AP Govt: మరో బాదుడు
విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాల్లో 150 అడుగులకంటే ఎక్కువ వెడల్పున్న రహదారి పక్కనే 500 చ.మీ.లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న స్థలంలో రెండు వేల చ.అడుగుల వాణిజ్య భవనం
కొత్తగా ఇంపాక్ట్ ఫీజును అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ప్రధాన రహదారుల పక్కన నిర్మాణాలు చేపడితే వాతే
నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ బాదుడే
విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాల్లో 150 అడుగులకంటే ఎక్కువ వెడల్పున్న రహదారి పక్కనే 500 చ.మీ.లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న స్థలంలో రెండు వేల చ.అడుగుల వాణిజ్య భవనం నిర్మించాలనుకుంటే... ఇక మీదట ఇంపాక్ట్ ఫీజు రూపంలోనే రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (చ.అడుగుకి రూ.150 చొప్పున నిర్ణయించిన ఫీజు పరిగణనలోకి తీసుకుంటే)
ఈనాడు, అమరావతి: రకరకాల పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో పిడుగు వేసింది. ఇప్పటికే ఆస్తిపన్ను ఏటా పెంచేస్తూ, కొత్తగా చెత్తపైనా పన్ను వేసి పట్టణ ప్రజలపై మోయలేని భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు... ‘ఇంపాక్ట్ ఫీజు’ పేరుతో నగర, పట్టణ ప్రజలతో పాటు, వివిధ నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల ప్రజలపైనా తీవ్ర భారం మోపింది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలతో పాటు, ఆయా నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రహదారుల పక్కన కొత్తగా భవనాలు నిర్మించుకునేవారు ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర ఛార్జీలకు అదనంగా ఇకపై ‘ఇంపాక్ట్’ ఫీజు కూడా చెల్లించాలని పురపాలకశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర ఛార్జీలకు అదనంగా దీన్ని చెల్లించాలని పురపాలక శాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. మాస్టర్ప్లాన్ రోడ్లు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, బైపాస్ రోడ్లు, రింగ్రోడ్లను ఆనుకుని పక్కనే ఇళ్లు నిర్మించుకునేవారందరికీ ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న రహదారులతోపాటు నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా రహదారుల నిర్మాణానికి భూసేకరణ దశలో ఉన్నచోటా ఫీజు కట్టాల్సిందేనని తెలిపింది. 60 అడుగులు, దానికిపైన.. 150 అడుగులలోపు వెడల్పున్న రహదారుల్ని ఆనుకుని నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకూ ఈ ఫీజు వర్తిస్తుంది. 150 అడుగులు, దానికి మించి వెడల్పున్న రహదారులకు రెండు పక్కలా 250 మీటర్ల దూరం వరకు నిర్మించే అన్ని రకాల భవనాలూ ఫీజు కట్టాల్సిందే. రాష్ట్రంలో కొన్నేళ్లలో అనేక కొత్త నగరాభివృద్ధి సంస్థల్ని ఏర్పాటుచేయడంతో పాటు, అప్పటికే ఉన్నవాటి పరిధిని విస్తరించారు. దాంతో మెజారిటీ పల్లెటూళ్లు నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చాయి. వాస్తవానికి ఆయా నగరాభివృద్ధి సంస్థలు తమ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధేమీ లేదుగానీ.. ఈ కొత్త విధానం వల్ల ఆయా గ్రామాలవారికి అదనపు వాత మాత్రం పడింది.
వీలైనంత ఎక్కువ లాగేద్దాం..!
‘ఇంపాక్ట్ ఫీజు’ను కూడా ప్రజల నుంచి వీలైనంత ఎక్కువ లాగేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించింది. భవనం నిర్మిత ప్రాంతంలో (బిల్టప్ ఏరియా) ప్రతీ చ.అడుగుకు ఇంత మొత్తమని ధర నిర్ణయించింది. ఆ మొత్తాన్నిగానీ.. అక్కడ స్థలం రిజిస్ట్రేషన్ విలువలో 2నుంచి 3శాతంగానీ.. ఆ రెండిటిలో ఏది ఎక్కువైతే దాన్ని వసూలుచేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జాతీయ రహదారులు, మాస్టర్ప్లాన్ రోడ్లు, ఇతర ప్రధాన రహదారుల పక్కన భూముల రిజిస్ట్రేషన్ ధరలు ఇప్పటికే మిగతా ప్రాంతాలకంటే ఎక్కువుంటాయి. ఇప్పుడు వాటి ధరలో 3శాతమంటే, అక్కడ ఇళ్లు కట్టుకునేవారికి ఇంపాక్ట్ ఫీజు రూపంలో పడే వాత భారీగా ఉండే అవకాశాలున్నాయి.
వడ్డన ఇలా..!
* ప్రభుత్వం విజయవాడ, గుంటూరు, విశాఖ నగరపాలక సంస్థల్ని ఒక కేటగిరీగా, మిగతా నగరపాలక సంస్థల్ని ఒక కేటగిరీగా, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలను ఒక విభాగంగా, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే పంచాయతీల్ని మరో కేటగిరీగా విభజించింది.
* 60 నుంచి 150 అడుగులలోపు వెడల్పున్న రహదారుల్ని ఆనుకుని నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాల్లో.. మళ్లీ 500 చ.మీటర్ల లోపు స్థలంలో కడుతున్న భవనాలు, 500 చ.మీ.లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న స్థలంలో నిర్మిస్తున్న భవనాలని రెండు కేటగిరీగా చేసి పన్ను విధించింది.
* 150 అడుగులు, దానికంటే ఎక్కువ వెడల్పున్న రహదారులకు పక్కన నిర్మించే భవనాల్లో నివాస భవనాలన్నింటినీ ఒక కేటగిరీలో చేర్చింది. వాణిజ్య భవనాల్ని మళ్లీ స్థలం విస్తీర్ణాన్ని బట్టి 500 చ.మీ.లకు లోపు, దానికిపైన అని రెండు కేటగిరీలు చేసింది.
మోయలేని భారం..!
* ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో వాణిజ్య భవనాల నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు బిల్డింగ్ లైసెన్సు ఫీజు, బెటర్మెంట్ ఫీజు, డెవలప్మెంట్ ఛార్జీలు, డ్రైనేజ్, వాటర్ఫీజులు, అనుమతుల్లేని లేఅవుట్లో చేస్తున్న నిర్మాణాలకైతే అదనంగా 14% ఓపెన్ స్పేస్ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంపాక్ట్ ఫీజు భారీగా పడనుంది.
* ఇతర నగరపాలక సంస్థల పరిధిలో రెండు వేల చ.అడుగుల నిర్మితప్రాంతమున్న వాణిజ్యభవనాన్ని 500 చ.మీ.లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న స్థలంలో నిర్మిస్తుంటే.. చ.అడుగుకి రూ.100 చొప్పున రూ.2 లక్షల ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలి.
* 500 అడుగులకంటే ఎక్కువ వెడల్పున్న రహదారులకు ఇరువైపులా 250 మీటర్ల వరకున్న ప్రాంతంలో రెండు వేల చ.అడుగుల నిర్మిత ప్రాంతమున్న నివాస భవన నిర్మాణానికి గుంటూరు, విజయవాడ, విశాఖనగరాల్లో రూ.లక్షన్నర ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలి.
ఆ డబ్బుతో అభివృద్ధి చేస్తారట..!
* ఇంపాక్ట్ ఫీజు రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ప్రత్యేకమైన ఖాతాలో వేసి రహదారుల విస్తరణ, లింక్రోడ్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణంవంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.
* ఫీజును ఆయా నగరాభివృద్ధి సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు సమానంగా పంచుకోవాలని తెలిపింది. నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి రాని పట్టణాలు, నగర పంచాయతీల్లో ఇంపాక్ట్ ఫీజుగా వసూలు చేసిన మొత్తం ఆయా పట్టణ స్థానిక సంస్థలకే వెళుతుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్