తపాలా కార్యాలయాల్లో జాతీయ పతాకాలు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రాష్ట్రంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో జాతీయ పతాకాలను అందుబాటులో

Published : 08 Aug 2022 05:12 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రాష్ట్రంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో జాతీయ పతాకాలను అందుబాటులో ఉంచినట్లు తపాలా సేవల డైరెక్టర్‌ ఆదిత్య కుమార్‌ నాయక్‌ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆగస్టు 15 వరకు ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కావాల్సిన వారు WWW.epostoffice.gov.in వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ ఇస్తే జాతీయ పతాకాన్ని ఇంటి వద్దకే తీసుకొచ్చి అందించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని