అభియోగపత్రం దాఖలులో తాత్సారం.. అనంతబాబుకు సహకరించటమే?
దళిత యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అభియోగపత్రం దాఖలు చేయటంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
దళిత యువకుడి హత్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు
ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపణలు
నిందితుడు బెయిల్ పొందితే.. తమ ప్రాణాలకు ముప్పని బాధితుల ఆందోళన
ఈనాడు, అమరావతి, కాకినాడ: దళిత యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అభియోగపత్రం దాఖలు చేయటంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్(అనంతబాబు) బెయిల్ పొందేలా మార్గం సుగమం చేసేందుకు ప్రణాళిక ప్రకారం జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లు.. అంతకంటే ఎక్కువ శిక్ష పడేందుకు వీలున్న నేరాల్లో నిందితుడికి జ్యుడీషియల్ రిమాండు విధించిన నాటి నుంచి 90 రోజుల్లోగా అభియోగపత్రం వేయకపోతే అతను బెయిల్ పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనంతబాబుకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బెయిల్కు మార్గం సుగమం చేసేందుకేనా?
మే 19న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును నాలుగు రోజుల తర్వాత మే 23న అరెస్టు చేశారు. అదే రోజు న్యాయమూర్తి ఆయనకు రిమాండు విధించారు. ఈ నెల 20 నాటికి ఆయన రిమాండులోకి వెళ్లి 90 రోజులు పూర్తవుతుంది. బెయిల్ కోరుతూ న్యాయస్థానాల్లో ఆయన వేసిన పిటిషన్లు ఇప్పటికే పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. గడువు తేదీలోగా అభియోగపత్రం దాఖలు చేయకపోతే ఆయన బెయిల్ పొందేందుకు వీలు కలుగుతుంది. కేసు దర్యాప్తు తీరు, పోలీసుల నుంచి తగిన చొరవలేకపోవటం వంటి అంశాల్ని గమనిస్తే గడువులోగా అభియోగపత్రం దాఖలు కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిందితుడు విడుదలైతే దర్యాప్తుపై ప్రభావం?
అనంతబాబు బెయిల్పై బయటకు వస్తే తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ బాధితుడి కుటుంబ సభ్యులు, సాక్షులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన జైలు నుంచి విడుదలైతే పలుకుబడి ఉపయోగించి దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తొలుత ఇప్పటివరకూ దర్యాప్తులో గర్తించిన అంశాలతో ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసి.... మరిన్ని వివరాలతో తర్వాత అనుబంధంగా దాఖలు చేసుకునేందుకు వీలున్నా పోలీసుల నుంచి ఆ దిశగా చొరవ లేదు. హత్యకు గురైన సుబ్రహ్మణ్యం దళితుడు కావటంతో.... ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కూడా జోడించారు. ఆ కేసుల్లో 60 రోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేయాలి. కానీ అదీ జరగలేదు.
కస్టడీ పిటిషన్ సమయంలోనూ అదే వ్యూహం
అనంతబాబును కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్, ఈ హత్య కేసును సీబీఐ అప్పగించాలని కోరుతూ హతుడి కుటుంబ సభ్యులు వేసిన వ్యాజ్యం హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని, వాటిపై ఏదో ఒక స్పష్టత రాకుండా అభియోగపత్రం దాఖలు చేసే పరిస్థితి లేదని పోలీసు అధికారులు అనధికారిక సంభాషణల్లో చెబుతున్నారు. అయితే వాటి విచారణకు, అభియోగపత్రం దాఖలుకు సంబంధం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా కేసులో నిందితులు అరెస్టై, జ్యుడీషియల్ రిమాండులోకి వెళ్లినప్పుడు వారిని మొదటి 15 రోజుల్లోనే పోలీసులు కస్టడీకి కోరాలి. అనంతబాబు విషయంలో 15వ రోజున చివరి నిమిషంలో ఆయన్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఎందుకు కస్టడీ అవసరమో సహేతుక కారణాలేవీ ఆ పిటిషన్లో ప్రస్తావించలేదు. న్యాయస్థానం ఆ పిటిషన్ కొట్టేసింది. ఆ తర్వాత దానిపై పోలీసులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. కస్టడీకి తీసుకోకుండా తాత్సారం చేసేందుకే వ్యూహాత్మకంగానే పోలీసులు ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి.
దర్యాప్తు తీరుపై ప్రశ్నలెన్నో?
* హత్య జరిగి దాదాపు మూడు నెలలవుతున్నా ఇప్పటివరకూ నేరఘటనా స్థలాన్ని తేల్చలేదు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని గుర్తించలేదు.
* ఈ నేరంలో అనంతబాబు ఒక్కరే కాకుండా ఆయనకు మరికొంత మంది సహకరించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకూ వారెవరో తేల్చలేదు.
* ఈ కేసు దర్యాప్తు పురోగతిని పూర్తి గోప్యంగా ఉంచుతున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలన, కాల్ డేటా విశ్లేషణ, సెల్ టవర్ డంప్ ఆధారంగా దర్యాప్తు వంటి అంశాలపై పోలీసుల నుంచి స్పష్టత లేదు
* హత్య జరిగిన రోజు రాత్రి అనంతబాబుతో కలిసి ఆయన భార్య అపార్ట్మెంట్లోకి వెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. ఆమెనూ ఇప్పటివరకూ విచారించలేదు
* అనంతబాబు వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు చేశారు తప్ప.. ఆయన చెప్పిన విషయాల్లో ఎంత నిజముందో తేల్చలేదు.
పోలీసుల జాప్యమే..
ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే 90 రోజుల్లోగా అభియోగపత్రం దాఖలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీని వల్ల ఆయనకు బెయిల్ వచ్చే వీలుంది. ఈ కేసులో పోలీసులు తొలి నుంచి నిందితుడికి సహకరించేలాగానే వ్యవహరిస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయటానికి 55 రోజుల సమయం తీసుకున్నారు.
- ముప్పాళ్ల సుబ్బారావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఎమ్మెల్సీ రిమాండ్ పొడిగింపు
రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్టుడే: దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ గడువు ముగియడంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అనంతబాబును పోలీసులు శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. తాజాగా అయిదోసారి కోర్టు ఆయన రిమాండ్ను పొడిగించింది. బెయిల్ కోసం ఎమ్మెల్సీ తరఫు న్యాయవాది మూడోసారి అదే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. బాధితుల తరఫు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు నిందితుడికి బెయిల్ ఇవ్వవద్దంటూ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ నెల 16న తదుపరి వాదనలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు