Venkaiah naidu: స్ఫూర్తిప్రదాత వెంకయ్య
నేను ఎప్పుడూ రాష్ట్రపతి పదవిని కోరుకోలేదు. అసమ్మతి గళం లేవనెత్తబోను. రాజకీయాల్లో కొనసాగను. కానీ ప్రజలతో మాట్లాడుతుంటా. వారితో మమేకమవుతుంటా. విశ్రాంతి తీసుకుంటే నాకు అలసట పెరుగుతుంది.
రాజ్యసభ నిర్వహణలో నూతన ప్రమాణాలు నెలకొల్పారు
ఉప రాష్ట్రపతిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం
వెంకయ్యనాయుడుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అగ్రనేతలు
వీడ్కోలు కార్యక్రమాల్లో ఉప రాష్ట్రపతి భావోద్వేగం
నేను ఎప్పుడూ రాష్ట్రపతి పదవిని కోరుకోలేదు. అసమ్మతి గళం లేవనెత్తబోను. రాజకీయాల్లో కొనసాగను. కానీ ప్రజలతో మాట్లాడుతుంటా. వారితో మమేకమవుతుంటా. విశ్రాంతి తీసుకుంటే నాకు అలసట పెరుగుతుంది.
-వెంకయ్యనాయుడు
ఈనాడు, దిల్లీ: అయిదేళ్లుగా ఉప రాష్ట్రపతి పీఠంపై కొనసాగుతూ దేశానికి వెంకయ్యనాయుడు చేసిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు అగ్ర నేతలు వేనోళ్ల పొగిడారు. రాజ్యసభకు ఆయన నేతృత్వం వహించిన తీరుకు జేజేలు పలికారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి ఉప రాష్ట్రపతి దాకా ఆయన ఎదిగిన తీరు భావితరాలకు స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపించారు. అకుంఠిత దీక్షాదక్షతలతో.. పనిచేసిన ప్రతిచోటా ఆయన తనదైన ముద్ర వేశారంటూ కితాబిచ్చారు. వెంకయ్యనాయుడి నిబద్ధత, సమయపాలన, వాక్చాతుర్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఈ నెల 10న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం రాజ్యసభలో, స్థానిక జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో సోమవారం ప్రత్యేకంగా వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు అందులో పాల్గొని ప్రసంగించారు. తనపై నేతల ప్రశంసల వర్షానికి కృతజ్ఞతలు తెలిపిన వెంకయ్యనాయుడు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కీలక సూచనలు చేశారు. జాతి నిర్మాతలు నిర్దేశించిన ప్రమాణాలకు కట్టుబడి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. తనకు ఏడాది వయసున్నప్పుడే తన తల్లి మరణించిన సంగతి ప్రస్తావనకు వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు కన్నీటిపర్యంతమవడం సభికులను భావోద్వేగానికి గురిచేసింది.
భుజం భుజం కలిపి పనిచేశా
‘‘వెంకయ్యనాయుడు తన ప్రతిభాపాటవాలతో రాజ్యసభ నిర్వహణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఇకపై ఆ పదవిలోకి వచ్చేవారు వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాల్సి ఉంటుంది. అభివ్యక్తీకరణ కళలో వెంకయ్యనాయుడికి ఉన్న ప్రావీణ్యం గురించి పార్లమెంటు లోపల, బయట అందరికీ తెలుసు. ఆయన మాటల్లో లోతు, గంభీరత, చతురత, విజ్ఞానం.. అన్నీ ఉంటాయి. వెంకయ్యనాయుడిని విభిన్న పాత్రల్లో చాలా దగ్గరి నుంచి చూసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనతో భుజం భుజం కలిపి పనిచేశాను కూడా. పార్టీ కార్యకర్తగా ఆయన చూపిన నిబద్ధత, శాసనసభ్యుడిగా పనితీరు, పార్లమెంటు సభ్యుడిగా సభలో ప్రదర్శించిన క్రియాశీలత, భాజపా అధ్యక్షుడిగా ప్రదర్శించిన నాయకత్వ కౌశలం, మంత్రి రూపంలో పడ్డ శ్రమ, నవకల్పనల కోసం తపించిన తీరు.. ఇవన్నీ దేశానికి ఎంతో మేలు చేశాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి
‘‘ఎన్ని విభేదాలు, వైరుద్ధ్యాలు ఉన్నా మనమంతా భారతీయులం. ప్రజాస్వామ్యంలో మనకు ఓర్పు ఉండాలి. ఎదుటివారి అభిప్రాయాన్ని ఆలకించాలి. ప్రజాతీర్పును సహించే ఓపిక ఉండాలి. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నా.. ప్రతిపక్షానికి చెప్పే అవకాశం ఇవ్వాలి. నన్ను ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేశామని ఐదేళ్ల కిందట ప్రధాని ప్రకటించినప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ పదవిని నేను అడగలేదు. పార్టీ అప్పగించిన బాధ్యతలను శిరసావహిస్తూ భాజపాకు రాజీనామా చేశాను. నాకు ఇంతటిస్థాయి ఇచ్చిన పార్టీకి రాజీనామా చేయాల్సి రావడం కన్నీళ్లు తెప్పించింది. ఒకప్పుడు జట్కాలో ఊరంతా తిరుగుతూ.. వాజ్పేయీ సమావేశాల గురించి మైక్లో ప్రచారం చేసేవాణ్ని. పోస్టర్లు అతికించేవాడిని. అలాంటి నేను భాజపా అధ్యక్షుడినై వాజ్పేయీ, ఆడ్వాణీల మధ్య కూర్చుంటానని కలగనలేదు’’ అని వెంకయ్య నాయుడు చెప్పారు.
ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత
‘వెతికితే ఎవరో ఒకరు దొరుకుతారేమోకానీ వెంకయ్యనాయుడి లాంటివారు దొరకరు! ఆయన పదవీ విరమణ తర్వాత రాజ్యసభలో వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. ఇకపై కూడా వెంకయ్యనాయుడు ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటారని భావిస్తున్నాను. ప్రజాస్వామ్యం, సమానత్వం, రాజ్యాంగ మూల సిద్ధాంతాలపై యువతకు ఆయన మార్గదర్శనం చేస్తూనే ఉండాలి’.
జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
‘జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి వచ్చినప్పటికీ.. వెంకయ్యనాయుడు రాజ్యసభ ఛైర్మన్గా తీసుకొనే నిర్ణయాలపై ఆ ప్రభావం పడనివ్వలేదు. ఆయన నిర్ణయాలు అర్థంకాక అధికార పార్టీ సభ్యులు మా వద్దకు వచ్చి అడిగిన సందర్భాలున్నాయి. దాన్ని బట్టి ఆయన అందర్నీ ఒకేలాచూశారని అర్థమవుతోంది’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్