ఆంధ్రాలో ఆదిమ మానవుని అడుగుజాడలు
ఆధునిక మానవులు (హోమో సెపియన్స్) ఆఫ్రికా నుంచి భారత్కి సుమారు 1.22 లక్షల సంవత్సరాల క్రితం వలస వచ్చారని, వారితోపాటు మధ్యపాతరాతియుగపు పనిముట్లు
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 2.47 లక్షల ఏళ్లనాటి రాతి పనిముట్లు లభ్యం
భారత్లో ఆధునిక మానవుని పరిణామక్రమంపై సిద్ధాంతాలు తారుమారు
ఈనాడు, అమరావతి: ఆధునిక మానవులు (హోమో సెపియన్స్) ఆఫ్రికా నుంచి భారత్కి సుమారు 1.22 లక్షల సంవత్సరాల క్రితం వలస వచ్చారని, వారితోపాటు మధ్యపాతరాతియుగపు పనిముట్లు తీసుకొచ్చారని ఇప్పటి వరకు పురావస్తు శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు తారుమారయ్యాయి. ఆ భావన తప్పని తాజా పరిశోధనలు రుజువు చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 2018లో దొరికిన రాతి పనిముట్లు ఏకంగా 2.47 లక్షల సంవత్సరాలనాటివని తేలింది. వడోదరలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ (ఎంఎస్యు) ఆర్కియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేవర అనిల్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంది. హºమోసెపియన్స్ కంటే 1.25 లక్షల సంవత్సరాలకుముందే ఈ ప్రాంతంలో నివసించిన ఆదిమ మానవులు ఆ పనిముట్లు తయారు చేసినట్టుగా తేలింది. ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పాలేటి ఒడ్డునగల హనుమంతునిపాడులో అనిల్కుమార్ తన పీహెచ్డీ ప్రాజెక్టులో భాగంగా 2018లో జరిపిన తవ్వకాల్లో మధ్యపాత రాతియుగం నాటి పనిముట్లు దొరికాయి. అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ (పీఆర్ఎల్)లోని ల్యుమినిసెన్స్ ప్రయోగశాలలో ‘సైంటిఫిక్ డేటింగ్’ పరీక్షల ద్వారా అవి 2.47 లక్షల సంవత్సరాలనాటివని నిర్ధారించారు. ఈ పరిశోధనలపై దేవర అనిల్కుమార్, ఆయన సహచరులు సమర్పించిన పత్రాల్ని ‘జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్’ ఇటీవల ప్రచురించడంతో ఈ విషయం ప్రపంచం దృష్టికి వచ్చింది. అనిల్కుమార్ ప్రకాశం జిల్లాకు చెందినవారు కావడం విశేషం.
ఇదో కొత్త చరిత్ర..!
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ముచ్చెట్ల, చింతమానిగవి, జ్వాలాపురాల్లోను, గుజరాత్లో కచ్ ప్రాంతంలోని సాంధవ్లోను, రాజస్థాన్లోని కతోటి, మధ్యప్రదేశ్లోని ధాబాల్లోను జరిపిన తవ్వకాల్లో దొరికిన రాతి పనిముట్ల ఆధారంగా ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి 1.22 లక్షల సంవత్సరాల క్రితం భారత్కు వలస వచ్చారన్న సిద్ధాంతాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు రూపొందించారు. మధ్యరాతి యుగపునాటి పనిముట్లను వారే తీసుకొచ్చారని సిద్ధాంతీకరించారు. ‘‘ప్రకాశం జిల్లాలో దొరికిన రాతి పనిముట్లు 2.47 లక్షల సంవత్సరాలనాటి హోమోఎరక్టస్ అనే తెగకు చెందిన ఆదిమానవులు వినియోగించినవి కావొచ్చు. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలన్నీ ఈ పరిశోధనతో తప్పని తేలింది. ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలందరి చూపు ఆంధ్రప్రదేశ్వైపే ఉంది. ఈ దిశగా మరిన్ని పరిశోధనలకు ఇది ఊతమిస్తుంది’’ అని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
పురావస్తు పరిశోధనలకు కొత్త దిశ
భారత్లో ఆధునిక మానవుల పరిణామ క్రమానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరిగేందుకు, కొత్త విషయాల్ని వెలుగులోకి తెచ్చేందుకు.... తమ పరిశోధన ఫలితాలు దోహదం చేస్తాయని అనిల్కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన పరిశోధన గురించి ఆయన ‘ఈనాడు’కి ఫోన్లో వివరించారు. ‘‘నేను ఆర్కియాలజీలో ఎంఏ చదవడానికి ఎంఎస్ యూనివర్సిటీకి వెళ్లాను. అక్కడే పీహెచ్డీ చేసి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు ప్రాంతాల్లో ఆధునిక మానవుడి ఆనవాళ్లపై పరిశోధన నా పీహెచ్డీ ప్రాజెక్టులో భాగం. అక్కడ జరిపిన తవ్వకాల్లో దొరికిన రాతి పనిముట్లకు సైంటిఫిక్ డేటింగ్ చేయిస్తే అవి 2.47 లక్షల సంవత్సరాలవని తేలింది. మన శాస్త్రవేత్తలు తవ్వకాల్లో దొరికిన పనిముట్లకు సైంటిఫిక్ డేటింగ్ చేయడం తక్కువ. అందుకే చాలా విషయాలు బయటకు రాలేదు. దాంతో పాశ్చాత్య పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలే ప్రచారంలో ఉన్నాయి. మేం చేసిన పరిశోధనల వల్ల మధ్యరాతియుగపు పనిముట్లు ఎక్కడి నుంచో ఇక్కడికి రాలేదని, వాటిని ఇక్కడే తయారు చేశారన్న విషయం బయటపడింది. వాటిని హోమోసెపియన్స్ కంటే చాలా పూర్వం అక్కడ నివసించిన ‘ఆర్కాయిక్ హోమినిన్స్’ మానవ జాతుల్లో ఎవరైనా వేట వంటి అవసరాల కోసం తయారు చేసుకుని ఉండొచ్చు. ఆ కాలంనాటి మానవుల శిలాజాలు లభ్యం కాకపోవడంతో, అప్పుడు అక్కడ నివసించిన మానవులు ఎవరు అన్న విషయాన్ని చెప్పలేం’’ అని అనిల్కుమార్ పేర్కొన్నారు. తన పరిశోధనలకు సహకరించిన నేషనల్ జియోగ్రఫికల్ సొసైటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.