ చేస్తారు. ఆ తర్వాత గ్లిజరిన్ తీస్తారు. చివరిగా జీవ ఇంధనం తయారవుతుంది. ఈ శుద్ధి చేసే క్రమంలో వచ్చే వ్యర్థాలను సబ్బుల తయారీ పరిశ్రమలకు తరలిస్తారు. జీవ ఇంధనాన్ని ఎక్కువగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొంటాయి. దీన్ని పెట్రోలులో కలిపితే కాలుష్యం చాలావరకు తగ్గుతుంది.
సౌకర్యాల కల్పనకు చర్యలు
- జె.నివాస్, కమిషనర్, ఫుడ్ సేఫ్టీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
ఉపయోగించిన వంటనూనెను మళ్లీ మళ్లీ వాడుతూ తయారుచేసే ఆహార పదార్థాలను తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. వాడిన వంటనూనెను జీవ ఇంధనంగా మార్చేందుకు ముందుకొచ్చే సంస్థలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నాం.
ఎఫ్ఎస్ఎస్ఏఐ అంచనా ప్రకారం దేశంలో ఏడాదికి నూనెల వినియోగం ఇలా...
మొత్తం వినియోగిస్తున్న నూనె 2,466.67 కోట్లు
గృహ అవసరాలకు 1,480 కోట్లు
వాణిజ్య అవసరాలకు 986.67 కోట్లు
రాష్ట్రంలో ఒకరోజు వినియోగించే నూనె 22 లక్షల లీటర్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM