Ap HighCourt: ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్ చెల్లదు
ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏకవాక్యంలో మూడుసార్లు నోటిమాటగా తలాక్ చెప్పడానికి వీల్లేనప్పుడు.. దాన్ని తలాక్నామా రూపంలో రాసుకున్నా కూడా చెల్లదని హైకోర్టు
తలాక్నామా రాసుకున్నా చెల్లుబాటు కాదు
భర్త నుంచి భరణం పొందేందుకు పిటిషనర్ అర్హురాలే
హైకోర్టు కీలక తీర్పు
ఈనాడు, అమరావతి: ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏకవాక్యంలో మూడుసార్లు నోటిమాటగా తలాక్ చెప్పడానికి వీల్లేనప్పుడు.. దాన్ని తలాక్నామా రూపంలో రాసుకున్నా కూడా చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. అలాంటి తలాక్నామాతో వివాహం రద్దయినట్లు కాదని స్పష్టం చేసింది. ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఇద్దరి తరఫున మధ్యవర్తులు సయోధ్య కుదిర్చేందుకు యత్నించాలంది. అది సాధ్యపడనప్పుడు సహేతుకమైన కారణాలతో వేర్వేరు సమయాల్లో మూడు తలాక్లు చెప్పాల్సి ఉంటుందని, ఆ మూడు సందర్భాల్లో అవసరమైన సమయం (టైమ్ గ్యాప్) ఉండాలని స్పష్టం చేసింది. తలాక్ చెప్పిన విషయాన్ని భర్త... భార్యకు తెలియపరచాలంది. ఒకేసారి మూడు తలాక్లు చెప్పి వివాహం రద్దయిందనడం రాజ్యాంగ విరుద్ధమని ‘షయారా బానో’ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో తలాక్నామాను రిజిస్టర్ పోస్టు ద్వారా పంపగా భార్య తిరస్కరించారని భర్త చెప్పడం తప్ప.. మరే ఇతర సాక్ష్యాలను చూపలేదని పేర్కొంది. ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్ చెప్పి.. రాతపూర్వకంగా పంపడం చెల్లదని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె భార్యగానే కొనసాగుతున్నట్లని, భర్త నుంచి వేరుగా ఉంటున్నందున భరణం పొందేందుకు అర్హురాలేనని స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ సైతం సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం.. ఆమె జీవితాంతం (మళ్లీ వివాహం చేసుకోనంత వరకు) భర్త నుంచి జీవన భృతి/భరణం పొందేందుకు అర్హురాలేనని పేర్కొంది. సముచిత జీవన భృతిని మంజూరు చేస్తే ఆమె హుందాగా జీవించగలుగుతారని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.
ఇదీ నేపథ్యం
భర్త నుంచి జీవనభృతిగా రూ.2 వేలు ఇప్పించాలంటూ పి.గౌస్బీ 2004లో పొన్నూరులో కోర్టును ఆశ్రయించారు. 2002 జులై 30న రిజిస్టర్ పోస్టు ద్వారా తలాక్నామా పంపించానని, గౌస్బీ దాన్ని తిరస్కరించినందున జీవనభృతికి అనర్హురాలంటూ ఆమె భర్త జాన్ సైదా కోర్టుకు విన్నవించారు. ఆ వాదనలను తోసిపుచ్చిన పొన్నూరు జ్యుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ కోర్టు.. పిటిషనర్కు, ఆమె కుమారుడికి నెలకు రూ.800 చొప్పున భరణం చెల్లించాలని ఆదేశించింది. దానిపై జాన్ సైదా గుంటూరులోని మొదటి అదనపు సెషన్స్ కోర్టులో అప్పీలు చేశారు. గుంటూరు కోర్టు కుమారుడికి జీవనభృతి ఖర్చులను సమర్థించింది. భార్యకు భృతి ఇవ్వాలన్న ఆదేశాలను రద్దు చేసింది. దీనిపై 2006 అక్టోబర్లో గౌస్బీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఇస్లాం చట్టప్రకారం ఒకే సందర్భంలో ఒకేవాక్యంగా మూడుసార్లు తలాక్ చెప్పి వివాహం రద్దు చేసుకోవడం చెల్లదన్నారు. తలాక్ చెప్పడానికి సహేతుకమైన కారణం ఉండాలన్నారు. వేర్వేరు సందర్భాల్లో మూడుసార్లు తలాక్ చెప్పారనడానికి రాతపూర్వక సాక్ష్యాధారాలుండాలన్నారు. పోస్టు ద్వారా పంపిన తలాక్నామా తనకు అందనేలేదని, దాన్ని తిరస్కరించలేదని భార్య చెబుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో తలాక్ చెల్లదన్నారు. గుంటూరు కోర్టు తీర్పును రద్దు చేస్తూ.. పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. ఆ తీర్పిచ్చి 16 ఏళ్లవుతున్న నేపథ్యంలో న్యాయస్థానాన్ని తాజాగా ఆశ్రయించి జీవనభృతిని పెంచాలని కోరే స్వేచ్ఛను భార్యకే వదిలేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ