రూ.272 కోట్ల డ్రెడ్జింగ్ పనులపై కన్ను
ఉభయగోదావరి జిల్లాల్లో కాటన్ బ్యారేజి ఎగువన కుడి, ఎడమన డ్రెడ్జింగ్ పనులు అర్హతలు లేకున్నా ఒక గుత్తేదారుకు అప్పచెప్పేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రూ.272.36 కోట్లతో
అర్హతలు లేని గుత్తేదారుకు అప్పజెప్పే యత్నాలు
టెండర్లు ఖరారు చేయకుండానే సెలవుపై ఎస్ఈ
తాజా బదిలీల్లో ఆయనకు అప్రాధాన్య పోస్టింగ్
ఇంకా దృష్టి సారించలేదన్న ఇన్ఛార్జి ఎస్ఈ
ఈనాడు, అమరావతి: ఉభయగోదావరి జిల్లాల్లో కాటన్ బ్యారేజి ఎగువన కుడి, ఎడమన డ్రెడ్జింగ్ పనులు అర్హతలు లేకున్నా ఒక గుత్తేదారుకు అప్పచెప్పేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రూ.272.36 కోట్లతో రెండు ప్యాకేజీలుగా ఈ పనులకు టెండర్లు పిలిచారు. ఆ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసి గుత్తేదారుడిని ఖరారు చేయాల్సి ఉన్నా అది మధ్యలోనే ఆగిపోయింది. టెండర్లు పిలిచి, వాటిని తెరిచి, గుత్తేదారుల సాంకేతిక అర్హతలు పరిశీలించిన అధికారి హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టి వెళ్లిపోయారు. దాదాపు 15 రోజుల పాటు ఆయన సెలవులోనే ఉన్నారు. ఈ లోపు జలవనరులశాఖలో బదిలీల ప్రక్రియ సాగింది. అలా సెలవుపై వెళ్లిన అధికారికి ప్రస్తుతం వేరే పోస్టింగు దక్కింది. ఆయనను ఎలాంటి ప్రాధాన్యం లేని నీరు చెట్టు ఎస్ఈగా నియమించారు. ఇప్పుడు గోదావరి ఎస్ఈగా అదనపు బాధ్యతల్లో ఉన్న అధికారి ఈ టెండర్లపై దృష్టి సారించాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియ చేపట్టిన అధికారి హఠాత్తుగా సెలవుపై వెళ్లడమూ, ఇప్పటికీ ఈ ప్రక్రియ కొలిక్కి రాకపోవడం చర్చనీయాంశమవుతోంది.
అర్హతలపై సమగ్ర నోట్
అఖండ గోదావరిలో కాటన్ బ్యారేజి ఫోర్ షోర్లో ఇసుక డ్రెడ్జింగ్కు రూ.272.36 కోట్లతో ఈ శాఖ పాలనామోదం ఇచ్చింది. ఎల్ ఎస్ పద్ధతిలో ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. గోదావరి ఎడమ వరద గట్టు 3కి.మీ నుంచి 12.150 కి.మీ వరకు రూ.144.23 కోట్లతో, కుడి వైపు వరద గట్టు 3కి.మీ నుంచి 12.150 కి.మీ వరకు రూ.128.13 కోట్లతో టెండర్లు పిలిచారు. ఒక ప్యాకేజికి సంబంధించి ముగ్గురు గుత్తేదారులు, మరో ప్యాకేజికి ఒక గుత్తేదారు మాత్రమే టెండర్లు వేశారని అధికారులు చెబుతున్నారు. గుత్తేదారుల సాంకేతిక అర్హతలకు సంబంధించిన బిడ్ను అధికారులు తెరిచారు. వారి వారి అర్హతలను పరిశీలించారు. జీవో 94 ప్రకారం ఎవరెవరికి ఏయే అర్హతలు ఉన్నాయో, ఎవరికి అర్హతలు లేవో ఒక సమగ్ర నోట్ తయారు చేసి అప్పటి సూపరింటెండెంటు ఇంజినీరు (ఎస్ఈ) ఉన్నతాధికారులకు పంపారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ గుత్తేదారుడికి జీవో 94 ప్రకారం అవసరమైన అర్హతలు లేకున్నా... ఆయనకే పనులు అప్పగించాలనే ఒత్తిళ్లు కొన్ని స్థాయిల్లో వచ్చినట్లు తెలిసింది. ఫోర్ షోర్ ఏరియాలో డ్రెడ్జింగ్ చేసిన అనుభవం లేకున్నా, ప్రస్తుతం పిలిచిన టెండరుకు సంబంధించి అదే తరహా పని, నిర్దేశించిన మొత్తానికి చేసిన అర్హత లేకున్నా ఆ గుత్తేదారుడికే పనులు అప్పగించాలని ఉన్నత స్థాయిలో కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇంతలో సంబంధిత ఎస్ఈ సెలవుపై వెళ్లడం గమనార్హం. ఆ ఎస్ఈతో మాట్లాడేందుకు ‘ఈనాడు’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయనను ఎలాంటి ప్రాధాన్యం లేని ఏలూరు జిల్లా నీరు చెట్టు ఎస్ఈగా నియమించారు.
తెరవెనుక సంప్రదింపులు
ఒక ప్యాకేజికి ముగ్గురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు. అందులో అర్హతలు ఉన్న కంపెనీకి కాకుండా వేరే సంస్థకు పనులు అప్ప చెప్పే ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని అర్హతలు ఉన్న గుత్తేదారు ఈ అంశాన్ని వివాదం చేయకుండా ఉండేందుకు ఆయనతో తెరవెనుక సంప్రదింపులు జరుగుతున్నాయి. మూడేళ్ల కిందట తూర్పు డెల్టాలో ఒక డ్రెయిన్ డ్రెడ్జింగ్ పనులకు ఈయన కూడా టెండరు దాఖలు చేశారు. ఏ కారణం చేతనో అప్పట్లో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ పనులు ఆయనకు అప్పగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర స్థాయి కమిటీకి నివేదిస్తాను: ఇన్ఛార్జి ఎస్ఈ
ఈ వ్యవహారంపై ప్రస్తుతం గోదావరి ఎస్ఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహమూర్తిని ‘ఈనాడు’ వివరణ కోరగా... ‘నేను ఈ పోస్టులో అదనపు బాధ్యతల్లో ఉన్నాను. అన్నీ పరిశీలించి నిబంధనల ప్రకారం చేస్తాను. టెండర్ల ప్రక్రియ ఏ దశలో ఉంది. ఆర్థిక బిడ్ ఇంకా తెరిచారా లేదా అన్నది నేను దృష్టి సారించలేదు. అన్నీ పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీకి నివేదిస్తాను...’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి