సంక్షిప్త వార్తలు (5)
ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థుల మాల్ప్రాక్టీస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా పదుల సంఖ్యలో విద్యార్థులు చూచిరాతలకు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో
ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీలో 150మంది డిబార్
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థుల మాల్ప్రాక్టీస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా పదుల సంఖ్యలో విద్యార్థులు చూచిరాతలకు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో పరీక్షలు ప్రారంభమైన ఈనెల 3నుంచి ఇప్పటివరకు 291 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. సోమవారం జరిగిన పరీక్షల్లో 150 మంది విద్యార్థులను డిబార్ చేశారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 72 మంది, రెండో ఏడాదికి సంబంధించి 78 మంది మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డారు.
అమృత్ కింద ఏపీలో 226 ప్రాజెక్టుల నిర్మాణం
ఈనాడు, దిల్లీ: అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రూ.3,334 కోట్ల విలువైన 226 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. రూ.740 కోట్ల విలువైన 101 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు జరుగుతున్నాయి: రైల్వే మంత్రి
ఈనాడు, దిల్లీ : దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే డీపీఆర్ పూర్తయిందని, భవన నిర్మాణానికి భూమిని కూడా గుర్తించినట్లు చెప్పారు. సోమవారం రాజ్యసభలో గతిశక్తి యూనివర్సిటీపై చర్చ సందర్భంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ పీఎం గతిశక్తి విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరారు.
జేఈఈ మెయిన్లో.. శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు సత్తాచాటారని ఆ విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. అఖిల భారత స్థాయిలో ఓపెన్ కేటగిరీలో మొదటి పదిలోపు 4 ర్యాంకులు, 100లోపు 22, వెయ్యిలోపు 128 ర్యాంకులు వచ్చాయని హర్షం వ్యక్తంచేశారు. అన్ని కేటగిరీల్లో కలిపి వెయ్యిలోపు 601 ర్యాంకులు పొందినట్లు పేర్కొన్నారు.
సత్తాచాటిన నారాయణ విద్యార్థులు
జేఈఈ మెయిన్-2022 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. ఓపెన్ కేటగిరీలో తొలి 10లోపు 3, వందలోపు 19 ర్యాంకులు.. అన్ని కేటగిరీల్లో కలిపి వెయ్యిలోపు 571 ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు.
డా.కేకేఆర్ గౌతమ్ మెరుపులు
జేఈఈ మెయిన్ ఫలితాల్లో డా.కేకేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఓపెన్ కేటగిరీలో 100లోపు 4, అన్ని కేటగిరీల్లో కలిపి 100లోపు 23 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు.
ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ విజయం
జేఈఈ మెయిన్-2022 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని సంస్థ ఛైర్మన్ ఎ.వరదారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. అన్ని కేటగిరీల్లో కలిపి జాతీయ స్థాయిలో 3, 18, 21, 29, 52, 158, 173, 186, 188, 219, 240, 284, 287, 290, 309 వంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు.
భాష్యం విద్యార్థులకు ర్యాంకులు
జేఈఈ మెయిన్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రతిభ కనబరిచారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వందలోపు 12 ర్యాంకులు, 500లోపు 40, వెయ్యిలోపు 59 ర్యాంకులు సాధించి సత్తాచాటారని పేర్కొన్నారు.
ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
ఈనాడు డిజిటల్, అమరావతి: జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో అంబేడ్కర్ గురుకులాల(ఎస్సీ) విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 166 మంది విద్యార్థులు హాజరుకాగా 142 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 50 మంది బాలికలు, 92 మంది బాలురున్నారు. చిన్నటేకూరు ఐఐటీ-మెడికల్ అకాడమీకి చెందిన నీలం మహేశ్వర్రెడ్డి 99.46 పర్సెంటైల్, ఇమ్మరాజు భాను హర్షవర్ధన్ 99.30 పర్సెంటైల్ సాధించినట్లు గురుకులాల కార్యదర్శి హర్షవర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
శశి వేలివెన్ను సత్తా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తమ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు మరోమారు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటినట్లు వేలివెన్ను శశి విద్యాసంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు. 20 మంది విద్యార్థులు 99 పర్సంటైల్పైన సాధించారని వెల్లడించారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో 500లోపు 5 ర్యాంకులు, 1000లోపు 14, 2000లోపు 30, 5000లోపు 69, 10,000లోపు 115 ర్యాంకులు పొందినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM