బడి మాయమైంది!
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, నూతన విద్యా విధానమంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో విద్యా వ్యవస్థలో అయోమయం నెలకొంది. పాఠశాలలను మూసివేయబోమంటూనే విలీనం
8,000కు పైగా పాఠశాలల నుంచి తరగతుల తరలింపు
స్కూళ్లు, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడానికి విలీనం
విద్యార్థులు కిలోమీటర్ల దూరం వెళ్లి చదవాల్సిన దుస్థితి
వాగులు, వంకల అడ్డంకులను దాటి వెళ్లాల్సిన పరిస్థితి
పలుచోట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, నూతన విద్యా విధానమంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో విద్యా వ్యవస్థలో అయోమయం నెలకొంది. పాఠశాలలను మూసివేయబోమంటూనే విలీనం చేసేస్తున్నారు. ఊరిలోని బడిని మరోచోటకు తరలించేయడమంటే.. మూసివేత కాక మరేమిటి? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ఈనాడు - అమరావతి
వేసవి సెలవులు ముందు వరకు ఉన్న బడి ఇప్పుడు మాయమైపోయింది. పాఠశాల తరలిపోయిందని ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరు ఏ బడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. దీంతో పాఠశాలలు తెరచుకున్న తొలిరోజునే.. పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం పలు పాఠశాలలను విలీనం చేయడంతో విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన దుస్థితి.. ఆడపిల్లల చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులకు రవాణా ఛార్జీలు భారంగా మారనున్నాయి. ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనూ, ప్రాథమికోన్నత బడుల నుంచి 6, 7, 8 తరగతులను ఉన్నత పాఠశాలల్లోనూ విలీనం చేసేశారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే పాఠాలు ఎలా అర్థమవుతాయనే దాన్ని గాలికొదిలేశారు. ఉపాధ్యాయులు, పాఠశాలల సంఖ్యను తగ్గించడంపైనే దృష్టిసారించారు.
చెప్పిందొకటి.. చేస్తోందొకటి..
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. కరికులమ్, బోధనా విధానాల అమలు కోసమే పాఠశాల విద్యను ఎన్ఈపీ నాలుగు స్థాయిలుగా విభజించింది. పాఠశాలను భౌతికంగా విభజించాల్సిన అవసరం లేదని కేంద్ర పాఠశాల విద్యాశాఖ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులు, పాఠశాలల సంఖ్యను తగ్గించుకునేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 42,000 పాఠశాలలు భవిష్యత్తులో 11,000కు తగ్గిపోనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఈ ఏడాది కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేస్తున్నారు. ఇప్పటికే 250 మీటర్ల దూరంలోని 3,627 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇప్పుడు కిలోమీటరు దూరంలోని 8,412 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలిస్తున్నారు. ఇదికాకుండా 6, 7, 8 తరగతుల్లో 100లోపు విద్యార్థులు ఉంటే వీరిని 3 కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఊళ్లో అందుబాటులో ఉన్న పాఠశాలలు మూతపడుతున్నాయి. అధికారులు ప్రస్తుతం ఉన్న పాఠశాల నుంచి కిలోమీటరు, మూడు కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే లెక్కేస్తున్నారే తప్ప పిల్లలు ఇంటి నుంచి రావలసిన దూరాన్ని పట్టించుకోవడం లేదు. బడికి వెళ్లాలంటే వారు పడే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. చిన్నారులు హైవేలను, ప్రధానరోడ్లను, వాగులు, వంకలను దాటాల్సి వస్తుందనే ఆలోచనే చేయడం లేదు.
తరగతి గదులు లేకపోయినా..
అదనపు తరగతి గదులు లేకపోయినా కొన్నిచోట్ల రికార్డులను మార్చేస్తున్నారు. ‘నాడు-నేడు’ రెండో విడతలో 9,000కు పైగా అదనపు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. కానీ తరగతి గదులు లేకపోయినా రికార్డులను విలీన పాఠశాలల్లో అప్పగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హేతుబద్ధీకరణలో మిగులుగా తేలిన ఉపాధ్యాయులను ఆయా బడుల్లో పాఠాలు చెప్పేందుకు కేటాయించాలని నిర్ణయించారు.
ఆందోళన.. హామీ
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను 2 కిలోమీటర్ల దూరంలోని చిలుకూరులో విలీనం చేశారు. నిబంధనల ప్రకారం కిలోమీటరు వరకే మార్చాల్సి ఉండగా.. ఇక్కడ అంతకుమించి దూరం పంపేశారు. మంగళవారం పిల్లలను తీసుకుని వచ్చిన తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి ఆందోళన చేయడంతో విలీనాన్ని మారుస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ప్రజలే బడులను రక్షించుకోవాలి: ఏపీటీఎఫ్
‘‘పాఠశాలల మూసివేత దిశగా అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అడ్డుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇది అధికారులకు కనబడటం లేదా? పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలతోపాటు తల్లిదండ్రులు ముందుకురావాలి’’
- మంజుల, భానుమూర్తి,
అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయ సమాఖ్య
విలీనాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాలకు తాళం
చిత్తూరు జిల్లా గంగవరం మండలం బండమీదజరావారిపల్లెలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను 2.5 కి.మీ. దూరంలోని కీలపట్ల ఉన్నత పాఠశాలలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు బడికి తాళం వేశారు. ఇక్కడ 110 మంది విద్యార్థులు ఉన్నా సరిపడా భవనాలు ఉన్నాయి. అయినా అధికారులు ఈ పాఠశాలను మరోచోటకు బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు మంగళవారం బడి ఎదుట బైఠాయించారు. ఈ పరిసరాల్లో తరచూ ఏనుగులు సంచరిస్తుంటాయని అంతదూరం పిల్లలు నడిచి వెళ్లడం ప్రమాదకరమని వారు పేర్కొన్నారు.
- న్యూస్టుడే, పలమనేరు
తరగతులు ఎత్తివేయడంతో నిరసన
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మునిరత్నం కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులు ఎత్తేసి కొంతదూరంలోని పుదూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. పక్కా భవనాలు ఉన్నా క్రమబద్ధీకరణ పేరుతో తరగతులను తరలించడంతో వారు ఆందోళనకు దిగారు. పుదూరుకు తమ పిల్లలను పంపలేమని, ఇక్కడే తరగతులు నిర్వహించాలంటూ నిరసన తెలియజేశారు.
- న్యూస్టుడే, నాయుడుపేట
రోడ్డెక్కిన పిల్లలు
తమ గ్రామాల్లోని పాఠశాలలను వేరే పాఠశాలల్లో విలీనం చేయవద్దని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పెదఉల్లగల్లు, చిన్నఉల్లగల్లు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల వద్ద ఆయా గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పెదఉల్లగల్లు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు అద్దంకి-దర్శి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
- న్యూస్టుడే, ముండ్లమూరు
బడి దూరం చేయొద్దు
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని 6, 7, 8 తరగతుల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారని మూడు కిలోమీటర్ల దూరంలోని వేపులపర్తి ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. మంగళవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు విషయం తెలుసుకుని ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన మండల విద్యాధికారి వెళ్లకుండా ముళ్లకంపలు వేసి, అడ్డుకున్నారు. ఇప్పటికే కిలోమీటరు దూరం నుంచి సైకిళ్లు, కాలినడకన వస్తున్న విద్యార్థులు 4 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే బెళుగుప్ప మండలం గంగవరం ప్రాథమిక పాఠశాల గేట్లు మూసివేసి విద్యార్థులు నిరసన చేపట్టారు. గుమ్మఘట్ట మండలం గలగల గ్రామ పాఠశాల, సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మేళాపురం ప్రాథమికోన్నత పాఠశాలలలో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. మేళాపురం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.
- న్యూస్టుడే, అనంతపురం విద్య
దాదాపు 3 కి.మీ. దూరంలో ఉన్న బడిలో తమ ఊరి పాఠశాలలను విలీనం చేయడంతో శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని సుభలయకాలనీ, కోరాడకాలనీ, పలాసలోని మెగిలిపాడు పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సుభలయకాలనీ వారు హైవేపై ధర్నా చేయగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు వారికి మద్దతు తెలిపారు.
- న్యూస్టుడే, హిరమండలం, పలాస
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు