కదల్లేని ప్రతిమ.. కదిలించే జ్ఞాపకమై!

రక్షాబంధన్‌ వస్తే తోబుట్టువులు నలుగురు కలిసి ఆనందంగా పండగ చేసుకునేవారు. వారిలో ఒకరు రోడ్డు ప్రమాదంలో దూరమైతే మిగతా ముగ్గురు తట్టుకోలేకపోయారు. ఆమె

Updated : 12 Aug 2022 12:01 IST

సోదరి విగ్రహంతో రాఖీ వేడుక

శంఖవరం, న్యూస్‌టుడే: రక్షాబంధన్‌ వస్తే తోబుట్టువులు నలుగురు కలిసి ఆనందంగా పండగ చేసుకునేవారు. వారిలో ఒకరు రోడ్డు ప్రమాదంలో దూరమైతే మిగతా ముగ్గురు తట్టుకోలేకపోయారు. ఆమె విగ్రహాన్ని చేయించి ఈ ఏడాది రక్షాబంధన్‌ను ఊరంతా పండగలా నిర్వహించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన గాబు మణి(29) అనే మహిళకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 7 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. ఆమె అకాల మృతిపై అక్క వరలక్ష్మి, అన్నయ్య శివ, తమ్ముడు రాజా తీవ్రంగా ఆవేదన చెందారు. జ్ఞాపకాలను పదిలపరచుకొనేందుకు విగ్రహాన్ని చేయించుకున్నారు. రక్షాబంధన్‌ వేడుక వేళ గురువారం తోబుట్టువులు ఆ సోదరి విగ్రహాన్ని ఊరిలో ఊరేగించారు. చివరికి తమ ఇంటి వద్ద ప్రతిష్ఠించుకున్నారు. ‘ఏటా రాఖీ పండుగను అంతా కలిసి ఆనందంగా జరుపుకొనే వాళ్లం. ఈసారి ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె మా మదిలో నిరంతరం స్మరించుకునేలా విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం’ అని తెలిపారు. ద్విచక్ర వాహన ప్రమాదంలో సోదరి మాకు దూరమైంది. బైక్‌పై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని గ్రామంలో ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని