నవరత్నాల పేరుతో నవఘోరాలు
వేధించేవారిని వదిలిపెట్టను. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులకు కచ్చితంగా చెబుతున్నా. మీ బలహీనతలను అడ్డుపెట్టుకుని మిమ్మల్ని అక్రమాలకు వాడుకుంటున్నారు. మీ అందరినీ గుర్తు
వేధించేవారిని వదిలిపెట్టను
మంత్రి పెద్దిరెడ్డికి అన్ని కాంట్రాక్టులా?
అమ్మఒడి బూటకం.. ఆంగ్ల మాధ్యమం నాటకం
మదనపల్లె మినీ మహానాడులో చంద్రబాబు
వేధించేవారిని వదిలిపెట్టను. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులకు కచ్చితంగా చెబుతున్నా. మీ బలహీనతలను అడ్డుపెట్టుకుని మిమ్మల్ని అక్రమాలకు వాడుకుంటున్నారు. మీ అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఎక్కడున్నా తప్పించుకోలేరు. రేపు ట్రైబ్యునల్ వేసి వడ్డీతో చెల్లించేలా శిక్షిస్తాం. సీఐడీ చీఫ్ మిమ్మల్ని కాపాడలేరు. తమాషాలు చేయొద్దు. నేను చండశాసనుడిలా ఉంటా.. జాగ్రత్త.
- చంద్రబాబు
ఈనాడు డిజిటల్, కడప: ‘అధికారం ఇస్తే తమాషాలు చేస్తారా? సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని 600 కేసులు పెట్టారు. 128 మందిని అరెస్టుచేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగితే నేను చేశానంటూ నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పత్రిక రాసింది. ఆ పత్రిక ఎండీ భారతిరెడ్డిని అరెస్టు చేయగలరా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ‘ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా’ పేరుతో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం నవరత్నాల పేరుతో నవఘోరాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ‘సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారంటూ ఇటీవల పలువురిని అరెస్టుచేసి కొట్టారు. అలా కొట్టిన సీఐని గుర్తుపెట్టుకున్నాం. సీఎం జగన్.. తన బాబాయ్ హత్య కేసును ఆయన కుమార్తె మీదే నెట్టేసే కుట్ర చేస్తున్నారు. వివేకా కేసులో ఇప్పటికే ముగ్గుర్ని చంపేశారు. సత్తెనపల్లి దగ్గర రైలు బోగీ దహనం చేసి ఎంపీ రఘురామకృష్ణరాజును చంపే కుట్ర చేశారు. ఆయన గ్రహించి తిరిగి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు. ఆయనపైనే తిరిగి ఇప్పుడు అన్యాయంగా కేసు పెట్టారు’ అని మండిపడ్డారు. ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేస్తాం. తండ్రి.. కొడుకు... తమ్ముళ్లు పదవులు పంచుకుంటూ ఇసుక, గనులు, మద్యం పేరుతో దోచుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉండేవారికి కాంట్రాక్టు పనులు ఇవ్వడమా? పులివెందుల నుంచి పుంగనూరుకు పైపులైను పనులు, పుంగనూరులో మరో జలాశయం పనుల కాంట్రాక్టును ఏకపక్షంగా కట్టబెట్టారు. వీటి కథంతా చూస్తాం’ అని హెచ్చరించారు.
‘మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాడుతున్నాం. ఎక్కడ చూసినా సమస్యలే. ప్రశ్నించినవారిని బెదిరించి కేసులు పెడుతున్నారు. మేం కన్నెర్ర చేస్తే వైకాపా నేతలు బయటకు రాలేరు. నాడు మేం తలచుకుంటే జగన్ పాదయాత్ర చేసేవారా? ఆ రోజు ఊరూరూ తిరిగి ముద్దులు పెట్టి.. ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నారు. మా హయాంలో ప్రతి గ్రామంలో పాఠశాలలు కట్టించాం. మండలానికో జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్కో ఇంజినీరింగ్, జిల్లాకో వైద్యకళాశాల ఏర్పాటు చేశాం. ఇప్పుడేమో 8వేల గ్రామాల్లో పాఠశాలలు మూసేశారు. వీటిని మూయకుండా అడ్డుకోండి’ అని పిలుపునిచ్చారు. ‘ఇటీవల ఇంటర్, పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వాటిని చూసి 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సీఎం చదవలేదు. ఇతరులు చదవరాదని బడులు మూసేసి చెట్లు.. పుట్టలు.. వాగులు.. వంకలు దాటుకుని చదువుకునేలా కక్షలకు పాల్పడుతున్నారు. జగన్ కూతుళ్లు విదేశాల్లో చదవాలి. అమ్మఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేశారు. అమ్మఒడి బూటకం.. ఇంగ్లీషు మీడియం ఓ నాటకం. నాడు- నేడు అవినీతిమయం’ అని ఘాటుగా విమర్శించారు.
పోరాడేందుకు ఇంటికొకరు రావాలి
‘ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు రావాలి. ఒకరిని అరెస్టు చేస్తే వందమంది వెళ్లి నిలదీయాలి. మీకు అండగా ఉంటాం. 24 గంటలు పనిచేసేలా మీకు ఫోన్ నంబరు ఇస్తాం. అన్ని రకాలా ఆదుకుంటాం’ అని భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్నింటిపై బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై భారం మోపారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెస్తున్నారు. మూడేళ్లలో 5సార్లు విద్యుత్తుఛార్జీలు పెంచారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. కుండపోతలా వాన కురిసినా సభ నుంచి జనం కదలకుండా చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యేవరకూ వేచి ఉన్నారు. పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో మదనపల్లె జనసంద్రంగా మారింది. సభలో పొలిట్బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డి.రమేష్ తదితరులు ప్రసంగించారు.
తెదేపా అధికారంలోకి రావడం తథ్యం
రాజంపేట పార్లమెంటు యువనేత గంటా నరహరి
మదనపల్లె పట్టణం, న్యూస్టుడే: మినీ మహానాడుకు వచ్చిన జనసందోహాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెదేపా విజయదుందుభి మోగించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ యువనేత గంటా నరహరి అన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడాని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వం కింద పనిచేయడానికి తాను కొత్తగా వచ్చానని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.