జేఈఈ మెయిన్స్‌లో రవికిశోర్‌కు 300 మార్కులు!

జేఈఈ మెయిన్స్‌ తొలివిడత ఫలితాల్లో విజయవాడకు చెందిన పెనికలపాటి రవికిశోర్‌కు 300కి 300 మార్కులు దక్కాయి. దాంతో మొదటి ర్యాంకు ఖాయమైంది.

Published : 07 Jul 2022 04:57 IST

జేఈఈ మెయిన్స్‌ తొలి విడత తుది కీ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌; కానూరు, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్స్‌ తొలివిడత ఫలితాల్లో విజయవాడకు చెందిన పెనికలపాటి రవికిశోర్‌కు 300కి 300 మార్కులు దక్కాయి. దాంతో మొదటి ర్యాంకు ఖాయమైంది. జేఈఈ మెయిన్స్‌ మొదటి విడత పరీక్షలు జూన్‌ 23-29 తేదీల మధ్య జరిగాయి.  బుధవారం రాత్రి జాతీయ పరీక్షల సంస్థ తుది కీ విడుదల చేసింది. ఆ ప్రకారం రవికిశోర్‌కు 300 మార్కులు వచ్చాయి. తుది కీలో 12 ప్రశ్నలకు జవాబులు మారాయని శ్రీచైతన్య గ్రూపు సంస్థల ఐఐటీ జాతీయ కన్వీనర్‌ ఎం.ఉమాశంకర్‌ తెలిపారు. చివరి విడత పరీక్ష ఈ నెల 21వ తేదీ నుంచి మొదలవుతుంది. తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేస్తారు. ఈ సందర్భంగా రవికిశోర్‌ మాట్లాడుతూ.. ఐఐటీ బాంబేలో కంప్యూటర్స్‌ సైన్స్‌ చదివి పరిశోధనలు చేయడమే తన లక్ష్యమన్నారు.రోజుకు 16 గంటలు చదవడం, ప్రణాళికాబద్ధంగా సాధన చేయడంతో ఈ మార్కులు వచ్చాయని తెలిపారు. గోసాల శ్రీచైతన్యలో ఇంటర్‌ పూర్తిచేసి, జేఈఈ అడ్వాన్సుడుకు శిక్షణ తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని