కదులుతున్న అక్రమాల డొంక
పోలవరం భూ కుంభకోణంలో మరిన్ని కొత్త విషయాలు
ఒక ఉన్నతాధికారి, మరో విశ్రాంత ఉన్నతాధికారి అరెస్టుకు రంగం సిద్ధం
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు భూముల పరిహారం పంపిణీ అక్రమాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక గ్రామాల గిరిజనులు తమకు ఇంకా పరిహారం అందలేదని చెప్పడం, ఇప్పటికే వారి భూములకు పరిహారం చెల్లించినట్లు రికార్డుల్లో నమోదై ఉన్న అంశాలు బయటపడుతూనే ఉన్నాయి. దాదాపు రూ.50 కోట్ల వరకు ఇలాంటి అక్రమాలు జరిగి ఉంటాయని విశ్వసనీయ వర్గాల కథనం. దొంగ పట్టాలు సృష్టించి, కొండ పోరంబోకు భూముల సేకరణలో అనర్హులకు పరిహారం పంపిణీ చేసిన అంశాన్ని మే నెలలోనే ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఈ కుంభకోణంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు. పోలవరం ప్రత్యేకాధికారి ప్రవీణ్ ఆదిత్య విచారణ జరిపి జిల్లా కలెక్టరుకు నివేదిక సమర్పించారు. అనంతరం ఈ అక్రమాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మరో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం
ఈ అక్రమాలు జరిగిన సమయంలో దేవీపట్నం ఎమ్మార్వోగా పని చేసిన వీర్రాజును అధికారులు సస్పెండు చేయడంతోపాటు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్రమాల్లో మరో ఇద్దరు కీలక అధికారుల ప్రమేయం ఉందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో వీటికి కొన్ని ఆధారాలు దొరికినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో భూ సేకరణ ప్రత్యేక కలెక్టరుగా పని చేసిన ఇద్దరు రెవెన్యూ అధికారుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. అందులో ఒకరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. మరొకరు వేరే చోట విధుల్లో ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దళారులపై పోలీసుల కన్ను
అక్రమాల్లో నలుగురు దళారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కీలకంగా వ్యవహరించారు. అధికారులను కలుపుకొని, పరిహారాన్ని పక్కదోవ పట్టించడంలో వారే కీలక పాత్ర పోషించారు. పోలీసులు దళారులపైనా కన్నేశారు. ఒక ప్రధాన దళారి నుంచి సమాచారం రాబడుతున్నారని తెలిసింది. ఎమ్మార్వో, దళారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇద్దరు ఉన్నతాధికారుల ప్రమేయాన్ని ఇందులో ఆధార సహితంగా గుర్తించినట్లు తెలిసింది.
కొండమొదలుది మరో కథ
దేవీపట్నం మండలం కొండమొదలు భూములకు సంబంధించి అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అక్కడ భూముల పరిహారానికి నిజమైన హక్కుదారులు ఎవరో తేలకపోవడంతో గతంలో ఉన్న ఒక అధికారి రూ.25 కోట్లను కోరుకొండలోని ఒక బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిసింది. తర్వాత కొందరు దళారులు అప్పట్లో ఒక ఉన్నతాధికారిని సంప్రదించారు. అసలు హక్కుదారులు తేలక ముందే దాదాపు రూ.18 కోట్ల వరకు మొత్తం వేరేవారి పేరున చెక్కులు ఇచ్చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో పెద్ద మొత్తంలో కమీషన్ చేతులు మారిందన్న ఆరోపణలున్నాయి. తాజా విచారణలో ఈ అంశమూ వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP Vs JDU: భాజపాతో బంధానికి బీటలు.. సోనియాకు నీతీశ్ కాల్ చేశారా..?
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
CM KCR: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
Movies News
Telugu movies: ఈ వారం అటు థియేటర్.. ఇటు ఓటీటీలో సినిమాలే సినిమాలు..!
-
General News
Heavy Rains: మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణకు భారీ వర్షాలు!
-
World News
China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Hyderabad News: కారు డ్రైవర్పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస