JEE: జేఈఈ మెయిన్లో తెలుగు బావుటా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. దేశవ్యాప్తంగా రెండు విడతల పరీక్షల్లో 24 మంది 100 పర్సంటైల్ సాధించగా.. అందులో అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి అయిదుగురు చొప్పున 10 మంది
దేశవ్యాప్తంగా 24 మందికి 100 పర్సంటైల్
ఇందులో అత్యధికంగా తెలంగాణ, ఏపీల నుంచి అయిదుగురు చొప్పున..
తొలి 10 ర్యాంకుల్లోనూ 6, 25లో 12 మంది మనోళ్లే
ఈనాడు, హైదరాబాద్, అమరావతి: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. దేశవ్యాప్తంగా రెండు విడతల పరీక్షల్లో 24 మంది 100 పర్సంటైల్ సాధించగా.. అందులో అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి అయిదుగురు చొప్పున 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి నలుగురు, ఉత్తర్ప్రదేశ్ నుంచి ఇద్దరు ఉన్నారు. మిగతా 8 మంది ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఉండడం గమనార్హం. జేఈఈ మెయిన్ మొదటి, చివరి విడతలో వచ్చిన ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) ఆదివారం తెల్లవారుజామున ఫలితాలు ప్రకటించింది. ర్యాంకులను వెబ్సైట్లో వెల్లడించలేదు. విద్యార్థులకు మాత్రమే పంపింది. దీనిప్రకారం తెలంగాణకు చెందిన ధీరజ్ కురుకుండ నాలుగో ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత పెనికలపాటి రవికిశోర్ 6, హిమవంశీ 7, అనికేత్ ఛటోపాధ్యాయ 8, పల్లి జలజాక్షి 9 ర్యాంకులు సాధించారు. కర్ణాటకలో ఇంటర్ చదివిన హిందూపురం విద్యార్థి బోయ హరేన్ సాత్విక్ 10వ ర్యాంకు సాధించాడు. మొత్తంగా తొలి 10 ర్యాంకుల్లో ఆరు, 25లో 12 ర్యాంకుల్ని మన వారే కైవసం చేసుకున్నారు. మెయిన్లో కటాఫ్ స్కోర్ సాధించిన 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధిస్తారు. అడ్వాన్స్డ్కు దరఖాస్తు సమర్పణ ప్రక్రియ సోమవారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభించినట్లు ఐఐటీ బాంబే తెలిపింది. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 28న అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి కేటగిరీల వారీగా అగ్రగణ్యులు
బాలికలు: పల్లి జలజాక్షి (ఏపీ), చందా మౌమిత (తెలంగాణ)
జనరల్ ఈడబ్ల్యూఎస్: పొలిశెట్టి కార్తికేయ (ఏపీ), భోగి సిరి (ఏపీ)
ఓబీసీ: పల్లి జలజాక్షి, హిమవంశీ, కొయ్యన సుహాస్.. ఈ ముగ్గురూ ఏపీ వారే.
ఎస్సీ: దయ్యాల జాన్ జోసెఫ్ (ఏపీ), నూతక్కి రిత్విక్ (ఏపీ), కాకర జశ్వంత్ (తెలంగాణ)
ఎస్టీ: చరణ్సింగ్నాయక్ (ఏపీ), మాలోత్ విశాల్నాయక్ (తెలంగాణ)
దివ్యాంగులు: గైకోటి విఘ్నేష్ (తెలంగాణ), మందల రాహుల్ (తెలంగాణ)
ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా
- ధీరజ్ కురుకుండ, 4వ ర్యాంక్, హైదరాబాద్
జేఈఈ మెయిన్లో 100 పర్సంటైల్ రావడంతో ఉత్తమ ర్యాంకు దక్కుతుందని ఊహించా. నా దృష్టంతా జేఈఈ అడ్వాన్స్డ్లో టాప్ ర్యాంకుపైనే. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతా. మా సొంతూరు కర్నూలు జిల్లా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాం. నా చదువు కోసం ఇక్కడే స్థిరపడ్డాం. అమ్మ గృహిణి.
ఐఏఎస్ కావడమే లక్ష్యం
- గైకోటి విఘ్నేష్, దివ్యాంగుల కోటాలో తెలంగాణ టాపర్
మాది హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదళ్ల. ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. తల్లిదండ్రులు గైకోటి రవి, రజిత విఘ్నేష్. మాది వ్యవసాయాధారిత కుటుంబం.
- న్యూస్టుడే, దామెర
సత్తాచాటిన గిరిజన విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్: ‘‘గిరిజన సంక్షేమ గురుకులాల నుంచి జేఈఈ మెయిన్లో 20 మంది విద్యార్థులకు 90 పర్సంటైల్ కన్నా ఎక్కువ వచ్చింది. సొసైటీ నుంచి 542 మంది పరీక్ష రాయగా, 467 మంది అర్హత సాధించారు. గిరిజన, ఏకలవ్య సొసైటీ నుంచి ఈ ఏడాదికి కనీసం 150 మందికిపైగా విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందే అవకాశముంది’’ అని గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్ తెలిపారు.
* జేఈఈ మెయిన్లో బీసీ గురుకులాలకు చెందిన 20 మంది విద్యార్థులు అర్హత సాధించారని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు తెలిపారు.
రోజూ 12 గంటలు కృషి
- పి.రవికిశోర్, 6వ ర్యాంకు
రోజూ 12 గంటలు చదివా. ఆరో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ చదువుతా. మాది గుంటూరు. తండ్రి ఆదినారాయణ లైబ్రేరియన్. తల్లి నందకుమారి స్టాప్నర్సు.
పట్టుదలతో చదివా
- ఎం.హిమవంశీ, ఓపెన్ కేటగిరిలో 7, ఓబీసీలో మొదటి ర్యాంక్
జేఈఈ మెయిన్లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివా. మాది శ్రీకాకుళం. నాన్న రవిశంకర్, తల్లి స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ఉపాధ్యాయులే. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని ఉంది.
సివిల్స్పై గురి
- పి.జలజాక్షి, 9వ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లా
మాది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకారపల్లి గ్రామం. నాన్న గోవిందరావు ఉపాధ్యాయుడు, తల్లి జయలక్ష్మి గృహిణి. ఐఐటీ ముంబయిలో బీటెక్ చదివి, సివిల్స్ చేయాలనేది లక్ష్యం.
జేఈఈ అడ్వాన్స్డ్ కోసం సిద్ధమవుతున్నా
- హరేన్ సాత్విక్, 10వ ర్యాంక్, కర్ణాటక (సొంతూరు హిందూపురం)
మాది శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం. అడ్వాన్స్డ్లో టాప్ ర్యాంకు సాధించి దేశంలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన కళాశాలలో ఐఐటీ కంప్యూటర్ సైన్స్ చదువుతా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ