VoterList: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రారంభం

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-2023 ప్రక్రియను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రారంభించింది. అక్టోబరు 24వరకు ఇప్పుడున్న జాబితాను పరిశీలించి మరణించిన ఓటర్లు, డబుల్‌ ఎంట్రీలు,

Updated : 06 Aug 2022 04:26 IST

ఈనాడు, అమరావతి: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-2023 ప్రక్రియను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రారంభించింది. అక్టోబరు 24వరకు ఇప్పుడున్న జాబితాను పరిశీలించి మరణించిన ఓటర్లు, డబుల్‌ ఎంట్రీలు, ఫొటోల పరిశీలన, వలస కుటుంబాల వివరాల నమోదు, పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ చర్యలు చేపట్టనుంది. నవంబరు 9న ముసాయిదా జాబితా విడుదల చేసి, డిసెంబరు 8వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. నవంబరు 19, 20, డిసెంబరు 3, 4 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తారు. బూత్‌ స్థాయి సిబ్బంది, రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్‌ ఏజెంట్లు ఆ తేదీల్లో కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. ముసాయిదా జాబితాలో తప్పులుంటే.. సరిదిద్దుతారు. డిసెంబర్‌ 26 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరిస్తారు. 2023 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా శుక్రవారం ఈ ప్రకటన జారీచేశారు. 2023 జనవరి ఒకటి నాటికి 18ఏళ్లు నిండేవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని