పల్నాడు గడ్డపై పతాక సౌరభం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బుధవారం జాతీయ పతాక శోభాయాత్ర వైభవంగా సాగింది. కలెక్టర్‌ శివశంకర్‌, జేసీ శ్యాంప్రసాద్‌, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు,

Published : 11 Aug 2022 03:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బుధవారం జాతీయ పతాక శోభాయాత్ర వైభవంగా సాగింది. కలెక్టర్‌ శివశంకర్‌, జేసీ శ్యాంప్రసాద్‌, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, జంగా కృష్ణమూర్తి యాత్ర ప్రారంభించారు. పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల నుంచి సత్తెనపల్లిరోడ్డులోని క్రీడా ప్రాంగణం వరకూ ప్రదర్శన సాగింది. 1000 మీటర్ల జాతీయ పతాకంతో నిర్వహించిన ప్రదర్శనలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని