గ్రూపు-1 ఉద్యోగాలకు 163 మంది ఎంపిక
గ్రూపు-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్ (వాణిజ్య
టాపర్గా కాకినాడ జిల్లాకు చెందిన రాణి సుస్మిత
వివరాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతంసవాంగ్
వచ్చే నెలలో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు
ఈనాడు, అమరావతి: గ్రూపు-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్ (వాణిజ్య పన్నులశాఖ) తదితర 16 రకాల ఉద్యోగాలకు 163 మంది ఎంపికయ్యారు. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. స్పోర్ట్స్ కోటాకు చెందిన రెండు పోస్టుల వ్యవహారం కోర్టులో ఉన్నందున వాటిని భర్తీ చేయలేదు. అర్హతలు కలిగిన వారు లేనందున మరో రెండు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయలేకపోయినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తుది తీర్పునకు లోబడి నడుచుకుంటామని ఎంపికైన వారి నుంచి సమ్మతి లేఖలను తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఈ నెల 12లోగా ఎంపికైన వారు నేరుగా లేదా పోస్టు ద్వారా తమ సమ్మతి తెలపాలని, వివరాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. అవసరమైతే వీరూ ఏపీపీఎస్సీ తరఫున హైకోర్టులో ఇంప్లీడ్ కావొచ్చునని పేర్కొంది.
పారదర్శకంగా మౌఖిక పరీక్షలు
2018 డిసెంబరులో 167 గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్కు సంబంధించిన అభ్యర్థుల జాబితా వెల్లడిని పురస్కరించుకొని కార్యదర్శి హెచ్.అరుణ్కుమార్, సభ్యులతో కలిసి కమిషన్ ఛైర్మన్ గౌతం సవాంగ్... మంగళవారం సాయంత్రం ఏపీపీఎస్సీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు మూడు బోర్డుల ద్వారా పారదర్శకంగా జరిగాయి. ఈసారి అదనంగా మరో అఖిల భారత స్థాయి అధికారిని బోర్డులోకి తీసుకున్నాం. సబ్జెక్టు నిపుణుల కింద విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సీనియర్ ప్రొఫెసర్లు, విశ్రాంత ఉప కులపతులకు అవకాశాన్ని కల్పించాం. ప్రతి బోర్డులో ఐదుగురు ఉంటే ముగ్గురు బయట నుంచి వచ్చిన వారే’ అని గౌతంసవాంగ్ తెలిపారు.
జవాబుపత్రాన్ని మళ్లీ దిద్దితే మార్కుల్లో తేడాలొస్తాయి
‘హైకోర్టు ఆదేశాలను అనుసరించి సంప్రదాయ పద్ధతి(కన్వెన్షన్)లోనే జవాబుపత్రాల మూల్యాంకనం జరిగింది. సీసీ కెమెరాల నిఘాలో రెండు, మూడుసార్లు జవాబుపత్రాలను నిపుణులు మూల్యాంకనం చేశారు. డిజిటల్, సంప్రదాయ మూల్యాంకనాల ద్వారా మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారి జాబితాల్లో వచ్చిన వ్యత్యాసాల గురించి హైకోర్టులో విచారణ సాగుతోన్నందున వివరాలు చెప్పలేం. దీనిపై గవర్నర్కు నివేదించాం. ప్రతి పేపరులో ఉన్న 15 ప్రశ్నలకు పది మార్కుల చొప్పున కేటాయించాం. ఒక పేపరును దిద్దిన ప్రొఫెసర్ అదే పేపరును మరోసారి దిద్దితే మార్కుల కేటాయింపులో తప్పకుండా తేడాలు వస్తాయి. దీని ప్రకారం ఐదు పేపర్లలో వచ్చిన మార్కుల్లో తప్పకుండా హెచ్చుతగ్గులు ఉంటాయి. గతంలో ఎన్నడూ ఇలా రీ-వాల్యూయేషన్ జరగలేదు’ అని గౌతంసవాంగ్ వివరించారు. ‘ఎంపికచేసిన వారి జాబితాను శాఖల వారీగా హెచ్వోడీలకు పంపుతాం. వారు నియామక పత్రాలు జారీ చేస్తారు’ అని కార్యదర్శి అరుణ్కుమార్ తెలిపారు.
వచ్చే నెలలో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు
‘వచ్చే నెలలో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లను ఇస్తాం. ఇప్పటికే జారీచేసిన వాటిల్లోని 13 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం. రెవెన్యూ శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్స్, దేవాదాయ శాఖకు చెందిన ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రూపు-1 ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న దానిపై ఇంకా చర్చలు సాగుతున్నాయి. నోటిఫికేషన్ జారీ నాటికి నిర్ణయం తీసుకుంటాం’ అని గౌతం సవాంగ్ వెల్లడించారు.
తొలి పది మంది వీరే...
నోటిఫికేషన్లో పేర్కొన్న 167 పోస్టుల్లో 30 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికైన తొలిపది మంది వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరిలో రాణి సుస్మిత(కాకినాడ జిల్లా) కె.శ్రీనివాసులురాజు(అన్నమయ్య జిల్లా), వి.సంజనాసింహా(హైదరాబాద్), ఎన్.రామలక్ష్మి(విజయవాడ), పి.శ్రీలేఖ(అనంతపురం జిల్లా), ఎన్.మనోజ్రెడ్డి(అన్నమయ్య జిల్లా), కె.మధులత(అనంతపురం), డి.కీర్తి(విశాఖపట్నం), ఎస్.భరత్నాయక్(అనంతపురం), ఎ.సాయిశ్రీ(బళ్లారి) ఉన్నారు.
మార్కులనూ బహిర్గతం చేయాలి
ఎంపిక జాబితా ప్రకటించినప్పుడు వచ్చిన మార్కులనూ వెల్లడిస్తే అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో ఈ విధానం అమల్లో ఉంది. ఎంపికైన వారిలో తెలుగు మాధ్యమంలో చదివిన వారెంత మంది ఉన్నారో ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివరాలనూ ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి అరుణ్కుమార్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..