CJI: ప్రపంచీకరణతో స్థానిక సంస్కృతులకు ముప్పు
‘‘2021 యునెస్కో ప్రపంచ భాషల నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరినాటికి ప్రస్తుతం మనం మాట్లాడుతున్న దాదాపు 7 వేల భాషలు అంతరించిపోనున్నాయి. మనం కోల్పోయే ప్రతి భాషతో కేవలం సాహిత్యం, జానపదాలనే కాదు..
చేతివృత్తులు, కళాకారుల మనుగడపై ప్రభావం
భాషలను కోల్పోవడమంటే తరాల విజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే
ఓయూ స్నాతకోత్సవంలో సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ
వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం
విద్యార్థులకు ప్రాథమిక న్యాయ సూత్రాలపై అవగాహన అవసరం. ప్రతి పౌరుడు రాజ్యాంగంతో అనుసంధానమై ఉండాలి. బ్రాంచీలతో సంబంధం లేకుండా విద్యార్థులు అందరికీ ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలు, పరిపాలనపై ఒక సబ్జెక్టును అన్ని విద్యాసంస్థలూ ప్రవేశపెట్టాలి. రాజ్యాంగంలోని ఆలోచనలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా చూడాలి. పౌరుల భాగస్వామ్యంతోనే రాజ్యాంగస్ఫూర్తి పరిఢవిల్లుతుంది.
ఆహారం, భాష, వస్త్రధారణ, ఆటలు, పండుగలు మన మూలాలతో ముడిపడినవి. సమాజంలో అందర్నీ ఏకతాటిపై నిలిపేవి. మూలాలను, కన్న ఊరును, సమాజాన్ని మరిచిపోకూడదు. సాహిత్యం, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.
- జస్టిస్ ఎన్.వి. రమణ
ఈనాడు, హైదరాబాద్: ‘‘2021 యునెస్కో ప్రపంచ భాషల నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరినాటికి ప్రస్తుతం మనం మాట్లాడుతున్న దాదాపు 7 వేల భాషలు అంతరించిపోనున్నాయి. మనం కోల్పోయే ప్రతి భాషతో కేవలం సాహిత్యం, జానపదాలనే కాదు.. తరతరాలుగా వచ్చిన విజ్ఞానాన్ని కోల్పోతాం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. శుక్రవారం జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ 82వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. న్యాయ వ్యవస్థలో విశేష కృషి చేసినందుకుగాను ఓయూ నుంచి ఆయనకు గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ లాస్) అందించారు. వర్సిటీ కులపతి, గవర్నర్ తమిళిసై ప్రదానం చేశారు. సుప్రీంకోర్టుకు ఆయన 48వ ప్రధాన న్యాయమూర్తి కాగా.. ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న 48వ వ్యక్తి అని ఓయూ ఉపకులపతి ప్రొ. డి.రవీందర్ వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ ప్రపంచీకరణ, శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధితో ప్రపంచ సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని, ఇది స్థానిక సంస్కృతులకు ముప్పుగా మారిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్కృతుల స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యత
ప్రపంచీకరణతో వివిధ రకాల పంటలు, వన్యప్రాణులు, కొన్నిరకాల జీవులు వేగంగా అంతరించిపోతున్నాయని జస్టిస్ ఎన్.వి. రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం సైతం వన్య ప్రాణులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటి కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని అందరం గుర్తుంచుకోవాలి. ప్రపంచీకరణ కారణంగా స్థానిక చేతివృత్తులు, కళాకారులపై ప్రభావం పడుతోంది. వివిధ రకాల డిజైన్లు, ఉత్పత్తులతో కూడిన గ్లోబల్ బ్రాండ్లు మన మార్కెట్లను వరదలా ముంచెత్తుతుండటంతో స్థానిక కళాకారులు తమ జీవనోపాధి కోల్పోతున్నారు. తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ మనుగడ కోసం పోరాడుతున్నారు. ప్రపంచీకరణను నేనేమీ విమర్శించడం లేదు. ప్రపంచీకరణతో మనం ఎన్నో చెప్పుకోదగ్గ విజయాలు సాధించినా.. వనరులు, ఆర్థిక అంశాలలో మన సమాజాలు విభజనకు గురయ్యాయి. వివిధ వర్గాల మధ్య పెరుగుతున్న అసమానతలను రూపుమాపేందుకు దృష్టి పెట్టాలి. అన్ని వర్గాలకు మేలు చేకూరేలా సమాన, సుస్థిరమైన ప్రపంచీకరణ విధానం అవసరం.
పీవీ, కేసీఆర్ వంటి ప్రముఖులెందరో ఓయూ నుంచి వచ్చినవారే
నిజాం హయాంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపనతో ఉన్నత విద్యలో కొత్త శకం ప్రారంభమైంది. ఉన్నత విద్యలో స్థానిక భాషలకు ప్రాధాన్యం పెరిగింది. వర్సిటీలో చదివిన పీవీ నరసింహారావు వంటి ప్రముఖులెందరో ప్రజా ప్రతినిధులుగా పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇక్కడే చదివారు. ఆధునిక భారతావని నిర్మాణంలో ఓయూ కీలకపాత్ర పోషించింది.
ఓయూలో చేరాలనుకున్నా..
నేను చదువుకునే రోజుల్లో ఉస్మానియా వర్సిటీలో చేరాలని ఆశయంగా పెట్టుకున్నా. విద్యార్థిగా చేరలేకపోయినా.. చాలా సందర్భాల్లో నా స్నేహితులలో కలిసి ‘ఇ’ హాస్టల్లో ఉన్నా. న్యాయశాస్త్రం, లింగ్విస్టిక్స్లో పలుమార్లు తరగతులకు హాజరయ్యా. ఇక్కడి క్యాంటీన్, గ్రంథాలయంలో గడిపిన క్షణాలు ఎన్నో గుర్తుకొస్తున్నాయి. గౌరవ డాక్టరేట్ అందుకోవడం సమాజంపై నా బాధ్యతను మరింత పెంచింది. రవీంద్రనాథ్ ఠాగూర్, సి.రాజగోపాలాచారి, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, ఎస్.రాధాకృష్ణన్, డా.బీఆర్ అంబేడ్కర్ సహా మరో 42 మంది ప్రముఖుల సరసన చేరడానికి నేను తగనేమో అనే భావన కలుగుతోంది. ఇది ఒక్కింత ఆందోళనకరంగానూ అనిపిస్తోంది’’ అని జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. విద్యార్థులు పట్టభద్రులు అయ్యారంటే తమ చదువులు ముగిసినట్లుగా భావించరాదని, ఇప్పుడే నేర్చుకోవడం మొదలైందనుకోవాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే అనుభవాల నుంచి ఎన్నో నేర్చుకుంటామని చెప్పారు. గవర్నర్ తమిళిసై స్వతహాగా డాక్టర్ కావడంతో విద్యాసంస్థల్లో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించగలరనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ ఎన్.వి. రమణ కుటుంబ సభ్యులు, ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. 31 మంది విద్యార్థులు బంగారు పతకాలు, 260 మంది పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు.
పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోండి
గవర్నరు తమిళి సై
‘‘అసాధ్యమైనా సరే లక్ష్యాలు పెద్దగా నిర్దేశించుకోండి... వాటిని సాధించడానికి పట్టువదలకుండా కష్టపడండి...విజయాలకు కృషి తప్ప అడ్డదారుల్లేవని గుర్తించండి’’ అని గవర్నరు తమిళి సై విద్యార్థులకు సూచించారు. ప్రతి చిన్న విషయానికీ కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నారు. ఉస్మానియా స్నాతకోత్సవం సందర్భంగా ఛాన్సలర్ హోదాలో గవర్నరు తమిళిసై విద్యార్థులనుద్దేశించి ఆద్యంతం ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. సవాళ్లు ఎదురైనపుడు కుంగిపోకుండా ఎదుర్కోవాలని ఎదిగిన నేతలను చూసి వారి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఉద్బోధించారు. కార్యక్రమాన్ని సాయంత్రానికి వాయిదా వేయాలని జస్టిస్ ఎన్.వి.రమణ కోరడంతో తాను వరలక్ష్మి వ్రతం చేసుకోగలిగానని చెప్పారు. ‘‘అత్యున్నత స్థాయికి వెళ్లిన జస్టిస్ ఎన్.వి.రమణ.. కార్యక్రమం వాయిదా గురించి అడిగిన తీరు ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి సాయంత్రం వస్తానని చెప్పవచ్చు. అలాకాకుండా సాయంత్రానికి మీకు వీలవుతుందా అని అడిగారు’’ అని ఆమె తెలిపారు. నేను తమిళిసైనే కాని ఇప్పుడు తెలుగుసైని అన్నారు. దేశమంటే మట్టికాదోయ్...దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగాన్ని ముగించారు.
జస్టిస్ రమణ వల్లే హైకోర్టులో మహిళా న్యాయమూర్తులకు ప్రాధాన్యం: జస్టిస్ ఎన్.వి.రమణ కారణంగా హైకోర్టులో ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తుల నియామకం జరిగిందంటూ హైకోర్టు మహిళా న్యాయమూర్తులు గవర్నరు తమిళిసై కి తెలిపారు. స్నాతకోత్సవం తరువాత గవర్నరు.. జస్టిస్ రమణ దంపతులు, కుటుంబ సభ్యులతోపాటు హైకోర్టు న్యాయమూర్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు ఈ వాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. -
సుజనాచౌదరి రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతి
భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ-హైదరాబాద్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు