7న వైయస్‌ఆర్‌ జిల్లాకు సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈనెల 7వ తేదీన వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ నియోజకవర్గ సమీక్షతోపాటు, పార్టీ నాయకుల మధ్య

Published : 05 Jul 2022 05:15 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈనెల 7వ తేదీన వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ నియోజకవర్గ సమీక్షతోపాటు, పార్టీ నాయకుల మధ్య సమన్వయంపై చర్చిస్తారు. గురువారం రాత్రి ఇడుపులపాయలోనే బస చేసి 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన సమాధి వద్ద జగన్‌ నివాళులర్పిస్తారు. తర్వాత బయలుదేరి గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో నిర్వహించే వైకాపా ప్లీనరీకి హాజరవుతారు.

25 జిల్లాల సమీక్ష

ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న వైకాపా ప్లీనరీ ముగిశాక.. ముఖ్యమంత్రి జిల్లాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. 25 రోజులపాటు వీటిని నిర్వహించే అవకాశం ఉంది. పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను కలిపి ఒక రోజు సమీక్షించనున్నారు. జిల్లాల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో గుర్తించిన ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఉన్న నిధులు సరిపోతాయా లేక ప్రభుత్వం నుంచి అదనపు నిధులను ఏ మేరకు విడుదల చేయాలి. తదితర అంశాలపై సీఎం చర్చించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి రూ.2 కోట్లు చొప్పున అప్పుడే విడుదల చేయవచ్చని సమాచారం. అలాగే ప్రతీ జిల్లా కలెక్టర్‌కూ రూ.5 కోట్ల చొప్పున మంజూరు చేస్తారని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని