పోలవరం నీటి లెక్కలపై తకరారు!
పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఎంత ప్రవాహం దిగువకు మళ్లిందనే లెక్కల నిబద్ధతపై సందేహాలు ఏర్పడ్డాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద లెక్కలకు- పోలవరం లెక్కలకు పొంతన
సరిదిద్దాలని కేంద్ర జలసంఘం సూచనలు
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఎంత ప్రవాహం దిగువకు మళ్లిందనే లెక్కల నిబద్ధతపై సందేహాలు ఏర్పడ్డాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద లెక్కలకు- పోలవరం లెక్కలకు పొంతన ఉండట్లేదు. ధవళేశ్వరం బ్యారేజి లెక్కలకు ఏళ్ల తరబడి అదే విధానం అనుసరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు భద్రాచలం గోదావరి వద్ద, శబరి.. ఆ దిగువ ప్రవాహాలు కలిపి ధవళేశ్వరానికి చేరేవి. లెక్కల్లో పెద్ద తేడాలు రాలేదు. భద్రాచలం... ధవళేశ్వరం మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం జరగకపోయినా స్పిల్ వే 48 గేట్ల నుంచి నీటిని వదులుతున్నారు. భద్రాచలానికి, ధవళేశ్వరానికి మధ్య ప్రస్తుతం వ్యత్యాసం రావచ్చు. మధ్యలో కొంతనీరు పోలవరం జలాశయంలో నిల్వ ఉంటుంది. కానీ పోలవరం.. ధవళేశ్వరం లెక్కల మధ్య తేడా రావడంతో కేంద్ర జలసంఘం జోక్యం చేసుకుందని సమచారం.
పోలవరంలో 21.83 లక్షలు, ధవళేశ్వరంలో 25.86 లక్షలు
జులైలో గోదావరి భారీ వరదల్లో పోలవరం స్పిల్ వే వద్ద 21.83 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు లెక్కలు నమోదయ్యాయి. అదే సమయంలో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 25.86 లక్షల క్యూసెక్కులు వదిలారు. రెండు ప్రాజెక్టుల మధ్య దాదాపు 4 లక్షల క్యూసెక్కుల తేడా ఉండటాన్ని కేంద్ర జలసంఘం గుర్తించింది. ఇక్కడి లెక్కలపై దృష్టిసారించి.. పోలవరం స్పిల్ వే దిగువన స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ తర్వాత నదిలో కలిసేచోట నీటిలెక్కలు తీయాలని సూచించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్, సీఈ దీపక్చంద్ర పాటిల్ సూచించినట్లు తెలిసింది. వాళ్లు పోలవరం ప్రాజెక్టులో రెండు రోజులు తిరిగి అన్నీ పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక సూచనలు చేశారు. పోలవరం నీటిప్రవాహ లెక్కలను సరిచేయాలనేది ఇందులో కీలకాంశం. ఇటీవల వరదల ముందే పోలవరం వద్ద ప్రవాహ లెక్కలను సరిచేసే పని చేపట్టారు. భద్రాచలం వద్ద విడుదలయ్యే నీరు, పోలవరం, ధవళేశ్వరం మధ్య నీటిలెక్కల్లో భారీ తేడా ఉంటోంది. దీంతో నీటిని లెక్కించే ఫార్ములాను కొంత మార్చారు. అయినా ఈ లెక్కలు సరిపోవడం లేదు. మరోవైపు పోలవరం పనుల షెడ్యూలును మళ్లీ తయారుచేసి పంపాలని కోరారు. ప్రస్తుతం వరదలకు ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో నీరు నిలిచిపోవడంతో పనులు జరగట్లేదు. గోదావరికి మళ్లీ వరద వస్తోంది. అక్టోబరు వరకూ పనులు ప్రారంభించగలిగే అవకాశాలు తక్కువేనని ఇంజినీర్లు అంటున్నారు. తదనుగుణంగా మళ్లీ షెడ్యూలు రూపొందించాలి.
ఎగువ కాఫర్ డ్యాం వద్ద కూడా తేడా
ఎగువ కాఫర్ డ్యాం వద్ద కూడా నీటిమట్టాల్లో తేడాలు కనిపించాయి. పోలవరం స్పిల్వే వద్ద గరిష్ఠంగా 36.545 మీటర్ల నీటిమట్టం గుర్తించగా, అదే సమయంలో ఎగువ కాఫర్ డ్యాం వద్ద 36.890 మీటర్ల నీటిమట్టాలు గరిష్ఠంగా నమోదయ్యాయి. గోదావరి సహజ ప్రవాహమార్గంలో తొలుత ప్రవాహాలు ముందుకొచ్చి.. తర్వాత మళ్లింపు మార్గం వైపు వెళ్లడం, మధ్యలో కొండ ఉండటం, అప్రోచ్ ఛానల్ తవ్వకం పూర్తి చేయకపోవడం ఇలాంటివన్నీ ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ