‘వృక్షా’బంధన్‌!

విశాఖ నగరంలోని రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం సమీపంలో బుధవారం వైవిధ్యంగా నిర్వహించిన ‘రక్షాబంధన్‌’ వేడుక ఆకట్టుకుంది. నగరంలోని గ్రీన్‌ క్లైమేట్‌ సంస్థ సభ్యులు పప్పు దినుసులతో చేసిన రాఖీని

Published : 11 Aug 2022 03:30 IST

విశాఖ నగరంలోని రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం సమీపంలో బుధవారం వైవిధ్యంగా నిర్వహించిన ‘రక్షాబంధన్‌’ వేడుక ఆకట్టుకుంది. నగరంలోని గ్రీన్‌ క్లైమేట్‌ సంస్థ సభ్యులు పప్పు దినుసులతో చేసిన రాఖీని దాదాపు 150 ఏళ్ల మర్రిచెట్టుకు కట్టారు. ‘ప్లాస్టిక్‌తో తయారు చేసిన రాఖీలు వాడొద్దు.. ప్రకృతిని ప్రేమించాలి’ అని ప్రచారం చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులను వృక్షం వద్దకు తీసుకొచ్చి అవగాహన కల్పించారు.

- ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని