డివిజన్‌ మొత్తం విద్యుదీకరణ

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మొత్తం అన్ని లైన్ల విద్యుదీకరణ పూర్తిచేసుకున్న ఘనతను గుంతకల్లు డివిజన్‌ సాధించింది. ధర్మవరం-పాకాల సెక్షన్‌లోని తుమ్మనంగుట్ట-కలికిరి మధ్య 50 కి.మీ. విద్యుదీకరణ పనులు

Published : 09 Aug 2022 05:38 IST

ద.మ. రైల్వేలో గుంతకల్లు ఘనత

ఈనాడు-అమరావతి: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మొత్తం అన్ని లైన్ల విద్యుదీకరణ పూర్తిచేసుకున్న ఘనతను గుంతకల్లు డివిజన్‌ సాధించింది. ధర్మవరం-పాకాల సెక్షన్‌లోని తుమ్మనంగుట్ట-కలికిరి మధ్య 50 కి.మీ. విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో.. డివిజన్‌ మొత్తం పూర్తయినట్లయింది. ధర్మవరం-పాకాల సెక్షన్‌లో 228 కి.మీ. విద్యుదీకరణ పనులు 2017-18లో మంజూరయ్యాయి. రూ.253 కోట్లతో వీటిని చేపట్టారు. ఇందులో ధర్మవరం-కదిరి మధ్య 68 కి.మీ. పనులు గత ఏడాది మార్చికి పూర్తయ్యాయి. కదిరి-తుమ్మనంగుట్ట మధ్య 54 కి.మీ., కలికిరి-పాకాల మధ్య 56 కి.మీ. విద్యుదీకరణ ఈ ఏడాది మార్చికి పూర్తిచేశారు. మిగిలిన తుమ్మనంగుట్ట-కలికిరి మధ్య 50 కి.మీ. తాజాగా పూర్తిచేశారు. దీంతో ధర్మవరం-పాకాల సెక్షన్‌ మొత్తం విద్యుదీకరణ పనులు ముగిశాయి. ఆ సెక్షన్‌లో రైళ్ల సగటు వేగం పెరగనుంది. ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ సెక్షన్‌ విద్యుదీకరణ పూర్తికావడంపై దక్షిణ మధ్య రైల్వే ఇన్‌ఛార్జ్‌ జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అధికారులను అభినందించారు. వచ్చే ఏడాది చివరి నాటికి జోన్‌ అంతా విద్యుదీకరణ పూర్తి చేసేలా చూడాలని సూచించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని