ప్రాథమిక విద్య ఛిన్నాభిన్నం
‘ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ప్రాథమిక విద్య ఛిన్నాభిన్నమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన
బడి ఉంటుందో లేదో తెలియక చేరని విద్యార్థులు
విలీన బడులకు వెళ్లకుండా మరికొందరు ప్రైవేటు బాట
3,4,5 తరగతుల విలీనంపై ‘బడి కోసం బస్సు యాత్ర’ నివేదికలో వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ప్రాథమిక విద్య ఛిన్నాభిన్నమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన కల్పించకుండా బలవంతంగా 2.5 లక్షల మంది పిల్లల్ని తరలించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. బడి ఉంటుందో లేదో అనే కారణంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది చేరలేదు. బాలికల పాఠశాలల్లోనూ బాలురను కలిపేశారు’ అని ‘బడి కోసం బస్సు యాత్ర’ నివేదిక పేర్కొంది. పాఠశాలల విలీనంపై ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు పాఠశాల విద్యా పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, యూటీఎఫ్, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులు జులై 25 నుంచి 31 వరకు వారం రోజులపాటు 24 జిల్లాల్లోని 72 పాఠశాలల్ని సందర్శించారు. దీనిపై ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నివేదిక విడుదల చేశారు. గతేడాది 250 మీటర్లలోపు బడుల్లో తరగతులను విలీనం చేశారు. వీటి ఫలితాలేమిటో ఇప్పటి వరకు వివరించలేదు. ఆంగ్ల మాధ్యమం అమలుకు ఇంటింటికీ తిరిగి సంతకాలు సేకరించిన విద్యాశాఖ.. బడుల విలీనంపై మాత్రం తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,480 ప్రాథమిక పాఠశాలలు కాగితాల్లో విలీనమయ్యాయి. నివేదికలో కీలకాంశాలివీ..
తగ్గిన ప్రవేశాలు
* బడి ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో ప్రవేశాలు నిర్వహించలేదు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో ప్రవేశాలు భారీగా తగ్గాయి. గతంలో కంటే విద్యార్థులు పెరిగారని చెప్పే బడులే లేవు. కర్నూలు జిల్లాలో ఒక ప్రాథమిక పాఠశాల నుంచి 37 మందిని హైస్కూల్కు పంపితే అందరూ ప్రైవేటు బడికే వెళ్లిపోయారు.
* 3, 4, 5 తరగతులు తరలిపోతే 1,2 తరగతుల్లో ఎక్కువ చోట్ల 10 మందిలోపే విద్యార్థులు మిగులుతున్నారు. కొన్నిచోట్ల ఇద్దరు, ముగ్గురే ఉన్నారు. చిన్న బడుల్లో చదువురాదంటున్న విద్యాశాఖ వీటిని కొనసాగిస్తుందా? వీటిలో ఉపాధ్యాయులను ఉంచుతుందా? 1,2 తరగతుల్లో విద్యార్థులు లేకపోతే వచ్చే ఏడాది మూడో తరగతికి పిల్లలు ఎక్కణ్నుంచి వస్తారు?
* పాఠశాలల విలీనంలో దూరాన్ని ప్రాథమిక పాఠశాల నుంచే లెక్కించారు. విద్యార్థి ఇంటి నుంచి దూరాన్ని పట్టించుకోలేదు. దీంతో కొన్నిచోట్ల దూరం కిలోమీటరు కంటే ఎక్కువగా ఉంది. పేద తల్లిదండ్రులిద్దరూ ఉదయాన్నే పనికి వెళ్లాల్సి రావడంతో పిల్లల్ని బడికి తీసుకెళ్లి, సాయంత్రం తీసుకురావడం వారికి సాధ్యమవడం లేదు. గోదావరి జిల్లాల్లో పంట కాల్వలు దాటి వెళ్లాల్సి వస్తోంది. పట్టణాల్లో రహదారులపై చిన్నారులు నడిచివెళ్లడం మరింత ప్రమాదకరంగా మారుతోంది.
* ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూళ్లలో తరగతులు విలీనం చేసినచోట పిల్లలు బడికి వెళ్లేందుకు మొరాయిస్తున్నారు. బడి కొత్తగా ఉండటం, దూరం కావడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై బాలల హక్కుల వేదికతో స్వతంత్రంగా అధ్యయనం చేయించాలి.
* ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే కలిసి బడికెళ్లేవారు. ఇప్పుడు చెరో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. కిలోమీటరు దూరం పుస్తకాల సంచితో నడిచి వెళ్లిరావడం పిల్లలకు కష్టమవుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
* శ్రీకాకుళం జిల్లా పలాస, ఎన్టీఆర్ జిల్లా మైలవరం, రామవరప్పాడు ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5.. 1,2 తరగతులను వేర్వేరుగా నిర్వహించడంతో పాఠశాలలు ఛిన్నాభిన్నమయ్యాయి.
* ‘నాడు-నేడు’ మొదటి దశ కింద పనులు చేసిన ప్రాథమిక బడుల నుంచి 3,4,5 తరగతుల పిల్లల్ని తరలించారు. 1, 2 తరగతులకే పరిమితమైన ఈ బడుల అభివృద్ధికి రూ.లక్షలు ఎందుకు ఖర్చు చేసినట్లు? మరోవైపు పిల్లల్ని తరలించాక తీరిగ్గా ఉన్నత పాఠశాలల్లో గదులు నిర్మిస్తుండటం గమనార్హం.
బుల్డోజరు సంస్కరణలు
సామాజిక, ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా బుల్డోజరు సంస్కరణలు అమలు చేస్తున్నారు. బాలికల ఉన్నత పాఠశాలల్లోనూ బాలురను విలీనం చేశారు. కాకినాడ జిల్లా రావులపాలెం మెయిన్లో ఇదే జరిగింది.
* ఉర్దూ, తమిళం వంటి మాధ్యమ పాఠశాలల్ని తెలుగు బడుల్లో కలిపేశారు. తెలుగేతర విద్యార్థులకు ఆ భాష తెలిసిన ఉపాధ్యాయులతో బోధించాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా విలీనం చేశారు. భవిష్యత్తులో సరిహద్దులోని తెలుగు పాఠశాలలను అయా రాష్ట్రాలు ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటి?
* తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ నీర్జాపేట ఓ సామాజిక వర్గ పిల్లలు ఇప్పుడిప్పుడే బడి ముఖం చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని బుచ్చినాయుడు కండ్రిగ ఉన్నత పాఠశాలలో కలిపారు. రోడ్లు దాటి పిల్లలు బడికి వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
* ‘పోరాడి తెచ్చుకున్న బడి ఇది. మూడు తరాలుగా ఇక్కడే చదువుకున్నాం. మా బిడ్డలకు దక్కకుండా పోతోంది’ అని ఏలూరు వెంకటేశ్వరపురానికి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పిల్లలు ఏలూరు నగరం సందులు, గొందులు దాటి పాఠశాలకు వెళ్లాలి.
* విద్యాశాఖ ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. బలవంతంగా పిల్లల టీసీలు తీసుకెళ్లి ఉన్నత పాఠశాలలో ఇచ్చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం నిలిపేస్తున్నారు. పిల్లలు వెళ్లకపోయినా టీచర్లను బలవంతంగా పంపేస్తున్నారు. టీచర్లను బెదిరిస్తున్నారు.
* రోజూ నడిచే దారిని వదిలేసి ఇష్టం వచ్చిన మార్గంలో దూరాన్ని లెక్కించారు. దారిలో చెరువులు, రోడ్లున్నా పట్టించుకోలేదు. వీటిపై తల్లిదండ్రుల వినతులను తీసుకోవడం లేదు. దూరపు బడికి పిల్లల్ని పంపలేక, చెప్పుకుందామంటే మండల విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అందుబాటులో లేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్