పీఎఫ్‌ ఖాతాల్లోని డబ్బులు తీసుకోవడం దారుణం: టీఎన్‌యూఎస్‌

ఉద్యోగులు తమ పీఎఫ్‌ ఖాతాల్లో దాచుకున్న డబ్బును ప్రభుత్వం డ్రా చేయడం దారుణమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌యూఎస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం

Published : 09 Aug 2022 05:38 IST

ఈనాడు, అమరావతి: ఉద్యోగులు తమ పీఎఫ్‌ ఖాతాల్లో దాచుకున్న డబ్బును ప్రభుత్వం డ్రా చేయడం దారుణమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌యూఎస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సాంకేతిక సమస్యలని ఆర్థిక శాఖ అధికారులు చెబుతూ వచ్చారని, కేంద్రం లిఖిత పూర్వకంగా తెలపడంతో వాస్తవాలు బహిర్గతమయ్యాయని వెల్లడించారు. ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలోని డబ్బులను ప్రభుత్వాలు తీసుకోవడం దేశంలో ఎక్కడా లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని