Andhra news: జీతాలు ఇప్పించినందుకు అక్రమ వసూళ్లు
ప్రొబేషన్ ఖరారయ్యాక పెరిగిన మొదటి జీతం అందుకున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అవినీతి బెడద తప్పట్లేదు. బిల్లుల తయారీ నుంచి.. అధికారుల ఆమోదం పొంది
సచివాలయాల ఉద్యోగులకు తప్పని అవినీతి బెడద
ఈనాడు, అమరావతి: ప్రొబేషన్ ఖరారయ్యాక పెరిగిన మొదటి జీతం అందుకున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అవినీతి బెడద తప్పట్లేదు. బిల్లుల తయారీ నుంచి.. అధికారుల ఆమోదం పొంది బ్యాంకు ఖాతాల్లో జీతాలు పడేవరకూ వివిధ దశల్లో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.500-1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఒక సచివాలయం ఉద్యోగుల నుంచి రూ.750 చొప్పున క్షేత్రస్థాయి ఉద్యోగి ఒకరు జమ చేయించుకున్నారు. ఏమైందో గానీ సాయంత్రం మళ్లీ డబ్బులు వెనక్కి పంపారు. పల్నాడు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో వసూళ్లపర్వం కొనసాగింది. 8నెలల ఆలస్యంగా ప్రొబేషన్ ఖరారు చేయడంతో ఇప్పటికే నష్టపోయామని ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. పెరిగిన జీతం చేతికి అందిందో లేదో అప్పుడే మా సంగతేమిటని ఖజానా శాఖ ఉద్యోగుల నుంచి మండల పరిషత్ కార్యాలయాల ఉద్యోగుల వరకు వెంటాడుతుండటంతో సచివాలయాల ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
బిల్లులు పెట్టినప్పటి నుంచే..
ప్రొబేషన్ ఖరారైన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల జులై నెల జీతాల బిల్లులు అప్లోడ్ చేసినప్పటి నుంచే వసూళ్ల పర్వం మొదలైంది. అనేక జిల్లాల్లో ఖజానా శాఖ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు జీతాల ప్రక్రియ పూర్తిచేసేందుకు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.500 వరకు వసూలు చేశారు. కొన్ని జిల్లాల్లో జీతాలు చేతికొచ్చాక ఇస్తామని ఉద్యోగులు హామీ ఇచ్చారు. బ్యాంకుఖాతాల్లో జీతాలు జమవ్వడంతో ఇప్పుడు వసూళ్లు ప్రారంభించారు. మండలపరిషత్ కార్యాలయాల్లోనూ కొందరు ఉద్యోగులు గ్రామ సచివాలయాల ఉద్యోగుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొందరైతే... ‘ప్రొబేషన్ ఖరారై జీతాలు పెరిగాయి కదా.. మమ్మల్ని మరచిపోతే తర్వాత ఇబ్బందులుంటాయి’ అంటూ సున్నితంగా హెచ్చరించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
అక్రమ వసూళ్లపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తున్నారు. రూ.500-రూ.1,000 చొప్పున వసూలుచేస్తే పెరిగిన ఖర్చులతో ఎలా బతకాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగి ఒకరు జిల్లా ఉన్నతాధికారికి వాట్సాప్ మెసేజ్ పెట్టారని తెలిసింది. అడిగిన డబ్బులివ్వకపోతే మీకే నష్టమని మండలపరిషత్ కార్యాలయ పర్యవేక్షకుడు బెదిరిస్తున్నారని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు గ్రామ సచివాలయాల ఉద్యోగులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సచివాలయాల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని సచివాలయాల ఉద్యోగ సంఘం నాయకుడొకరు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM