నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభమవుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక సామగ్రి బడులకు చేరలేదు. ఈ ఏడాది పాఠశాలలు తెరవడానికి 22 రోజులు అదనంగా సమయం లభించినా సకాలంలో బడులకు అందించలేకపోయారు.
జిల్లాలకు చేరని కోటికిపైగా పాఠ్య పుస్తకాలు
విద్యా కానుక ఆలస్యమే
బూట్లు, ఏకరూప దుస్తుల సరఫరా 30శాతమే
తల్లిదండ్రులపైనే వస్త్రాల కుట్టుకూలి భారం
ఈనాడు, అమరావతి: పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభమవుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక సామగ్రి బడులకు చేరలేదు. ఈ ఏడాది పాఠశాలలు తెరవడానికి 22 రోజులు అదనంగా సమయం లభించినా సకాలంలో బడులకు అందించలేకపోయారు. దీంతో పాఠశాలలకు వచ్చిన అరకొర వస్తువులతోనే ఉపాధ్యాయులు కిట్లను సిద్ధం చేశారు. పాఠ్యపుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు, ఏకరూప దుస్తులు, నిఘంటువులు బడులకు చేరకపోవడంతో పంపిణీ సమయాన్నే పెంచేశారు. విద్యా కానుక వస్తువులు సరఫరా కాలేదనే లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈనెలాఖరు వరకు విద్యార్థులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వస్తువుల సరఫరాకు గుత్తేదార్లకు మరో 25 రోజుల అదనపు సమయం లభించగా.. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు లేకుండానే బడులకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 1-10 తరగతి వరకు 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు క్షేత్రస్థాయికి 70శాతం చేరాయి. ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ చేరలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 47.40 లక్షల మంది విద్యార్థులకు అందించాల్సిన బూట్లు, ఏకరూప దుస్తులు 30శాతం మాత్రమే సరఫరా అయ్యాయి. బ్యాగ్లు 60శాతం, నిఘంటువులు 50శాతంలోపే చేరాయి.
జిల్లాలకు చేరని పుస్తకాలు..
ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యంగా జూన్ చివరి వారంలో మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా.. మరో కోటికిపైగా జిల్లాలకు చేరాల్సి ఉంది. మండల కేంద్రాలకు వచ్చిన పుస్తకాల్లోనూ అన్ని టైటిళ్లు లేవు. దీంతో ఉన్నవాటితోనే కిట్లను సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు సైతం పాఠ్యపుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కానీ, ఇంతవరకు ఒక్క పుస్తకాన్ని అందించలేదు. వీటికి డబ్బులు చెల్లించేందుకు ఆన్లైన్ విధానం తీసుకొస్తామని చెప్పిన అధికారులు వెబ్సైట్నే రూపొందించలేదు.
విద్యా కానుకను పాఠశాలలు పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందించాల్సి ఉండగా.. సామగ్రి సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొంది. టెండర్ల దశలోనే సుమారు 40 రోజుల వరకు ఆలస్యం కాగా.. ఇప్పుడు సరఫరాలోనూ అలసత్వమే కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 47.40 లక్షలమంది విద్యార్థులకు విద్యాకానుకలను అందించాల్సి ఉంది. మూడు జతల ఏకరూప దుస్తులు, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్, నిఘంటువులు, పాఠ్య పుస్తకాలను కలిపి కిట్గా అందించాలి. చాలా జిల్లాలకు బూట్లు, ఏకరూప దుస్తులు, నిఘంటువులు సరఫరా కాలేదు. బూట్లు, ఏకరూప దుస్తులు 30శాతంలోపే సరఫరా అయ్యాయి. వీటిని విద్యార్థులకు అందేందుకు మరో నెలరోజులకుపైగా సమయం పట్టనుంది.
కుట్టుకూలి లేదు..
ఏకరూప దుస్తులు ఇస్తున్న ప్రభుత్వం కుట్టుకూలి డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. గతేడాది వస్త్రాలను ఇచ్చి, వాటిని కుట్టించుకునేందుకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో తల్లిదండ్రులే సొంత డబ్బులతో కుట్టించుకున్నారు. నిధులు లేవంటూ రూ.64 కోట్ల చెల్లింపులు నిలిపివేసింది. ఈ ఏడాది కుట్టుకూలి ఇవ్వకపోవడంతో ఆ భారాన్ని తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుంది. గతేడాది సరఫరా చేసిన బూట్ల సైజు సరిపోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మూడు లక్షల బ్యాగ్లు వెనక్కి..
విద్యార్థులకు బ్యాగ్లు అందించేందుకు టెండర్లు నిర్వహించారు. కొన్ని జిల్లాలకు టెండర్లో పేర్కొన్న నాణ్యతకు భిన్నంగా బ్యాగ్లను సరఫరా చేశారు. తనిఖీల్లో నాణ్యత లోపం బయటపడడంతో సుమారు మూడు లక్షల బ్యాగులను వెనక్కి తీసుకువెళ్లాలని గుత్తేదారుకు సూచించారు. కానీ, క్షేత్రస్థాయికి చేరిన వాటిలో ఎన్నింటిని గుత్తేదారు వెనక్కి తీసుకువెళ్లారనే దానిపై స్పష్టత లేదు. గతేడాది ఇచ్చిన బ్యాగులు చెడిపోవడంతో కొందరు విద్యార్థులు పక్కన పడేయగా.. మరికొందరు డబ్బులు పెట్టి బాగు చేయించుకున్నారు.
నెలాఖరు వరకు ఇబ్బందే..
ప్రభుత్వం నిర్ణయం కారణంగా కొంతమంది విద్యార్థులకు జులై నెలాఖరు వరకూ పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక కిట్టు అందే పరిస్థితి లేదు. కొత్తగా ప్రవేశాలు పొందిన వారి వివరాలను జులై 15లోపు అందించాలని, వీరికి సెప్టెంబరు 15లోపు విద్యా కానుక అందిస్తామని వెల్లడించింది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, ‘నాడు-నేడు’ పనులు, విద్యా కానుక కిట్ల సరఫరా సరిగా లేకపోవడంతో పాఠశాలల పునఃప్రారంభాన్ని జులైకి వాయిదా వేశారు. ఇప్పుడు విద్యా కానుక సామగ్రి సరఫరా సరిగా లేకపోవడంతో పంపిణీని నెలాఖరు వరకు పొడిగించారు.
తర‘గతి’ ఇలా.. బోధన ఎలా?
వేసవి సెలవులు పూర్తవడంతో మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభవుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని చెబుతున్న నాడు-నేడు పనులు మాత్రం ఇంకా చాలా పాఠశాలల్లో మందకొడిగా సాగుతున్నాయి. నంద్యాల పట్టణం పద్మావతినగర్లోని టెక్కె పురపాలక ప్రాథమిక పాఠశాలలో రూ.19.99 లక్షలతో మొదటి విడత నాడు-నేడు పనులు చేపట్టారు. ఇసుక, సిమెంటు, ఇనుము రావడం ఆలస్యం కావడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. వరండా, తరగతి గదుల్లో బండపరుపు పూర్తిగా తొలగించారు. నిర్మాణ వ్యర్థాలను వరండా, బడి ఆవరణలోనే పడేశారు. బండ పరుపు తొలగించడంతో కింద కూర్చోలేని పరిస్థితి. ఇక్కడికి చిన్నపిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గండేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే రకమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.
- న్యూస్టుడే, నంద్యాల, ఈనాడు, కాకినాడ
సారొస్తున్నారని..
ఇక్కడ సూక్తులు, బోధనకు తోడ్పడే చిత్రాలతో హడావిడిగా సొబగులు అద్దుకుంటున్నది కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పురపాలక ఉన్నత పాఠశాల తరగతి గది. ‘నాడు- నేడు’ కార్యక్రమం మొదటి విడత కింద ఈ పాఠశాలలో రూ.1.23 కోట్లతో గత ఏడాది మొదలుపెట్టిన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు రెండో విడత కింద ఈ ఏడాది కేటయించిన పనులు ఇప్పటికే పూర్తిచేయాల్సి ఉన్నా అవి కనీసం మొదలు పెట్టలేదు. మంగళవారం ఆదోని పట్టణంలో పర్యటించనున్న సీఎం జగన్ ఈ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో తరగతి గదుల్లో బొమ్మలు గీయడం, టైల్స్, బండ పరుపులు, మధ్యాహ్న భోజనం షెడ్డు, కుళాయిలు, శుద్ధజల యంత్రం మరమ్మతులు తదితర పనులు హడావుడిగా చేపట్టారు. దీంతో వీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల బల్లలు రెండు రోజుల కిందటే పాఠశాలకు చేరుకోవడంతో, వాటిని బిగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
- న్యూస్టుడే, ఆదోని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్