చెత్త పన్నుకు కొత్త ఐడియా
చెత్త పన్నుపై ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎలాగైనా దీన్ని వసూలు చేయాలనే తలంపుతో ముందుకెళుతోంది.
ఆస్తి పన్ను శ్లాబ్ల ఆధారంగా ఇక బాదుడు
విశాఖలో వసూలుకు రంగం సిద్ధం
ఈనాడు - అమరావతి
చెత్త పన్నుపై ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎలాగైనా దీన్ని వసూలు చేయాలనే తలంపుతో ముందుకెళుతోంది. ప్రజలకు ‘భారం’ తెలియకుండా వారి నుంచి ఈ పన్ను రాబట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కొత్త ఆలోచన చేసింది. వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్న చోట ఇళ్లకు ప్రజలు అర్ధ సంవత్సరానికి చెల్లిస్తున్న ఆస్తి పన్నును శ్లాబులుగా విభజించి వీటిపై చెత్త పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ విధంగా చెత్త పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళిక తయారు చేసింది. ఈ విధానాన్ని రాష్ట్రంలో పెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటైన విశాఖలో మొదట అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అక్కడి పాలకవర్గం ఆమోదించింది. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరిస్తున్నందుకు పన్ను వసూలు చేయాలన్న నిర్ణయంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో పలు పుర, నగరపాలక సంస్థల్లో కనిష్ఠంగా 30, గరిష్ఠంగా రూ.120 చొప్పున చెత్త పన్ను వసూలు చేయాలని పాలకవర్గాలు మొదట తీర్మానించాయి. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా ఇప్పటికీ ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతున్నారు. దీనికితోడు చెత్త పన్ను అనగానే ప్రజలకు చిర్రెత్తుతోంది. ఈ పరిణామాలతో సీఎం సొంత జిల్లా కడప నగరపాలక సంస్థలో పాలకవర్గంతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెత్త పన్ను వసూళ్లు నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. విశాఖలోనూ చెత్త పన్ను వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. గత ఆరు నెలల్లో రూ.35 కోట్ల లక్ష్యంలో కేవలం రూ.12 కోట్లే వసూలు చేయగలిగారు.
ఎవరికీ మినహాయింపు లేదు
విశాఖలో ఆస్తి పన్ను ఐదు శ్లాబ్లుగా విభజించారు. వీటిపై చెత్త పన్ను నెలకు ఎంత వసూలు చేయాలో నిర్ణయించారు. ఉదాహరణకు అర్ధ సంవత్సరానికి కనిష్ఠంగా రూ.200 లోపు ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలు నెలకు రూ.20 చొప్పున
చెత్త పన్ను చెల్లించాలి. అర్ధ సంవత్సరానికి గరిష్ఠంగా రూ.4 వేలు కంటే మించి ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలు చెత్త పన్ను రూ.120 చెల్లించేలా పాలకవర్గం తీర్మానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)