Mahatma Gandhi: మహాత్ముడి తలపు.. చెట్టుతో మేలుకొలుపు!

మహాత్మాగాంధీ నాటిన మొక్క.. వృక్షమై నేడు శాంతి పరిమళాలను పంచుతోంది! స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గాంధీ తపించిన తీరుకు నిదర్శనమై నిలుస్తోంది. అలనాడు

Updated : 08 Aug 2022 05:59 IST

మహాత్మాగాంధీ నాటిన మొక్క.. వృక్షమై నేడు శాంతి పరిమళాలను పంచుతోంది! స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గాంధీ తపించిన తీరుకు నిదర్శనమై నిలుస్తోంది. అలనాడు ఉద్యమ స్ఫూర్తిని పంచిన ఆ మొక్క నేడు ఏలూరులో జ్ఞాపకాల సౌరభాలు వీస్తోంది. మహాత్మాగాంధీ దంపతులు 1921 ఏప్రిల్‌ 3న ఏలూరుకు వచ్చారు. స్థానిక అగ్రహారం ప్రాంతంలో ఆంధ్ర జాతీయ మహా విద్యాలయాన్ని ప్రారంభించారు. ఆవరణలో ఓ మేడి మొక్క నాటారు. కస్తూర్బాగాంధీతో కలిసి మార్కండేయ స్వామి గుడిలో కొంతమంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ‘ఇప్పుడు ఈ చెట్టును చూసిన ప్రతి ఒక్కరూ అప్పట్లో ఉన్న పరిస్థితులను, పెద్దల త్యాగాలనూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు’ అని దేవాదాయశాఖ ఈవో ఆండ్ర రవిశంకర్‌ తెలిపారు.

- ఈనాడు, ఏలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని