శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి సంతృప్తికర దర్శనాన్ని అందించనున్నట్లు
త్వరలో ‘కల్యాణమస్తు’కు నూతన ముహూర్తం
తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి
తిరుమల, న్యూస్టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి సంతృప్తికర దర్శనాన్ని అందించనున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కరోనా తరువాత శ్రీవారి వాహనసేవలను మాడవీధుల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసి సర్వదర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నామని చెప్పారు. గురువారం స్థానిక అన్నమయ్య భవనంలో డయల్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో గదులు పొందిన భక్తులకు ఎదురయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ను తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో అమలుచేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తితిదే కల్యాణమస్తు కార్యక్రమం వివిధ సాంకేతిక కారణాలతో ఆగింది.. త్వరలోనే పూర్తి ఏర్పాట్లను చేసుకుని నూతన మూహుర్తం తేదీని ప్రకటిస్తామన్నారు.అప్పటి వరకు కల్యాణమస్తు రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేశామని చెప్పారు. శ్రీవారిని జులైలో 23.40 లక్షల మంది భక్తులు దర్శించుకోగా హుండీ కానుకలు అత్యధికంగా రూ.139.33 కోట్లు లభించాయని తెలిపారు.
తితిదే ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృతోత్సవాన్ని తితిదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తితిదే అన్ని కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆదేశించామని చెప్పారు. దీంతోపాటుగా తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు తితిదే ఉద్యోగుల ఆధ్వర్యంలో అజాదీకా అమృతోత్సవ్ భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు.
అందుబాటులో 7వేల గదులే ఉన్నాయి
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందుబాటులో 7 వేల గదుల మాత్రమే ఉన్నాయని, వీటిలో 35 వేల మందికి వసతి కల్పించవచ్చని ఈవో తెలిపారు. కరోనా తర్వాత ప్రతిరోజూ లక్షమందికి పైగా యాత్రికులు తిరుమలకు వస్తున్నారని, దీంతో గదుల ఆక్యుపెన్సీ 180 శాతానికి పైగా నమోదైందని చెప్పారు. భక్తులందరికీ ప్రస్తుతం, భవిష్యత్తులో వసతి ఏర్పాటు చేయడం కష్టమన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు తిరుపతిలోనే వసతి పొంది తమకు కేటాయించిన టైమ్స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో రెండు వేల గదులను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కేటాయిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం