పార్లమెంటులో పింగళి విగ్రహం ఏర్పాటు చేయండి

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌

Published : 13 Aug 2022 03:43 IST

ఉభయ సభాపతులకు తెదేపా ఎంపీ కనకమేడల లేఖ

ఈనాడు, దిల్లీ: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. ఈ మేరకు వారిద్దరికీ వేర్వేరు లేఖలు రాశారు. ‘‘మన జాతీయ పతాకాన్ని రూపొందించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన పింగళి వెంకయ్యకే దక్కుతుంది. ఆ మహనీయుడు దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం పార్లమెంటులో నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను...’’ అని కనకమేడల విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు