దురుద్దేశంతోనే నాపై కేసు పెట్టారు
అనుచిత లబ్ధిపై ఎలాంటి ఆధారాలూ లేవు
హైకోర్టులో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాజ్యం
ఈనాడు, అమరావతి: నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పరికరాల కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేసింది లేదని, ఒక్క పైసా ఎవరికి చెల్లించలేదన్నారు. ఏపీ విజిలెన్స్ కమిషన్ ఆమోదం పొందకుండా సాధారణ విచారణ జరిపి తనపై కేసు పెట్టారన్నారు. తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన ఈ కేసును రద్దు చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో తుది నిర్ణయం వెల్లడించే వరకు ఎఫ్ఐఆర్ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు. భద్రత పరికరాల కొనుగోలు నిర్ణయంలో తన పాత్ర లేదని పిటిషన్లో పేర్కొన్నారు. తన వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదన్నారు. సేవలందించినందుకు తన వద్ద ఉంచుకున్న రూ.10 లక్షలను ఎస్టీసీఐఎల్ (స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ వెనక్కి ఇచ్చిందని గుర్తుచేశారు. ఎఫ్ఐఆర్లో ఆరోపిస్తున్నట్లు.. పరికరాలను సమకూర్చుకునే (ప్రొక్యూర్) ప్రక్రియను ప్రారంభించింది తను కాదని, అప్పటి డీజీపీ ప్రారంభించారని తెలిపారు. కొనుగోలు కమిటీ, సాంకేతిక కమిటీని కాంపిటెంట్ అథారిటీ అయిన డీజీపీ ఏర్పాటు చేశారని, ఈ విషయంలో తన పాత్ర లేదని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు. అధికార హోదాను అడ్డుపెట్టుకొని ఆ కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేశాననడంలో వాస్తవం లేదని వెల్లడించారు. ఏసీబీ చేసిన విచారణలో కమిటీలలోని ఏ ఒక్క సభ్యుడినీ తాను ప్రభావితం చేసినట్లు చెప్పలేదన్నారు. నేరపూర్వక చర్యకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో వివరాలు లేవన్నారు. అక్రమాలు జరగనప్పుడు, ఆర్థిక నష్టం వాటిల్లనప్పుడు ఏసీబీ చట్టం కింద కేసు చెల్లుబాటు కాదని తెలిపారు. మోసం చేసినట్లు, తన వల్ల ఒక్కరయినా మోసానికి గురయినట్లు ఆరోపణలు లేనందువల్ల ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చెల్లదని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. పోలీసులు తనపై కక్ష సాధింపు కోసం ఒత్తిళ్లకు తలొగ్గి దురుద్దేశంతో కేసు నమోదు చేశారన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Beating Retreat: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ వేడుకలు
-
General News
Telangana News: దేవేంద్రసింగ్, మహేశ్ భగవత్కు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్
-
Technology News
Meta: వాట్సాప్, యూట్యూబ్ యూజర్లకు ‘ఫేస్బుక్’ కీలక సూచన..!
-
India News
President of India: దేశం ఆశలన్నీ వారిపైనే.. జాతినుద్దేశించి ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
General News
TTD: అంతకంతకూ పెరుగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 40గంటలు
-
India News
I-Day: స్వాతంత్య్ర వేడుకల వేళ పంజాబ్లో ఉగ్రముఠా కుట్రలు భగ్నం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్ఝున్వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- RRR: ఆస్కార్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Rakesh Jhunjhunwala: ఝున్ఝున్వాలాను నిలబెట్టిన స్టాక్స్ ఇవే..