విచారణ దశలో కేసుల ఉపసంహరణ కోరడం సరికాదు
వైకాపా ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై నూజివీడు పట్టణ ఠాణా, కె.రక్షణనిధిపై తిరువూరు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల ఉపసంహరణ విషయంలో బుధవారం
రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు
ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణకు లేఖ రాసిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: వైకాపా ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై నూజివీడు పట్టణ ఠాణా, కె.రక్షణనిధిపై తిరువూరు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల ఉపసంహరణ విషయంలో బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. కేసులు దర్యాప్తు దశలో ఉండగా ఉపసంహరణ కోరడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తుది నివేదిక దాఖలు చేయడానికి ముందే కేసుల ఉపసంహరణ కోరడం సరికాదంది. ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల ఉపసంహరణ వ్యవహారంలో ఇప్పటికే నమోదైన వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్ను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డిపై దాడికి నిరసనల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై నూజివీడు పోలీసులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మరో 13 మందిపై, కె.రక్షణనిధి మరికొందరిపై తిరువూరు పోలీసులు 2018లో కేసులు నమోదు చేశారు. వీటిని ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఈ ఏడాది ఏప్రిల్ 29న హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్టు సుమోటో పిల్గా పరిగణించి బుధవారం విచారణ జరిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్లతో వైకాపా నాయకుడి రహస్య మంతనాలు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వాలంటీర్లతో విశాఖ తూర్పు వైకాపా నాయకుడు ఒకరు రహస్య సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. -
‘సాక్షి’ యాజమాన్యానికి సీఎం రమేష్ లీగల్ నోటీసు
‘సాక్షి’ టీవీ, పత్రిక యాజమాన్యానికి రాజ్యసభ సభ్యుడు, భాజపా అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ లీగల్ నోటీసు పంపారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
సంక్షిప్త వార్తలు
తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ గురువారం దర్శించుకున్నారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్