గ్రంథాలయ, ఎయిడెడ్ సిబ్బంది పదవీవిరమణ వయసు 62ఏళ్లు
జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, ఎయిడెడ్ సిబ్బంది పదవీవిరమణ వయసును 62ఏళ్లకు పెంచే దస్త్రానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్
ఈనాడు, అమరావతి: జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, ఎయిడెడ్ సిబ్బంది పదవీవిరమణ వయసును 62ఏళ్లకు పెంచే దస్త్రానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.మధుసూదనరాజు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ ఆమోదం అనంతరం చట్ట సవరణ చేసి ఉత్తర్వులు అమలు చేస్తారు. ప్రభుత్వం జనవరి నుంచి ఉద్యోగులకు పదవీవిరమణ వయసును 60 నుంచి 62ఏళ్లకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తమకూ పదవీవిరమణను 62 సంవత్సరాలకు పెంచాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, ఎయిడెడ్ సిబ్బంది, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు, కార్పొరేషన్ల ఉద్యోగులు గత కొంతకాలంగా కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్