PM Modi: ఆ మూడింటితో స్వావలంబన
ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ (సాంకేతికత) అనే మూడు ‘టి’లను ప్రోత్సహించడంపై రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దిగుమతులను తగ్గించుకుని, ఎగుమతులను పెంచేందుకు ఇది
వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికతలపై రాష్ట్రాలు దృష్టి సారించాలి
ఆధునికీకరణ ద్వారా వ్యవసాయంలో స్వయం సమృద్ధి
పట్టణీకరణ.. బలహీనత కాదు బలమే
ఈ భేటీలో నాటిన విత్తనాలు 2047లో భారత్ అందుకునే ఫలాలు
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన
ఈనాడు, దిల్లీ: ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ (సాంకేతికత) అనే మూడు ‘టి’లను ప్రోత్సహించడంపై రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దిగుమతులను తగ్గించుకుని, ఎగుమతులను పెంచేందుకు ఇది అవసరమని చెప్పారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి ఏడో సమావేశంలో ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సాంకేతికతను వినియోగించుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడం ద్వారా స్వయంసమృద్ధి సాధించి, ప్రపంచానికి నేతగా మన దేశం అవతరించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంతో పాటు పశు సంవర్ధక, ఆహారశుద్ధి పరిశ్రమ రంగాలనూ ఆధునికీకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీలైన చోట్ల స్థానిక వస్తువులనే వాడాలని, ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం కేవలం ఒక రాజకీయ పార్టీది కాదని, అది అందరి ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. శీఘ్రగతిన సాగుతున్న పట్టణీకరణను బలహీనతగా కాకుండా మన దేశ బలంగా మలచుకోవాలని చెప్పారు.
‘‘ఈ సమావేశంలో చర్చించిన అంశాలు వచ్చే 25 ఏళ్లకు దేశ ప్రాధాన్యాలను నిర్దేశిస్తాయి. ఈరోజు నాటే విత్తనాలు 2047లో భారత్ అందుకొనే ఫలాలను నిర్వచిస్తాయి’’ అని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాతే జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని, అమలుకు స్పష్టమైన సమయంతో మార్గసూచీ తయారు చేయాలని సూచించారు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే కొవిడ్ మహమ్మారి నుంచి మన దేశం బయటపడగలిగిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు భారత్ను ‘ప్రపంచ నేత’గా చూసే పరిస్థితి వచ్చిందన్నారు.
జి-20 కోసం ప్రత్యేక బృందాలు
2023లో జి-20 సదస్సుకు మన దేశం నాయకత్వం వహించబోతున్న విషయాన్ని ప్రధాని ఈ సమావేశంలో ప్రస్తావించారు. భారత్ అంటే దిల్లీ ఒక్కటే కాదు.. విభిన్న రాష్ట్రాల సమాహారం అని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదో అరుదైన అవకాశమని పేర్కొన్నారు. జి-20 చుట్టూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని, దేశంలో అత్యుత్తమ ప్రతిభావంతులను గుర్తించడానికి దీన్నో అవకాశంగా మలుచుకోవాలని కోరారు. గరిష్ఠస్థాయిలో ప్రయోజనం పొందేందుకు ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా జి-20 బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమ ప్రాధాన్యాలు, సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రత్యక్షంగా జరిగిన ఈ తొలి సమావేశానికి 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ముఖ్యమంత్రులు- కేసీఆర్, ఎంకే స్టాలిన్, నీతీశ్కుమార్, అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాలేదు. పప్పుధాన్యాలు, నూనెగింజల విషయంలో కనీస మద్దతు ధర విధానాన్ని మరింత ప్రభావవంతంగా మలచాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. నిర్ణయాలను తమపై బలవంతంగా రుద్దవద్దని భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల సీఎంలు విజ్ఞప్తి చేశారు.
నిజాయతీ గల మధ్యవర్తిలా పనిచేస్తాం: నీతి ఆయోగ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి నీతి ఆయోగ్ నిజాయతీ గల మధ్యవర్తిలా పనిచేస్తుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్బేరి, సీఈఓ పరమేశ్వరన్, సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో నీతి ఆయోగ్ అంబుడ్స్మన్లా వ్యవహరించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేసిన డిమాండ్ గురించి విలేకర్లు అడిగినప్పుడు వారు ఈ విధంగా స్పందించారు. ‘‘నీతి ఆయోగ్ ముఖ్య ఉద్దేశం సహకారపూర్వక, పోటీతత్వ సమాఖ్య వ్యవస్థను ప్రోత్సహించడమే. నీతి ఆయోగ్ను రాష్ట్రాలు తమ స్నేహితుడిగా చూస్తున్నాయని భావిస్తున్నాం. మేం వారధిలా పనిచేస్తాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM