Andhra News: 10.30కి వివాదం.. 8 గంటలకే కేసు!

తమపై దాడిచేసి.. మళ్లీ తమపైనే ఎదురు కేసులు పెట్టారని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పెనగడం ఎస్సీ కాలనీ వాసులు మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌ ఎదుట నిరసన

Updated : 06 Jul 2022 08:34 IST

వైకాపా నేతల తీరుపై ఎస్సీ కాలనీ వాసుల ఆవేదన

ఏర్పేడు, న్యూస్‌టుడే: తమపై దాడిచేసి.. మళ్లీ తమపైనే ఎదురు కేసులు పెట్టారని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పెనగడం ఎస్సీ కాలనీ వాసులు మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ‘ఆదివారం మేమంతా కలసికట్టుగా శ్రీ గుర్రప్ప స్వామి కొలుపు చేస్తుండగా కొందరు వైకాపా కార్యకర్తలు వచ్చి తామే పూజలు చేయాలని వివాదానికి దిగారు. సంప్రదాయం ప్రకారం ఏళ్లతరబడి చేస్తున్న వ్యక్తులే పూజలు చేయాలని వారికి చెప్పి, వెనక్కి పంపాం. దీనిపై రాత్రి కాలనీలో వివాదం జరిగింది. ఇరువర్గాల వారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, వైకాపా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కాలనీ వాసులపై కేసు నమోదు చేశారు’ అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 10.30కి వివాదం జరగ్గా ముందస్తుగా 8గంటలకే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని వివరించారు. విచారణ పేరుతో మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్‌కి పిలిపించినా.. రాత్రి వరకూ తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదన్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని