Margani Bharat Ram: ఎంపీ సెల్‌ఫోన్‌ మిస్సింగ్‌పై వివాదం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ సెల్‌ఫోన్‌ మిస్సింగ్‌పై వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి రోజాకు వీడ్కోలు పలికేందుకు మంగళవారం ఆయన

Updated : 06 Jul 2022 08:17 IST

తనిఖీ పేరిట పోలీసులు అనుచితంగా

ప్రవర్తించారని మహిళ ఆవేదన

కోరుకొండ, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ సెల్‌ఫోన్‌ మిస్సింగ్‌పై వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి రోజాకు వీడ్కోలు పలికేందుకు మంగళవారం ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఓ మహిళ ఆయనతో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం తన సెల్‌ఫోన్‌ చోరీకి గురైందని కోరుకొండ పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగారు. సిగ్నల్స్‌ ఆధారంగా గాడాల సమీపంలోని ఓ కాలనీలో నివసిస్తున్న శిరీష ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో వెతికినా ఫోన్‌ కనిపించకపోవడంతో వెనుతిరిగారు. ఈ సంఘటనపై శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును దుయ్యబట్టారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, మహిళనని చూడకుండా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇంట్లో దుస్తులు, సామగ్రి కింద పడేశారని తెలిపారు. తనకు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. సెల్‌ఫోన్‌ కనిపించడం లేదని ఎంపీ ఫిర్యాదు చేయడంతో సెల్‌టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా శిరీష ఇంటికి వెళ్లి అడిగామని ఎస్సై కట్టా శారదాసతీష్‌ తెలిపారు. ఆమె ఇంట్లో ఉన్న మహిళలతోనే తనిఖీలు నిర్వహించామని, దురుసుగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని